ఇంగ్లాండ్లోనూ రెండు రోజుల్లో ముగుస్తాయి
ఇంగ్లాండ్లోనూ కొన్ని మ్యాచ్లు రెండు రోజుల్లో ముగుస్తాయని, అందులో ఆశ్చర్యమేమీ లేదని ఆ జట్టు పేసర్ జోఫ్రా ఆర్చర్ స్పష్టం చేశాడు...
ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు: ఆర్చర్
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్లోనూ కొన్ని మ్యాచ్లు రెండు రోజుల్లో ముగుస్తాయని, అందులో ఆశ్చర్యమేమీ లేదని ఆ జట్టు పేసర్ జోఫ్రా ఆర్చర్ స్పష్టం చేశాడు. తాజాగా అతడు ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్ వేదికగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన పింక్బాల్ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తైన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ఇంగ్లాండ్ మాజీలు ఆ పిచ్పై విమర్శలు చేశారు. అది టెస్టు క్రికెట్కు సరైన పిచ్ కాదని అన్నారు. ఈ క్రమంలోనే ఆర్చర్ ఇలా స్పందించడం గమనార్హం.
‘మేం ఎలాంటి పిచ్ల మీద ఆడుతున్నామనే విషయం నాకు అవసరం లేదు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాల్సిన పని కూడా లేదు. నేను ఇంగ్లాండ్లో మూడేళ్ల క్రితం గ్లామర్గాన్ జట్టుతో డే/నైట్ మ్యాచ్ ఆడినప్పుడు ఐదు సెషన్లలోనే ఆట అయిపోయింది. అలాగే సస్సెక్స్ జట్టు తరఫున లీకెస్టర్షైర్తో తలపడినప్పుడు కూడా రెండు రోజుల్లోనే పూర్తి అయింది. దీన్ని బట్టి అక్కడ కూడా రెండు రోజుల్లో మ్యాచ్లు పూర్తవుతాయని తెలుస్తుంది. ఇంకా నిజం చెప్పాలంటే భారత్లో ఆడేటప్పుడు స్పిన్ పిచ్లే ఉంటాయని ముందే ఆశించాలి. బ్యాటింగ్ చేయడం అంత తేలికకాకపోయినా.. పెద్ద సమస్య కాదు’ అని ఆర్చర్ అందులో వివరించాడు.
కాగా, ఈ సిరీస్లో ఆర్చర్ ఇప్పటివరకు రెండు టెస్టులే ఆడాడు. తొలి టెస్టులో 3 వికెట్లు తీసిన అతడు పింక్బాల్ టెస్టులో ఒక్క వికెటే పడగొట్టాడు. దీంతో మొత్తంగా 4 వికెట్లే తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు రెండో టెస్టులో ఆర్చర్కు బదులు తుది జట్టులోకి తీసుకున్న స్టువర్ట్ బ్రాడ్ గత రెండు టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.