IPL 2021: ముంబయి ఇండియన్స్ అదృష్టం వారి చేతుల్లో లేదు: చోప్రా
ఐపీఎల్ 14వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరే అదృష్టం వారి చేతుల్లో లేదని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరే అదృష్టం వారి చేతుల్లో లేదని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. శనివారం రోహిత్ సేన దిల్లీ చేతిలో ఓటమిలైన నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమి తర్వాత ముంబయి 10 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోల్కతా, పంజాబ్, రాజస్థాన్ జట్లు కూడా పది పాయింట్లతోనే సమానంగా ఉన్నా రన్రేట్ పరంగా కాస్త మెరుగ్గా ఉండటంతో అవి ముందంజలో ఉన్నాయి.
చోప్రా తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ రోహిత్ టీమ్ పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. ‘ముంబయి ఇక 16 పాయింట్లకు చేరే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరే అదృష్టం కూడా వారి చేతుల్లో లేదు. ఎందుకంటే వారికి ఇంకా రెండు మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఆ రెండింటిలో గెలిచినా 14 పాయింట్లకు మించి వెళ్లదు. ఆ జట్టుకు మరో మూడు, నాలుగు జట్లతో పోటీ ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ మ్యాచ్లో దిల్లీ కాస్తలో తప్పించుకుంది. గతేడాది ముంబయి ఇండియన్స్తో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓటమిపాలైన దిల్లీ క్యాపిటల్స్ ఈసారి రోహిత్ జట్టును రెండుసార్లు మట్టికరిపించింది’ అని చోప్రా పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.