IND vs SA: విరాట్ కోహ్లీ మదిలో అదే తిరుగుతుండొచ్చు: గావస్కర్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ (18) విఫలమవ్వడం అందర్నీ నిరాశకు గురిచేసింది. అతడి నుంచి అభిమానులు భారీ...
రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ విఫలంపై మాజీ సారథి
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ (18) విఫలమవ్వడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అతడి నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తుండగా ఎప్పటిలాగే తక్కువ స్కోరుకు ఔటయ్యాడు. నాలుగో రోజు ఆటలో కోహ్లీ భోజన విరామం అనంతం తొలి బంతికే ఔటైన సంగతి తెలిసిందే. మార్కో జాన్సన్ బౌలింగ్లో వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి కీపర్ క్వింటన్ డికాక్ చేతికి చిక్కాడు. దీనిపై మాజీ సారథి సునీల్ గావస్కర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కోహ్లీ మదిలో మరో ఆలోచన ఉన్నట్లు చెప్పాడు.
‘కోహ్లీ ఆడింది సరైనా షాట్ కాదు అని చెప్పొచ్చు. ఎవరైనా విరామం తీసుకొని వచ్చాక కొద్దిసేపు నిలకడగా ఆడతారు. ముఖ్యంగా టెస్టుల్లో.. క్రీజులో కదలిక, ఫుట్వర్క్ కోసం కొద్దిసేపు వేచిచూస్తారు. చివరికి డ్రింక్స్ విరామం పూర్తయ్యాక కూడా.. ఏ బ్యాట్స్మెన్ అయినా షాట్లు ఆడరు. అలాంటిది ఎంతో అనుభవజ్ఞుడైన కోహ్లీ లాంటి ఆటగాడు ఇలా తొలి బంతినే షాట్ ఆడాడంటే.. అతడి మదిలో వేరే ఆలోచన ఉండి ఉంటుంది. త్వరగా పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేద్దామనుకొని ఉండొచ్చు. అతడు ఔటైన బంతి వికెట్లకు దూరంగా వెళుతోంది. అలాంటప్పుడు దాన్ని వదిలేయాల్సింది’ అని గావస్కర్ ఓ క్రీడా ఛానెల్లో అభిప్రాయపడ్డాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.