IND vs PAK: పాక్తో మ్యాచ్.. నాకు అలా ఆడటం చాలా ఇష్టం: విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా క్రికెట్లో విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆటగాడు. మంచి ఫామ్తో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగాడు. ఆదివారం భారత్ - పాకిస్థాన్ మ్యాచ్లో అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలను విరాట్ ఓ క్రీడా ఛానెల్తో పంచుకొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో జట్టును నడిపించడంలో కీలక పాత్రధారి రోహిత్ శర్మ.. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో వచ్చే విరాట్ కోహ్లీ ముఖ్య భూమిక పోషిస్తారు. రోహిత్ శర్మకి తనకు ఆటకు సంబంధించిన విషయాల్లో చాలా దగ్గర పోలికలు ఉన్నాయని విరాట్ కోహ్లీ చెప్పడం గమనార్హం. ఓ క్రీడా ఛానెల్తో విరాట్ మాట్లాడుతూ.. లోపాలను అధిగమించి జట్టును విజయపథంలో నడిపించేందుకు ఇద్దరం ప్రయత్నిస్తామని వెల్లడించాడు. అలాగే పాకిస్థాన్తో మ్యాచ్పైనా ప్రత్యేకంగా మాట్లాడాడు.
‘‘పెద్ద టోర్నమెంట్లలో ఎలా విజయం సాధించాలనే అంశంపై చర్చించుకుంటూ ఉంటాం. మా ప్రణాళిక, సన్నద్ధత అటువైపు ఉండేలా చూసుకుంటాం. కొన్నిరోజులపాటు ఆటకు దూరమై వచ్చినప్పటికీ జట్టులో అలాంటి వాతావరణం మాత్రం మారిపోలేదు. గ్రూప్లోని మిగతా ఆటగాళ్ల సహచర్యం అద్భుతం. ఇలా ఉంటే టీమ్ కోసం ఏం చేయడానికైనా ప్లేయర్లు ముందడుగు వేస్తారు. ఆటను అర్థం చేసుకోవడంలో మా ఇద్దరి అభిప్రాయాలు, విజన్ ఒకటే. ప్రధాన లక్ష్యం సాధించే క్రమంలో ఎదురయ్యే అవాంతరాలు, ఇబ్బందులను దాటుకొని ముందుకు వెళ్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యారు. కీలక సమయంలో ఒత్తిడిని ఎలా తట్టుకోగలరనేది ప్రధానం. భారీ మ్యాచుల్లో జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఒక్కసారి టోర్నీలో అడుగుపెడితే ఆటగాళ్లు దారిలోకి వచ్చేస్తారు’’ అని కోహ్లీ తెలిపాడు.
మెల్బోర్న్ వేదికగా దాదాపు లక్ష మంది అభిమానుల మధ్య జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్పైనా విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘‘ఇక్కడ ఆట కంటే.. భారీ సంఖ్యలో వచ్చే ఆటగాళ్ల మధ్య ఆడటం నాకిష్టం. అలాంటి అనుభవం ఈడెన్ గార్డెన్స్లో అనుభవించా. అక్కడ దాదాపు 90వేల మంది క్రికెట్ అభిమానుల మధ్య ఆడటం గొప్పగా అనిపించింది. నేను నడిచి వెళ్తుంటే సచిన్ తెందూల్కర్, సునిల్ గావస్కర్, కపిల్ దేవ్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్ వంటి దిగ్గజాలు అభినందించడం మరువలేను. ఇలాంటిదే గత ప్రపంచకప్ సందర్భంగా మొహాలీలో చూశా. వరల్డ్ కప్లు అంటేనే ఒత్తిడెక్కువ. అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. ఇలాంటి క్షణాలు నాకు చాలా ఇష్టం. గేమ్ ఆడేది ఇలాంటి ఉద్విగ్నభరిత క్షణాలను అనుభవించేందుకు’’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. టీ20 ప్రపంచ కప్లో సూపర్ -12 పోరు మొదలైన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.