T20 World Cup: భారత్ కప్పు కొట్టాలనే రహస్య సమావేశం.. బీసీసీఐ పెద్దలతో కెప్టెన్ కోహ్లీ!
లండన్లో రెండో టెస్టు సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జేషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారని తెలిసింది...
ఇంటర్నెట్డెస్క్: లండన్లో రెండో టెస్టు సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జేషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారని తెలిసింది. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్పైనే వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమ్ఇండియా లక్ష్యం ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ గెలవడమే అయినా అక్టోబర్-నవంబర్లో జరిగే ప్రపంచకప్ కూడా కోహ్లీ కెప్టెన్సీకి ఎంతో కీలకం. ఇప్పటికే అతడి సారథ్యంలో టీమ్ఇండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కోల్పోయిన నేపథ్యంలో రాబోయే ఐసీసీ ట్రోఫీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ పెద్దలు జట్టు సారథిని కలిశారని బోర్డు సభ్యుడొకరు పీటీఐకు చెప్పారు.
ఈ సమావేశంలో చర్చించిన అంశాలు బయటకు చెప్పడం మంచిది కాదంటూనే ఐపీఎల్ తర్వాత భారత్ ఆడాల్సింది టీ20 ప్రపంచకప్పే అయినందున దాని గురించే చర్చించి ఉంటారని ఆ అధికారి పేర్కొన్నారు. కాగా, వచ్చేనెలలో టీమ్ఇండియా ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయకముందు కొన్ని ప్రధాన విషయాలపై అటు సెలెక్టర్లు, ఇటు జట్టు యాజమాన్యం దృష్టిసారించాల్సి ఉంది. పొట్టి క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లను కూడా సవాలు చేసే ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏయే ఆటగాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి విశ్లేషిస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇషాంత్, ఉమేశ్ను పొట్టి కప్పుకు ఎంపిక చేసే వీలులేదు. ఇక పోతే బుమ్రా, షమి ఐపీఎల్లో ఆడుతుండటంతో వారి పనిభారాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. మరోవైపు సిరాజ్ టెస్టు క్రికెట్లో రాణిస్తున్నా అతడిని టీ20 ఫార్మాట్కు ఎంపిక చేస్తారా అనేది కీలకంకానుంది.
మరోవైపు దీపక్చాహర్, భువనేశ్వర్ కుమార్ సైతం బుమ్రా, షమికి తోడుగా ఉంటారు. దాంతో పేస్ బౌలింగ్ విభాగంలో ఈ నలుగురూ సరిపోయే అవకాశం ఉంది. మణికట్టు స్పిన్నర్ల జాబితాలో రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్కు తోడు రాహుల్ చాహర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. అలాగే ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేస్తాడా లేదా అంచనా వేయాలి. ఇక నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్లో ఎవరిని పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో సమావేశమౌతారని బీసీసీఐ భావిస్తోంది. ఏదేమైనా టీమ్ఇండియా ఈసారి కచ్చితంగా ప్రపంచకప్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. 2013లో చివరిసారి ధోనీ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత జట్టు ఇప్పటివరకూ మరో ఐసీసీ ట్రోఫీ ముద్దాడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
డేవిడ్ వార్నర్ మైదానంలో దూకుడుగా ఆడేస్తాడు. సోషల్ మీడియాలో వీడియోలతో అభిమానులను అలరిస్తాడు. భారత క్రికెట్ అభిమానులకు చాలా దగ్గరైన ఆటగాళ్లలో వార్నర్ ఒకడు. -
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు గురించి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన జట్టును ఎంపిక చేశారని సెలక్టర్లను అభినందించాడు. -
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
భారీగా పరుగులు చేస్తున్నా.. విరాట్ కోహ్లీపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. వాటిని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్, కైఫ్ కొట్టిపడేశారు. -
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష