WTC Final: తుదిపోరు డ్రా అయితే..?
సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. విజేతను ప్రకటించడానికి ఐసీసీ ఒక సూత్రాన్ని కనుగొనాలని టీమ్ఇండియా దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ
ఐసీసీ ఒక సూత్రం కనుగొనాలి: గావస్కర్
ఇంటర్నెట్డెస్క్: సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. విజేతను ప్రకటించడానికి ఐసీసీ ఒక సూత్రాన్ని కనుగొనాలని టీమ్ఇండియా దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు జట్ల మధ్య ఆసక్తికరంగా సాగుతున్న మ్యాచ్లో వరుణుడు పదేపదే అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటికే నాలుగు రోజుల ఆటలో రెండు రోజులకుపైగా నిలిచిపోయింది. అయితే, ఈ మ్యాచ్కు ఒక రిజర్వ్డే కేటాయించినా ఫలితం తేలేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే గావస్కర్ ఇలా పేర్కొన్నాడు.
‘ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపిస్తోంది. దాంతో ఇరు జట్లూ ట్రోఫీని పంచుకునే అవకాశం ఉంది. ఐసీసీ ఫైనల్స్లో ఒక ట్రోఫీని ఇలా రెండు జట్లు పంచుకోవడం ఇదే తొలిసారి కానుంది. ఫుట్బాల్ ఆటలో విజేతను ప్రకటించాలంటే వాళ్లకు పెనాల్టీ షూట్ఔట్ లేదా మరో పద్ధతిని అవలంబిస్తారు. అలాగే టెన్నిస్లో ఐదు సెట్లు నిర్వహిస్తారు. దాంతో పాటు టై బ్రేకర్ కూడా ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ డ్రాగా పూర్తయితే విజేతను ప్రకటించడానికి ఒక సూత్రాన్ని కనుగొనాలి. ఈ విషయంపై ఐసీసీ క్రికెట్ కమిటీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి’ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత్, న్యూజిలాండ్ జట్లు ఇంగ్లాండ్లోనే ఉంటున్న నేపథ్యంలో గావస్కర్ ఐసీసీకి మరో అద్భతమైన సూచన కూడా చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత మూడు, నాలుగు రోజుల వ్యవధిలో ఇంకో టెస్టు మ్యాచ్ను నిర్వహించాలని దాన్ని ఫైనల్గా పరిగణించాలని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు