Ambati Rayudu: రాయుడు ‘రిటైర్మెంట్’ షాక్.. క్లారిటీ ఇచ్చిన చెన్నై..!
రాయుడు కొద్దిసేపటి క్రితమే ఒక ఆసక్తికర ట్వీట్ చేసి వెంటనే దాన్ని తొలగించాడు. ఇదే తనకు చివరి టీ20 లీగ్ అని, వచ్చే ఏడాది నుంచి ఈ మెగా...
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రా క్రికెటర్, చెన్నై టీమ్ టాప్ కీలక బ్యాట్స్మన్ అంబటి రాయుడు ఒక్క ట్వీట్తో అభిమానులకు షాకిచ్చి తర్వాత గందరగోళానికి గురిచేశాడు. దీంతో ఇప్పుడు అతడి పేరు ట్విటర్లో మార్మోగుతోంది. ఈ మధ్యాహ్నం రాయుడు ఒక ఆసక్తికర ట్వీట్ చేసి వెంటనే దాన్ని తొలగించాడు. ఇదే తనకు చివరి టీ20 లీగ్ అని, వచ్చే ఏడాది నుంచి ఈ మెగా ఈవెంట్లో ఆడనని అందులో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనకు ఈ మెగా టోర్నీలో ఆడేందుకు అవకాశాలు ఇచ్చిన ముంబయి, చెన్నై జట్లకు కృతజ్ఞతలు తెలిపాడు. కొద్ది క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్గా మారింది. అయితే కాసేపటికే రాయుడు ఆ ట్వీట్ను తన ఖాతా నుంచి తొలగించాడు. దీంతో రాయుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం గాక.. క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు.
అయితే రాయుడు డిలీట్ చేసిన ట్వీట్ సోషల్మీడియాలో వైరల్ అవడంతో చెన్నై జట్టు సీఈఓ విశ్వనాథ్ దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను అతడితో మాట్లాడాను. రాయుడు రిటైర్ అవ్వట్లేదు. ఈ సీజన్లో అతడు తన ఆటతీరుతో అసంతృప్తిగా ఉన్నాడు. అందువల్ల పొరబాటుగా ఆ ట్వీట్ చేసి ఉంటాడు. కానీ ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. కచ్చితంగా అతడు రిటైర్ అవ్వట్లేదు’’ అని విశ్వనాథ్ మీడియాకు వెల్లడించారు.
2019లో ప్రపంచకప్ జట్టుకు రాయుడును ఎంపిక చేయకపోవడంతో అతడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక