ఉమేశ్‌కు లైన్‌ క్లియర్‌‌: జట్టులో చోటు

టీమిండియా సీనియర్‌ పేసర్‌ ఉమేశ్ యాదవ్ తిరిగి జట్టులో చేరాడు. ఆదివారం నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షలో అతడు పాసయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి రెండు టెస్టులకు ఉమేశ్ ఎంపికయ్యాడని...

Published : 22 Feb 2021 22:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా సీనియర్‌ పేసర్‌ ఉమేశ్ యాదవ్ తిరిగి జట్టులో చేరాడు. ఆదివారం నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షలో అతడు పాసయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి రెండు టెస్టులకు ఉమేశ్ ఎంపికయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అతడు గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు జట్టుకు దూరమయ్యాడు. కాగా, మూడో టెస్టు తుదిజట్టులో చోటు కోసం హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌తో ఉమేశ్ యాదవ్‌ పోటీపడాల్సి ఉంది. ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో బంతి స్వింగ్‌ అయ్యే అవకాశాలు ఉండటంతో వీరిద్దరిలో ఒకరు ఇషాంత్‌, బుమ్రాతో గులాబి బంతిని పంచుకుంటారు.

జట్టు వివరాలు

విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని