భూమి ‘జ్వరం’ తానే తగ్గించుకుంటుంది!
పెరుగుతున్న భూతాపంతో పరిస్థితి ఎప్పుడైనా అదుపు తప్పొచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే భూమి రంగంలోకి దిగుతుంది. పరిస్థితి పూర్తిగా చేజారి పోతోందని అనిపించినప్పుడు సిలికేట్ క్షీణత ప్రక్రియతో తనను తాను సరిదిద్దుకుంటుంది.
పెరుగుతున్న భూతాపంతో పరిస్థితి ఎప్పుడైనా అదుపు తప్పొచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే భూమి రంగంలోకి దిగుతుంది. పరిస్థితి పూర్తిగా చేజారి పోతోందని అనిపించినప్పుడు సిలికేట్ క్షీణత ప్రక్రియతో తనను తాను సరిదిద్దుకుంటుంది.
జ్వరం వచ్చినప్పుడు ఒంటికి చెమట పడుతుంది. తర్వాత జ్వరం తగ్గుతుంది. ఉష్ణోగ్రతను తగ్గించుకోవటానికి మన శరీరం చేసే ప్రయత్నమిది. మనలాగే భూమి సైతం తన ఉష్ణోగ్రతను తానే నియంత్రించు కుంటుందంటే నమ్ముతారా? మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అధ్యయనం గురించి తెలిస్తే దీన్ని నమ్మి తీరాల్సిందే. స్థిరీకరణకు అవసరమైన సమాచార యంత్రాంగం భూమికి ఉన్నట్టు ఇది నిర్ధారించింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పటానికి ముందే వాతావరణాన్ని ఈ యంత్రాంగం తిరిగి స్థిరీకరించుకుంటుందని, ఇందుకు లక్షలాది ఏళ్లు పడుతుందని పేర్కొంది. అంటే ప్రపంచ ఉష్ణోగ్రతలను జీవుల ఆవాసానికి తగినంత స్థాయిలో ఉండేలా భూమి తనకు తానే కాపాడుకుంటుందన్నమాట. అయితే అప్పుడే అంత ఎగిరి గంతేసియాల్సిన పనిలేదు. మనం ఇప్పటికే భూమికి కోలుకోలేని నష్టాన్ని కలిగించాం. విపత్తుల రూపంలో దాని పర్యవసానాలనూ అనుభవిస్తున్నాం. ఇప్పటి కిప్పుడు దీన్ని సరిదిద్దుకునే అవకాశమైతే లేదు. కర్బన ఉద్గారాలను తగ్గించటానికి ప్రయత్నాలు జరుగుతున్నా ఫలితం అంతంతే. ఎప్పుడైనా పరిస్థితి అదుపు తప్పొచ్చు. భూమి కూడా అలాంటి పరిస్థితుల్లోనే రంగంలోకి దిగుతుంది. పరిస్థితి అదుపు తప్పుతోంది, పూర్తిగా చేజారి పోతోందని అనిపించి నప్పుడు తనను తాను సరిదిద్దుకుంటుంది. ఇంతకీ దీన్నెలా సాధిస్తుంది? ఇందుకు ‘సిలికేట్ క్షీణత’ దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. ఖనిజాలు రసాయనికంగా క్షీణించే క్రమంలో కొత్త ఖనిజాలుగా, ఖనిజ ఉత్పత్తులుగా రూపాంతరం చెందుతాయి. హేలైట్, కాల్సైట్ వంటి ఖనిజాలైతే పూర్తిగా కరిగిపోతాయి కూడా. ఇతరత్రా ఖనిజాలు.. ముఖ్యంగా సిలికేట్ ఖనిజాలు హైడ్రాలిసిస్ అనే రసాయనిక చర్యతో మారిపోతాయి. ఇది నెమ్మదిగా సాగే ప్రక్రియ. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఉపరితల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వీటి రసాయన క్షీణత వేగం పుంజుకుంటుంది. అప్పుడు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను మరింత ఎక్కువగా సంగ్రహిస్తాయి. ఇది సిలికాన్ రాళ్లలో నిక్షిప్తమవుతుంది. ఫలితంగా వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇలా ప్రపంచ ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తుంటాయి. ఇలా గత 66 కోట్ల కాలంలో సగటు ప్రపంచ ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వీటికి గణిత సూత్రాలను అన్వయించి స్థిరీకరణ ప్రక్రియ తీరును అంచనా వేశారు. లక్షలాది ఏళ్ల కాలానికి ఓసారి భూమి అత్యంత అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నట్టు గుర్తించారు. వాతావరణ పరిస్థితులు గణనీయంగా మారిపోయినా, చాలాసార్లు మహా అంతర్థానాలు సంభవించినా జీవజాతులను భూమి ఎలా కాపాడుకోగలుగుతోందనే రహస్యాన్ని ఇది విప్పి చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూత్రాన్ని తాగు నీరుగా మార్చే స్పేస్సూట్
మూత్రాన్ని తాగే నీరులా మారిస్తే? ఇదేం చోద్యమనుకోకండి. మున్ముందు అంతరిక్షంలో సుదీర్ఘకాలం నడిచే వ్యోమగాములకు ఇదెంతో అవసరం. -
జింక్ సూక్ష్మక్రిములు!
వరి పండించే రైతులకు శుభవార్త. పంట పొలాల్లో జింక్ లోపాన్ని తగ్గించటానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్-బనారస్ హిందూ యూనివర్సిటీ (ఏఐఎస్-బీహెచ్యూ) పరిశోధకులు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. -
కాలేయంలో నాయక కణాలు
అవయవాల్లో కాలేయం తీరే వేరు. ఎప్పుడైనా దెబ్బతిన్నా తిరిగి తానే మరమ్మతు అవుతుంది. దీనికి కారణం కొత్త కణాలు పుట్టుకురావటమేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. -
సాలెగూడు మైక్రోఫోన్
సాలెగూళ్లంటే శాస్త్రవేత్తలకే కాదు.. ఇంజినీర్లకూ ఆసక్తే. దీని దారాలు సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. వీటి స్ఫూర్తితోనే తేలికైన, గాలి ఆడే పదార్థాలను రూపొందించి.. వాటిని విమాన భాగాల తయారీకీ వాడుకుంటున్నారు. -
మరో బొటనవేలు
బొటన వేలు గొప్పతనమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది లేకపోతే దేన్నీ గట్టిగా పట్టుకోలేం. మహా భారతంలో ఏకలవ్యుడి కథ తెలుసుగా. ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి పోటీ రావొచ్చనే భావనతో ఏకలవ్యుడి -
తల కిందుల చెట్టు పుట్టుక గుట్టు రట్టు
బావోబ్యాబ్ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి -
ఆకాశ దేశాన అద్భుత కాంతులు!
రాత్రిపూట ఆకాశం ఎలా ఉంటుంది? ఇంకెలా.. నల్లగా. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తే తెల్లటి వెన్నెల కాస్తుంది. -
3డీ ముద్రణతో రాకెట్ ఇంజిన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. 3డీ ముద్రణతో రూపొందించిన ద్రవ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. -
మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు