T20 World Cup: వెస్టిండీస్పై ఆస్ట్రేలియా ఘన విజయం
కీలక సమయాల్లో తానెంత ప్రమాదకరంగా ఆడతాడో మరోసారి డేవిడ్ వార్నర్ (89*) నిరూపించాడు. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో
ఇంటర్నెట్ డెస్క్: కీలక సమయాల్లో తానెంత ప్రమాదకరంగా ఆడతాడో మరోసారి డేవిడ్ వార్నర్ (89*) నిరూపించాడు. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియా అన్ని రంగాల్లో రాణించి వెస్టిండీస్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (44), లూయిస్ (29), హెట్మెయిర్ (27) రాణించారు. అనంతరం ఆసీస్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 161 పరుగులు (16.2 ఓవర్లలో) చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ (9) విఫలం కాగా. ఓపెనర్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (53) అర్ధశతకాలతో విండీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు శతకం (122) పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఆఖర్లో మిచెల్ ఔటైనా.. మ్యాక్స్వెల్ (0*)తో వార్నర్ ముగించేశాడు. విండీస్ బౌలర్లలో అకీల్, గేల్ చెరో వికెట్ తీశారు. దీంతో పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ (8 పాయింట్లు: +3.183 రన్రేట్), ఆసీస్ (8), దక్షిణాఫ్రికా (6) వరుస స్థానాల్లో నిలిచాయి. ఈ విజయంతో ఆసీస్ రన్రేట్ (+1.216) సౌతాఫ్రికా రన్రేట్ (+0.742)ను దాటేసింది. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా (ప్రొటీస్) మ్యాచ్ ఫలితంపై ఆసీస్ సెమీస్ భవితవ్యం ఆధారపడి ఉంది.
పొలార్డ్ ఫర్వాలేదు.. నడ్డివిరిచిన హేజిల్వుడ్
మొదట బ్యాటింగ్ను దూకుడుగా ప్రారంభించిన విండీస్.. ఆఖరి వరకు అదే ఊపును కొనసాగించలేకపోయింది. దీనికి కారణం ఆసీస్ బౌలర్ హేజిల్వుడ్ (4/39). స్వల్ప వ్యవధిలో వికెట్లను తీస్తూ విండీస్ భారీ స్కోరు సాధించకుండా చేయడంలో సఫలమయ్యాడు. ఓపెనర్లు క్రిస్ గేల్ (15), లూయిస్ (29) తొలి వికెట్కు 2.2 ఓవర్లలోనే 30 పరుగులు రాబట్టారు. అయితే గేల్ ఔటయ్యాక వచ్చిన పూరన్ (4), రోస్టన్ ఛేజ్ (0) వరుసగా పెవిలియన్కు చేరడంతో విండీస్ ఇబ్బందుల్లో పడింది. అయితే లూయిస్తో కలిసి హెట్మెయిర్ (27) ఇన్నింగ్స్ను కాస్త నిలబెట్టినా.. మరోసారి ఒత్తిడి లోనై వికెట్లను చేజార్చుకున్నారు. అయితే పొలార్డ్ (44), రస్సెల్ (18*) బ్యాట్ను ఝళిపించడంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఆఖరి మ్యాచ్ ఆడుతున్న డ్వేన్ బ్రావో (10) ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్ 4.. స్టార్క్, జంపా, కమిన్స్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.