IPL 2021: 140 సాధిస్తే గొప్ప అనుకున్నా.. కానీ..: ధోనీ
ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ ప్రారంభమైంది. ఆసక్తిగా సాగిన ముంబయి, చెన్నై పోరులో ధోనీసేన 20 పరుగులతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానానికి ఎగబాకింది...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ ప్రారంభమైంది. ఆసక్తిగా సాగిన ముంబయి, చెన్నై పోరులో ధోనీసేన 20 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానానికి ఎగబాకింది. అయితే, తొలుత ఈ మ్యాచ్లో చెన్నై తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ స్థితిలో బ్యాటింగ్ కొనసాగించిన రుతురాజ్ గైక్వాడ్ (88; 58 బంతుల్లో 9x4, 4x6), రవీంద్ర జడేజా (26; 33 బంతుల్లో 1x4) ఐదో వికెట్కు 81 పరుగులు జోడించారు. చివర్లో బ్రావో (23; 8 బంతుల్లో 3x6) బ్యాట్ ఝుళిపించాడు. దీంతో చెన్నై 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 156/6తో నిలిచింది.
ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాట్లాడుతూ తాము ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో గౌరవప్రదమైన స్కోర్ సాధిస్తే బాగుంటుందని అనుకున్నట్లు చెప్పాడు. అయితే, రుతురాజ్, బ్రావో అనుకున్నదాని కన్నా మెరుగ్గా ఆడారన్నాడు. 140 పరుగులు చేయడమే అత్యద్భుతమని భావిస్తే 156 పరుగులు సాధించామన్నాడు. ఈ పిచ్ నెమ్మదిగా ఉందని, దాంతో తాము వికెట్లు కోల్పోయామని తెలిపాడు. అలాగే తాను బ్యాటింగ్ చేసేటప్పుడు ఎనిమిది లేదా తొమ్మిదో ఓవర్ నుంచి దూకుడుగా ఆడాలనుకున్నట్లు చెప్పాడు. మరోవైపు రుతురాజ్ చివరి వరకూ నిలిచాడని ధోనీ వివరించాడు.
ఫాస్ట్ బౌలర్లు ఎలా ఆడుతున్నారో పరిశీలించాలని, వాళ్లు పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూడాలని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లు ఎవరైనా చాలా కాలం ప్రాక్టీస్ లేకపోతే కెప్టెన్లకు ఇబ్బంది అవుతుందన్నాడు. ఈ మ్యాచ్లో అంబటి రాయుడు గాయపడిన విషయంపై స్పందిస్తూ అతడు బాగున్నాడని, చేతికి పెద్ద గాయం కాలేదని ధోనీ తెలిపాడు. తర్వాతి మ్యాచ్కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉందని, అప్పటికి రాయుడు కోలుకుంటాడని ధోనీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం