IND vs SA : లంచ్ బ్రేక్.. రిషభ్పంత్ హాఫ్ సెంచరీ.. ఆసక్తికరంగా మ్యాచ్
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి టెస్టు మ్యాచ్..
ఇంటర్నెట్ డెస్క్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న నిర్ణయాత్మక ఆఖరి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. సఫారీల బౌలింగ్ను ఎదుర్కొని రిషభ్ పంత్ (51*) అర్ధశతకం సాధించాడు. దీంతో మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజ్లో రిషభ్ పంత్తోపాటు విరాట్ కోహ్లీ (28*) ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఎంతో నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు జాన్సెన్, రబాడ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం భారత్ లీడ్ 143 పరుగులకు చేరింది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 223/10 కాగా.. దక్షిణాఫ్రికా స్కోరు 210/10.
ఆరంభంలోనే షాక్.. అయినా
ఓవర్నైట్ 57/2 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్కు ఇవాళ తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఛెతేశ్వర్ పుజారా (9) జాన్సెన్ వేసిన షార్ట్పిచ్ బంతిని ఆడబోయి పీటర్సెన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానె (1) మరోసారి విఫలమయ్యాడు. దీంతో అతడి భవితవ్యంపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నట్లే. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే విరాట్ కోహ్లీ, పంత్ జోడీ అర్ధశతక (72) భాగస్వామ్యం నిర్మించి పట్టు నిలిపింది. అంతేకాకుండా మరో వికెట్ పడనీయకుండా తొలి సెషన్ను ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.