Shami-Bumrah partnership: అనుకోని హీరోలపై అభినందనల వెల్లువ
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో పంత్ వికెట్ పడగానే.. భారత్ ఇన్నింగ్స్ మరికొద్ది సేపట్లోనే ముగిసిపోతుందని చాలామంది భావించి ఉంటారు. కానీ మహమ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా జోడి అద్భుతం చేసింది....
వీవీఎస్ లక్ష్మణ్, ద్రవిడ్ భాగస్వామ్యంతో పోల్చిన సెహ్వాగ్
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో పంత్ వికెట్ పడగానే.. భారత్ ఇన్నింగ్స్ మరికొద్దిసేపట్లోనే ముగిసిపోతుందని చాలామంది భావించారు. కానీ మహమ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా జోడి అద్భుతం చేసింది. భారత్కు ఊహించని ఆధిక్యాన్ని ఇచ్చింది. రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి భారత్ను పటిష్ఠ స్థానంలో నిలిపిందీ జోడి. వీరిరువురి పోరాటంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
షమి, బుమ్రా ఇన్నింగ్స్ను ఈడెన్ గార్డెన్స్లో లక్ష్మణ్-ద్రవిడ్ నెలకొల్పిన రికార్డుస్థాయి భాగస్వామ్యంతో పోల్చాడు సెహ్వాగ్. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్లో కంగారూ జట్టు 445 పరుగుచేసి ఆలౌట్ అయ్యింది. భారత్ పేలవ ప్రదర్శనతో 171 పరుగులకే కుప్పకూలింది. దారుణ పరాభవం తప్పదని అందరూ భావించారు. కానీ వీవీఎస్ లక్ష్మణ్-ద్రవిడ్ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడారు. రెండో ఇన్నింగ్స్లో ఇద్దరు కలిసి 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ గెలిచేలా చేశారు. వారి భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ.. పెవిలియన్కు చేరుకుంటున్న లక్ష్మణ్, ద్రవిడ్ ఫొటోల్లోని వారి ముఖాలను మార్చి చేసి షమి, బుమ్రా ఫొటోలను ఉంచాడు సెహ్వాగ్. వీరి కోసం చప్పట్లు కొడుతూనే ఉండాలి అని కొనియాడాడు.
వీరి భాగస్వామ్యాన్ని కీలకమైనదిగా పేర్కొనడం చాలా చిన్నవిషయం. ఈ భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వెల్డన్ షమి, బుమ్రా. - సచిన్
వీరి ఇన్నింగ్స్ చూస్తున్నంతసేపు మజా వచ్చింది. అద్భుతమైన భాగస్వామ్యం. వారికున్న అనుభవంతోనే ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడారు. - లక్ష్మణ్
కష్టాల్లో ఉన్న టీమ్ఇండియాను షమి, బుమ్రా అసాధారణ ప్రదర్శన చేసి కాపాడారు. వీరి ప్రదర్శన జట్టు స్వభావాన్ని తెలుపుతోంది. దీన్ని ప్రత్యేకంగా మలుచుకోండి. - జయ్షా, బీసీసీఐ సెక్రెటరీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434