WTC Final: ఐదో రోజు చిరు జల్లులు! ఆట సాగొచ్చు

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఐదోరోజు ఆట కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరుజల్లులు కురిసేందుకు ఆస్కారం ఉన్నా ఎండ కాస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరం వైపు చల్లని గాలులు వీస్తాయని పేర్కొంది. మబ్బులు పట్టడంతో వెలుతురు తక్కువగా ఉంటుందని వెల్లడించింది....

Published : 22 Jun 2021 09:58 IST

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఐదోరోజు ఆట కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరుజల్లులు కురిసేందుకు ఆస్కారం ఉన్నా ఎండ కాస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరం వైపు చల్లని గాలులు వీస్తాయని పేర్కొంది. మబ్బులు పట్టడంతో వెలుతురు తక్కువగా ఉంటుందని వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4 గంటలకు సౌథాంప్టన్‌లో వర్షం పడటం గమనార్హం.

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఫైనల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అర్థం కావడం లేదు. ఐదు రోజుల నుంచి సౌథాంప్టన్‌లో వర్షం పడటమే ఇందుకు కారణం. వరుణుడి వల్ల తొలిరోజు పూర్తిగా మ్యాచ్‌ జరగలేదు. రెండో రోజు 64.4 ఓవర్ల ఆట సాధ్యమైంది. ఆ రోజు టీమ్‌ఇండియా ఆధిపత్యం సాధించింది. మూడో రోజు మాత్రం కివీస్‌దే పైచేయి. భారత్‌ను 217కు ఔట్‌ చేయడమే కాకుండా 101/2తో నిలిచింది. నాలుగోరోజు, సోమవారం నిరంతరాయంగా వర్షం కురవడంతో ఆట మొత్తంగా సాధ్యపడలేదు. మరి మంగళవారం ఏం జరుగుతుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని