సరికొత్త ఛాంపియన్స్!
ఆవిష్కరణ ఎంత గొప్పదైనా అందుబాటులోకి వస్తేనే ప్రయోజనం. అది జన జీవనాన్ని మెరుగు పరచేది, అవసరాలను తీర్చేదైతే మరింత మేలు చేస్తుంది. ఆవిష్కరణలను ప్రజలకు చేరువ చేయటంలో పరిశ్రమల పాత్ర చాలా కీలకం.
ఆవిష్కరణ ఎంత గొప్పదైనా అందుబాటులోకి వస్తేనే ప్రయోజనం. అది జన జీవనాన్ని మెరుగు పరచేది, అవసరాలను తీర్చేదైతే మరింత మేలు చేస్తుంది. ఆవిష్కరణలను ప్రజలకు చేరువ చేయటంలో పరిశ్రమల పాత్ర చాలా కీలకం. అందుకే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఏటా న్యూ ఛాంపియన్స్ కార్యక్రమంలో భాగంగా మధ్యస్థాయి వినూత్న సంస్థలను విజేతలుగా ప్రకటిస్తుంది. పరిశ్రమల నైపుణ్యం, సహజత్వం, ప్రభావాలను గుర్తిస్తూ వీటిని ఎంపిక చేస్తుంది. ఈ సంవత్సరం విజేతల ప్రత్యేకతలు ఇవీ..
వాతావరణ మార్పు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, పెరుగుతున్న అసమానత్వం వంటివన్నీ ప్రపంచానికి రోజురోజుకీ కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ప్రతీ సవాలును మేధావులు, ఆవిష్కర్తలు అవకాశంగానే భావిస్తున్నారు. కొంగొత్త మార్గాలతో ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మునుపెన్నడూ ఎరగని విధంగా గత సంవత్సరం ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా పరిష్కార దృక్పథంతోనే ముందుకు దూసుకుపోతున్నారు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కోవటమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన గమనాన్ని మెరుగు పరచటం మీదా దృష్టి సారించారు. వినూత్న ఆలోచనలకు పెట్టింది పేరైన అంకుర సంస్థలు ఈ విషయంలో మరింత ముందు నడుస్తున్నాయి. అయితే పెద్ద సంస్థలతో పోలిస్తే వీటికి లభించే గుర్తింపు తక్కువే. వీటిని వెలికి తీసి, ప్రపంచానికి చాటాలన్నదే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్కు చెందిన న్యూ ఛాంపియన్స్ కార్యక్రమం ఉద్దేశం. ఈసారి మొత్తం 45 దేశాలకు చెందిన సుమారు 120 అంకుర సంస్థలు ఇందులో పాలు పంచుకున్నాయి. వీటిల్లో మూడు సంస్థలు న్యూ ఛాంపియన్స్ అవార్డులు దక్కించుకున్నాయి. క్లిష్ట సమయాల్లో సుస్థిర వృద్ధి, సామాజిక ప్రభావం, సామర్థ్యాల విభాగంలో ఇవి విజేతలుగా నిలిచి ఔరా అనిపించాయి.
వాడి పారేసే శస్త్రచికిత్స పనిముట్లు
శస్త్రచికిత్సలో వాడే పరికరాలతో ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. కొన్నిసార్లు పరికరాలు విఫలం కావొచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వైద్య సాంకేతిక సంస్థ జెంకో మెడికల్ ఒకసారి వాడి పారేసే వినూత్న సెట్ ఎక్స్ పరిజ్ఞానంతో ఇంప్లాంట్స్ను రూపొందించింది. సాన్ డీగోకు చెందిన ఇది ప్రధానంగా వెన్నెముకలో అమర్చే ఇంప్లాంట్స్పై దృష్టి సారించింది. వీటిని స్టెర్లైజ్ చేసి ఉంచిన పాలిమర్ పరికరాలతో వెన్నెముకలో అమర్చొచ్చు. శస్త్రచికిత్స అనంతరం ఈ పరికరాలన్నీ పారేసేవే. వేరే వాళ్లకు ఉపయోగించటానికి కుదరదు. అందువల్ల సంప్రదాయ శస్త్రచికిత్స పద్ధతుల మాదిరిగా ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశముండదు. మామూలుగానైతే శస్త్రచికిత్స కోసం ఉపయోగించే పనిముట్లను మూడున్నర గంటల సేపు శుభ్రం చేసి క్రిములేవీ లేకుండా చూడాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఖర్చూ ఎక్కువే. అంతసేపు శుభ్రం చేసినా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశముంటుంది. సెట్ ఎక్స్ పరిజ్ఞానంతో జెంకో మెడికల్ రూపొందించిన సాధనాలతో ఇలాంటి ఇబ్బందేమీ ఉండదు. పైగా ఎక్కువ బలాన్ని మోసేలా టైటానియంతో ఇంప్లాంట్స్ను రూపొందించటం విశేషం. ఈ ఇంప్లాంట్స్ సన్నటి రంధ్రాలతో కూడుకొని ఉంటాయి. ఇవి స్పాంజి మాదిరిగా చుట్టుపక్కల పదార్థాలను పీల్చుకుంటాయి. ఇలా ఎముక త్వరగా పెరిగేలా, రక్తనాళాలు ఏర్పడేలా చేస్తాయి. ఆవిష్కరణ పరంగానే కాదు.. పరికరాలను తరలించే విషయంలోనూ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. వెండింగ్ యంత్రం పద్ధతిలో వీటిని చేరవేస్తుండటం విశేషం. అంటే పరికరంలో డబ్బులు వేసి లేదా చెల్లించి ఆసుపత్రి వద్దే కొనుక్కోవచ్చన్నమాట. వైద్య పరికరాల వాణిజ్యంలో ఇలా కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఆసుపత్రులకే కాదు, రోగులకూ ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విధానంతో ఒకో శస్త్రచికిత్సకు వెయ్యికి పైగా డాలర్లు ఆదా అవుతాయి. అందుకే సుస్థిర వృద్ధి విభాగంలో దీనికి పురస్కారం లభించింది.
ఆహారం-పొడి-ఆహారం
కొవిడ్ మహమ్మారి తెచ్చిపెట్టిన పెద్ద చిక్కు- ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరా దెబ్బతినటం. దీన్ని పరిష్కరించటానికి బ్లెండ్హబ్ రూపొందించిన పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతోంది. మిగులు ఆహార ఉత్పత్తులను, నారింజ తొక్క వంటి పారేసే వ్యర్థాలను పొడిగా మార్చి అవసరమైనప్పుడు ఆహారంగా వాడుకోవటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. ప్రత్యేకమైన డీహైడ్రేషన్ పరిజ్ఞానంతో ముందుగా ఆయా పదార్థాలను ఎండిస్తారు. తర్వాత పొడిగా మారుస్తారు. దీంతో పోషక విలువలు పెరగటమే కాదు.. ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. ఈ పొడులను అవసరమైనప్పుడు ద్రవాహారంగా, ఘనాహారంగా, జెల్గా మార్చుకోవచ్చు. అందుకే ఈ పరిజ్ఞానాన్ని ఫ్రెష్2పౌడర్2ఫ్రెష్ అనీ పిలుచుకుంటున్నారు. అల్పాదాయ వర్గాల వారికి దీంతో మంచి పోషకాహారం లభించేలా చూడొచ్చు. 40 అడుగుల పొడవైన కంటైనర్లతో కూడిన సంచార ఆహార ఫ్యాక్టరీల ద్వారా అవసరమైన చోటే ఆహార పొడులను ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. దీంతో నిల్వ చేయటానికి, తరలించటానికి అవసరమయ్యే ఖర్చూ తగ్గుతుంది. అంతర్జాతీయంగా మధ్యవర్తుల అవసరమూ తగ్గుతుంది. ఒకరకంగా ఆహార భద్రతకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందన్నమాట. బ్లెండ్హబ్ ఆహార ఉత్పత్తి కేంద్రాలు మనదేశంలోనూ కొనసాగుతున్నాయి. మెక్సికో, స్పెయిన్, కొలంబియా, థాయ్లాండ్ వంటి దేశాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. స్థానిక రైతులు, చిన్న వ్యాపారులు, స్థానిక స్వచ్ఛంద సేవకులు ఇప్పటికే దీంతో ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ఆహార పదార్థాలను పండించేవారిని, ఉత్పత్తి దారులను, వినియోగదారులను కలిపే మహత్తర మార్గంగా పేరొందింది. ఆహార సరఫరాను సేవా వాణిజ్యంగా మలవటం మూలంగానే బ్లెండ్హబ్ ప్రశంసలు పొందింది. సామాజిక ప్రభావం విభాగంలో విజేతగా నిలిచింది.
వినూత్న డిజిటల్ బోధన
కొవిడ్-19 విజృంభించినప్పుడు విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కానీ హోనోరిస్ యునైటెడ్ యూనివర్సిటీస్ బోధన మాత్రం కొనసాగింది. కారణం ఆగ్మెంటెడ్ రియాల్టీతో బోధించటం. ఆఫ్రికాలో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల్లో మొట్టమొదటి, అతిపెద్ద నెట్వర్క్ కలిగున్నది ఇదే. జీవితంలో ఎప్పటికైనా విజయం సాధించాలనుకునే వారి కలలను వినూత్న విద్యా బోధనతో ఇది నిజం చేస్తోంది. దీని ద్వారా 15 సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిల్లో 71వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది 70 ప్రాంగణాలు, బోధన కేంద్రాలతో ఆన్లైన్ ద్వారా విద్యను బోధిస్తోంది. కొన్నిచోట్ల ప్రత్యక్ష తరగతులూ నిర్వహిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లోని 32 పట్టణాల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. హోనోరిస్ యునైటెడ్ యూనివర్సిటీస్ విద్యార్థులు యూరప్, అమెరికా, ఆసియాలోని 190కి పైగా యూనివర్సిటీలతోనూ అనుసంధానమై నేర్చుకుంటారు. వైద్యం, ఆరోగ్య శాస్త్రం, ఇంజినీరింగ్, ఐటీ, వాణిజ్యం, న్యాయం, భవన నిర్మాణం, లలిత కళలు, ఫ్యాషన్ డిజైనింగ్, మీడియా, రాజనీతి శాస్త్రం, విద్య.. ఇలా పలు రంగాల్లో 420 డిగ్రీలను దీని ద్వారా అందిస్తున్నారు. మరో ఐదేళ్లలో 17 లక్షల మందికి ఉన్నత విద్యను అందించాలనేది దీని సంకల్పం. కాబట్టే అడాప్టివ్ కెపాసిటీ విభాగంలో అవార్డును దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు -
ఏఐ స్టెతస్కోప్
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. -
క్యాన్సర్ తీరును పసిగట్టే ఏఐ
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. -
అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. -
కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్