Naatu Naatu: నరేంద్ర మోదీ స్టేడియంలో ‘నాటు నాటు’ సెలబ్రేషన్స్.. డ్యాన్స్ చేసిన గావస్కర్..
‘నాటు నాటు’(Naatu Naatu) పాట ఆస్కార్ (oscars 2023)సెలబ్రేషన్స్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికైంది. ఈ పాటకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) కాలు కదిపి సంతోషం వ్యక్తం చేశారు.
(ఫొటో : స్టార్ స్పోర్ట్స్ తెలుగు)
ఇంటర్నెట్డెస్క్: ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్(RRR) ‘నాటు నాటు’(Naatu Naatu) సెలబ్రేషన్సే. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు(oscars 2023) దక్కించుకుని ప్రపంచవేదికపై సత్తా చాటిన ఈ పాటకు ప్రతి ఒక్కరూ కాలు కదుపుతున్నారు. ఈ ఫీవర్ ఇప్పుడు క్రికెట్కూ పాకింది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు ఈ పాటకు ఫిదా కాగా.. తాజాగా మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) ఇందులో భాగమయ్యారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు(IND vs AUS) ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు స్టేడియంలో ఈ పాటపై స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రీడా ఛానల్తో గావస్కర్ మాట్లాడారు.
ఈ పాటకు ఆస్కార్ దక్కడం ఎంతో సంతోషంగా ఉందని.. ఆర్ఆర్ఆర్ టీమ్కు అభినందనలు తెలియజేశారు. ఈ ఘనత సాధించడంలో ప్రతి ఒక్కరి కృషిని కొనియాడారు. ఈ సినిమా తాను చూశానని.. ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ పాట సెలబ్రేషన్స్ డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఉంటాయని చెప్పారు. ఇక ఈ పాటకు స్టెప్పులేసి తనలో ఉన్న ఉత్సాహాన్ని సన్నీ చాటారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ ఛానల్ ట్విటర్లో పంచుకుంది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(border gavaskar trophy)లో చివరిదైన ఈ టెస్టు ఎలాంటి ఫలితం తేలకుండానే డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్లోకి కూడా టీమ్ఇండియా దూసుకుపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు