Mumbai Indians: ముంబయి ఇండియన్స్ ఇప్పుడలా ఆడితే కుదరదు.. దంచి కొట్టాల్సిందే!
మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్లోని మిగతా మ్యాచ్ల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ ట్రోఫీ నిలబెట్టుకోవాలంటే తొలి బంతి నుంచే చెలరేగాలని ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు...
ఇంటర్నెట్డెస్క్: మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్లోని మిగతా మ్యాచ్ల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ ట్రోఫీ నిలబెట్టుకోవాలంటే తొలి బంతి నుంచే చెలరేగాలని ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ఏటా టోర్నీ ఆరంభంలో ఆ జట్టు ఓటములతో మొదలుపెడుతుందని, తర్వాత వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుందని అన్నాడు. అయితే, ఈ సీజన్లో ఇప్పటికే సగం మ్యాచ్లు పూర్తయినందున ఇకపై ప్రతి మ్యాచ్ రోహిత్ జట్టుకు ముఖ్యమని తెలిపాడు. పీటర్సన్ ఆన్లైన్ ఓ బ్లాగ్లో ఇలా రాసుకొచ్చాడు.
ముంబయి ఇండియన్స్ మిగిలిన సీజన్లో మూడు, నాలుగు మ్యాచ్లు ఓడడానికి సిద్ధంగా లేదని, ఇకపై సగం మ్యాచ్లే మిగిలి ఉండటంతో తొలి బంతి నుంచే విజయాలు సాధించేలా ఆడాలని పీటర్సన్ సూచించాడు. ఆ జట్టుకున్న ఆటగాళ్లతో అదేం పెద్ద సమస్య కాదని తన అభిప్రాయం వెల్లడించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్పై స్పందించిన అతడు.. ఈ సీజన్ మొదలవ్వడానికి ముందు ఏప్రిల్లో ప్రతి ఒక్కరూ ధోనీసేన పనైపోయిందని విమర్శించారని గుర్తుచేశాడు. అయితే.. టోర్నీ మధ్యలో నిలిచిపోయేసరికి ఆ జట్టు మెరుగైన స్థితిలో నిలిచిందన్నాడు. అప్పుడు విదేశీ ఆటగాళ్లు ఫా డుప్లెసిస్, మొయిన్ అలీ, సామ్కరన్ బాగా ఆడారని మెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు నాలుగు నెలలు విరామం దొరకడంతో మిగిలిన సీజన్లో చెన్నై ఆటగాళ్లు ఎలా ఆడతారనేది కీలకంగా ఉంటుందన్నాడు. ఒకవేళ చెన్నై ఇంతకుముందు లాగే బాగా ఆడితే టైటిల్ సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో ఆ జట్టు పనైపోయిందన్న అందరి నోళ్లు మూతపడతాయని పీటర్సన్ ఎద్దేవా చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం