WTC Final: కీలక పోరులో భారత్ తడ‘బ్యాటు’.. రెండో రోజు ముగిసిన ఆట
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ విజయావకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. టీమ్ఇండియా పోరాటం ఇక డ్రా కోసమే. ఈ కీలక పోరులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ విజయావకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. టీమ్ఇండియా పోరాటం ఇక డ్రా కోసమే. ఈ కీలక పోరులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రహానె (29), కేఎస్ భరత్ (5) నాటౌట్గా ఉన్నారు. భారత్ ఇంకా 318 పరుగులు వెనుకంజలో ఉంది. ప్రతిష్టాత్మక మ్యాచ్లో భారత్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు రోహిత్ (15), శుభ్మన్ గిల్ (13) నిరాశపర్చగా.. టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్ పుజారా (14) కూడా విఫలమయ్యాడు. ఆదుకుంటాడనుకున్న విరాట్ కోహ్లీ (14) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (48; 51 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్, కామెరూన్ గ్రీన్, నాథన్ లైయన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 469 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
భారత్కు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే గట్టి షాక్లు తగిలాయి. రెండు ఫోర్లు బాది మంచి టచ్లో కనిపించిన రోహిత్ను కమిన్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బొలాండ్ వేసిన తర్వాతి ఓవర్లోనే శుభ్మన్ గిల్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. టీ విరామం అనంతరం చెతేశ్వర్ పుజారా కామెరూన్ గ్రీన్ బౌలింగ్లో వికెట్ పడేసుకున్నాడు. కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఎక్స్ ట్రా బౌన్స్తో వచ్చిన బంతిని ఆడి స్లిప్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీమ్ఇండియా 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రహానె, జడేజా క్రీజులో కుదురుకుని భారత్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. జడేజా దూకుడు ప్రదర్శించినా.. రహానె నెమ్మదిగా ఆడాడు. కమిన్స్ వేసిన 22 ఓవర్లో చివరి బంతికి రహానె వికెట్ల ముందు దొరికిపోగా.. రివ్యూ తీసుకోవడంతో ఆ బంతి నో బాల్గా తేలింది. రహానె బతికిపోయాడు. మరోవైపు.. జడేజా దూకుడు కొనసాగించాడు. బొలాండ్ వేసిన 32 ఓవర్లో ఓ ఫోర్ బాదిన అతడు.. మిచెల్ స్టార్క్ వేసిన 34 ఓవర్లో రెండు ఫోర్లు సహా 12 పరుగులు రాబట్టాడు. కానీ, జడేజా జోరుకు నాథన్ లైయన్ బ్రేకులు వేశాడు. లైయన్ బౌలింగ్లో జడ్డూ స్లిప్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ మ్యాచ్ గెలవడం దాదాపు అసాధ్యం. ఇక మన జట్టు పోరాటం డ్రా కోసమే. మ్యాచ్ డ్రా చేసుకోవాలంటే మూడో రోజు మొదటి సెషన్ భారత్కు కీలకం కానుంది. ఉదయం పూట పిచ్ అనుకూలిస్తుంది. ఆసీస్ పేసర్లను ఎదుర్కొని క్రీజులో నిలదొక్కుకోవడం భారత్ ఆటగాళ్లకు సవాలే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు