IND vs NZ: ఆరోజు నేను మళ్లీ క్రికెట్ ఆడతానా అనుకున్నా: అశ్విన్
గతేడాది న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా తాను మళ్లీ క్రికెట్ ఆడతానా లేదా అనే సందిగ్ధంలో ఉన్నానని, అప్పుడు తన జీవితంలో ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నానని టీమ్ఇండియా...
ఇంటర్నెట్డెస్క్: గతేడాది న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా తాను మళ్లీ క్రికెట్ ఆడతానా లేదా అనే సందిగ్ధంలో ఉన్నానని.. అప్పుడు తన జీవితంలో ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నానని టీమ్ఇండియా సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. తాజాగా అతడు టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా కొనసాగుతున్న హర్భజన్సింగ్ (417)ను అధిగమించిన సంగతి తెలిసిందే. కాన్పూర్ వేదికగా కివీస్తో ఆడిన తొలి టెస్టులో అశ్విన్ సోమవారం 419వ వికెట్ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘క్రైస్ట్చర్చ్ వేదికగా 2020 ఫిబ్రవరి 29న న్యూజిలాండ్తో టీమ్ఇండియా తలపడిన రెండో టెస్టులో నేను ఆడలేదు. దీంతో ఆరోజే నేను మళ్లీ క్రికెట్ ఆడతానా? లేదా? అనే సందిగ్ధంలో పడిపోయా. నా భవిష్యత్ ఎటు పోతుంది? నేను ఆడే ఏకైక ఫార్మాట్ టెస్టు క్రికెట్. అందులో మళ్లీ కొనసాగుతానా? అనిపించింది. కానీ, దేవుడు నా పట్ల దయ చూపించాడు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని మళ్లీ రాణించా. తర్వాత నేను నీ (శ్రేయస్) సారథ్యంలో దిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఐపీఎల్ ఆడాను. అక్కడి నుంచే నా పరిస్థితులు మారిపోయాయి’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
హర్భజనే నాకు ప్రేరణ..
ఇక తాను ఆఫ్ స్పిన్నర్గా మారడానికి హర్భజన్సింగే ప్రధాన కారణమని అశ్విన్ చెప్పాడు. ‘నేనెప్పుడూ ఆఫ్ స్పిన్నర్ అవుతానని ఊహించలేదు. 2001లో ఆసీస్పై టీమ్ఇండియా గెలిచినప్పుడు భజ్జీ బౌలింగ్ చూసి మంత్రముగ్ధుడినయ్యా. అప్పుడే తొలిసారి హర్భజన్ను చూశా. దాంతో ఆ సిరీస్ తర్వాత బంతి అందుకొని ఆఫ్స్పిన్ వేయడం ప్రారంభించా. చివరికి ఇలా ఈ స్థాయికి చేరుకున్నా. నన్ను ఎంతగానో ప్రేరేపించిన హర్భజన్కు ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నా. అతడి రికార్డును చేరుకోవడం గొప్ప మైలురాయి. ఇది ఎంతో గర్వించాల్సిన విషయం’ అని వెటరన్ స్పిన్నర్ సంతోషంగా వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..