IPL 2023: ఈ ఐపీఎల్కు దూరమైన కీలక ఆటగాళ్లు వీరే..
శుక్రవారం నుంచి ఐపీఎల్ (IPL 2023) సందడి ప్రారంభం కానుంది. ఆయా జట్లు ఇప్పటికే సిద్ధమైపోయాయి. అయితే కొంతమంది కీలక ఆటగాళ్లు మాత్రం దూరం కావడం అభిమానులను నిరాశకు గురి చేసే అంశం..వాళ్లెవరో చూద్దామా?
క్రికెట్ ప్రేమికులకు ఈ నెలాఖరు నుంచి పండగే. దాదాపు రెండు నెలలపాటు సాగే ఐపీఎల్ (IPL 2023) కోసం ఆటగాళ్లు సిద్ధమయ్యారు. అయితే పలువురు ఆటగాళ్లు గాయాలబారిన పడి ఈ మెగాటోర్నీకి దూరమవుతున్నారు. వాళ్లెవరు, ఎందుకు దూరమవుతున్నారో చూద్దాం!
- రిషభ్ పంత్: గత సీజన్లో దిల్లీ కెప్టెన్ అయిన పంత్.. ఇటీవల రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న విషయం తెలిసిందే. దిల్లీ విజయాల్లో కీలకంగా ఉన్న పంత్ మిస్సవడం ఆ జట్టుకు పెద్ద లోటే. అతడి స్థానంలో డెవిడ్ వార్నర్కు తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు. జట్టులో ఉత్సాహాన్ని నింపేందుకు పంత్ను కొన్ని మ్యాచ్లకైనా డగౌట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హెడ్కోచ్ పాంటింగ్ తెలిపాడు.
- బుమ్రా : వెన్నునొప్పి కారణంగా టీమ్ఇండియా స్టార్ పేసర్ బుమ్రా.. గత ఆరు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ ఐపీఎల్కూ ఆడటం లేదు. అతడి స్థానంలో ముంబయి జట్టు జోఫ్రా ఆర్చర్ సేవలను వినియోగించుకోనుంది.
- శ్రేయస్ అయ్యర్ : వెన్ను గాయం కారణంగా కోల్కతా జట్టుకు దూరమైన శ్రేయస్ స్థానంలో.. నితీష్ రాణాను తాత్కాలిక కెప్టెన్గా నియమించుకుంది. గత రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న శ్రేయస్.. వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు.
- జానీ బెయిర్స్టో : ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటరైన బెయిర్స్టో కాలికి సర్జరీ కారణంగా ఈ ఐపీఎల్కు దూరమవుతున్నాడు. దీంతో పంజాబ్ జట్టు అతడి స్థానంలో మాథ్యూ షార్ట్ను తీసుకుంది.
- ప్రసిధ్ కృష్ణ : వెన్ను నొప్పితో రాజస్థాన్ పేసర్ ప్రసిద్ కృష్ణ ఆ జట్టుకు దూరమవుతున్నాడు. గతేడాది ఆగస్టు నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు. అతడి స్థానంలో సందీప్ శర్మను జట్టు ఎంపిక చేసుకుంది.
- రజత్ పటిదార్ : గతేడాది అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న రజత్.. మడమ గాయం కారణంగా ఈ సీజన్ తొలి మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ మిడిల్ ఆర్డర్ ఆర్సీబీ బ్యాటర్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రస్తుతం ఉన్నాడు.
- ముఖేశ్ చౌదరి : చెన్నై యువ పేసర్ ముఖేశ్ చౌదరి.. ఈ సీజన్కు మిస్సయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతడు త్వరగా కోలుకొని జట్టులోకి రావాలని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్ వెల్లడించాడు.
- జోష్ హేజిల్వుడ్ : గాయం కారణంగా ఇటీవల బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి దూరమైన జోష్ హేజిల్వుడ్.. ఈ ఐపీఎల్ సీజన్ తొలి అర్ధభాగానికి దూరమవుతున్నాడు. ఆర్సీబీ పేస్ దళంలో కీలక బౌలర్ అయిన హేజిల్వుడ్.. గత ఏడాది 20 వికెట్లు పడగొట్టాడు.
- కైల్ జేమీసన్ : న్యూజిలాండ్ పేసర్ అయిన జేమీసన్.. వెన్ను గాయం కారణంగా గత 9 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో చెన్నై జట్టు అతడి స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ సిసిందాతో ఒప్పందం చేసుకుంది.
- గ్లెన్ మాక్స్వెల్: మోకాలి గాయం కారణంగా గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. భారత్తో వన్డే సిరీస్లోనూ జట్టుతోపాటు ఉన్నప్పటికీ రెండు వన్డేలు ఆడలేదు. ఈ క్రమంలో ఆసీస్ కోచ్ కూడా వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో రిస్క్ తీసుకోదల్చుకోలేదని తెలిపాడు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్