సరికొత్త ఛాంపియన్స్!
ఆవిష్కరణ ఎంత గొప్పదైనా అందుబాటులోకి వస్తేనే ప్రయోజనం. అది జన జీవనాన్ని మెరుగు పరచేది, అవసరాలను తీర్చేదైతే మరింత మేలు చేస్తుంది. ఆవిష్కరణలను ప్రజలకు చేరువ చేయటంలో పరిశ్రమల పాత్ర చాలా కీలకం.
ఆవిష్కరణ ఎంత గొప్పదైనా అందుబాటులోకి వస్తేనే ప్రయోజనం. అది జన జీవనాన్ని మెరుగు పరచేది, అవసరాలను తీర్చేదైతే మరింత మేలు చేస్తుంది. ఆవిష్కరణలను ప్రజలకు చేరువ చేయటంలో పరిశ్రమల పాత్ర చాలా కీలకం. అందుకే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఏటా న్యూ ఛాంపియన్స్ కార్యక్రమంలో భాగంగా మధ్యస్థాయి వినూత్న సంస్థలను విజేతలుగా ప్రకటిస్తుంది. పరిశ్రమల నైపుణ్యం, సహజత్వం, ప్రభావాలను గుర్తిస్తూ వీటిని ఎంపిక చేస్తుంది. ఈ సంవత్సరం విజేతల ప్రత్యేకతలు ఇవీ..
వాతావరణ మార్పు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, పెరుగుతున్న అసమానత్వం వంటివన్నీ ప్రపంచానికి రోజురోజుకీ కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ప్రతీ సవాలును మేధావులు, ఆవిష్కర్తలు అవకాశంగానే భావిస్తున్నారు. కొంగొత్త మార్గాలతో ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మునుపెన్నడూ ఎరగని విధంగా గత సంవత్సరం ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా పరిష్కార దృక్పథంతోనే ముందుకు దూసుకుపోతున్నారు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కోవటమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన గమనాన్ని మెరుగు పరచటం మీదా దృష్టి సారించారు. వినూత్న ఆలోచనలకు పెట్టింది పేరైన అంకుర సంస్థలు ఈ విషయంలో మరింత ముందు నడుస్తున్నాయి. అయితే పెద్ద సంస్థలతో పోలిస్తే వీటికి లభించే గుర్తింపు తక్కువే. వీటిని వెలికి తీసి, ప్రపంచానికి చాటాలన్నదే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్కు చెందిన న్యూ ఛాంపియన్స్ కార్యక్రమం ఉద్దేశం. ఈసారి మొత్తం 45 దేశాలకు చెందిన సుమారు 120 అంకుర సంస్థలు ఇందులో పాలు పంచుకున్నాయి. వీటిల్లో మూడు సంస్థలు న్యూ ఛాంపియన్స్ అవార్డులు దక్కించుకున్నాయి. క్లిష్ట సమయాల్లో సుస్థిర వృద్ధి, సామాజిక ప్రభావం, సామర్థ్యాల విభాగంలో ఇవి విజేతలుగా నిలిచి ఔరా అనిపించాయి.
వాడి పారేసే శస్త్రచికిత్స పనిముట్లు
శస్త్రచికిత్సలో వాడే పరికరాలతో ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. కొన్నిసార్లు పరికరాలు విఫలం కావొచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వైద్య సాంకేతిక సంస్థ జెంకో మెడికల్ ఒకసారి వాడి పారేసే వినూత్న సెట్ ఎక్స్ పరిజ్ఞానంతో ఇంప్లాంట్స్ను రూపొందించింది. సాన్ డీగోకు చెందిన ఇది ప్రధానంగా వెన్నెముకలో అమర్చే ఇంప్లాంట్స్పై దృష్టి సారించింది. వీటిని స్టెర్లైజ్ చేసి ఉంచిన పాలిమర్ పరికరాలతో వెన్నెముకలో అమర్చొచ్చు. శస్త్రచికిత్స అనంతరం ఈ పరికరాలన్నీ పారేసేవే. వేరే వాళ్లకు ఉపయోగించటానికి కుదరదు. అందువల్ల సంప్రదాయ శస్త్రచికిత్స పద్ధతుల మాదిరిగా ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశముండదు. మామూలుగానైతే శస్త్రచికిత్స కోసం ఉపయోగించే పనిముట్లను మూడున్నర గంటల సేపు శుభ్రం చేసి క్రిములేవీ లేకుండా చూడాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఖర్చూ ఎక్కువే. అంతసేపు శుభ్రం చేసినా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశముంటుంది. సెట్ ఎక్స్ పరిజ్ఞానంతో జెంకో మెడికల్ రూపొందించిన సాధనాలతో ఇలాంటి ఇబ్బందేమీ ఉండదు. పైగా ఎక్కువ బలాన్ని మోసేలా టైటానియంతో ఇంప్లాంట్స్ను రూపొందించటం విశేషం. ఈ ఇంప్లాంట్స్ సన్నటి రంధ్రాలతో కూడుకొని ఉంటాయి. ఇవి స్పాంజి మాదిరిగా చుట్టుపక్కల పదార్థాలను పీల్చుకుంటాయి. ఇలా ఎముక త్వరగా పెరిగేలా, రక్తనాళాలు ఏర్పడేలా చేస్తాయి. ఆవిష్కరణ పరంగానే కాదు.. పరికరాలను తరలించే విషయంలోనూ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. వెండింగ్ యంత్రం పద్ధతిలో వీటిని చేరవేస్తుండటం విశేషం. అంటే పరికరంలో డబ్బులు వేసి లేదా చెల్లించి ఆసుపత్రి వద్దే కొనుక్కోవచ్చన్నమాట. వైద్య పరికరాల వాణిజ్యంలో ఇలా కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఆసుపత్రులకే కాదు, రోగులకూ ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విధానంతో ఒకో శస్త్రచికిత్సకు వెయ్యికి పైగా డాలర్లు ఆదా అవుతాయి. అందుకే సుస్థిర వృద్ధి విభాగంలో దీనికి పురస్కారం లభించింది.
ఆహారం-పొడి-ఆహారం
కొవిడ్ మహమ్మారి తెచ్చిపెట్టిన పెద్ద చిక్కు- ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరా దెబ్బతినటం. దీన్ని పరిష్కరించటానికి బ్లెండ్హబ్ రూపొందించిన పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతోంది. మిగులు ఆహార ఉత్పత్తులను, నారింజ తొక్క వంటి పారేసే వ్యర్థాలను పొడిగా మార్చి అవసరమైనప్పుడు ఆహారంగా వాడుకోవటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. ప్రత్యేకమైన డీహైడ్రేషన్ పరిజ్ఞానంతో ముందుగా ఆయా పదార్థాలను ఎండిస్తారు. తర్వాత పొడిగా మారుస్తారు. దీంతో పోషక విలువలు పెరగటమే కాదు.. ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. ఈ పొడులను అవసరమైనప్పుడు ద్రవాహారంగా, ఘనాహారంగా, జెల్గా మార్చుకోవచ్చు. అందుకే ఈ పరిజ్ఞానాన్ని ఫ్రెష్2పౌడర్2ఫ్రెష్ అనీ పిలుచుకుంటున్నారు. అల్పాదాయ వర్గాల వారికి దీంతో మంచి పోషకాహారం లభించేలా చూడొచ్చు. 40 అడుగుల పొడవైన కంటైనర్లతో కూడిన సంచార ఆహార ఫ్యాక్టరీల ద్వారా అవసరమైన చోటే ఆహార పొడులను ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. దీంతో నిల్వ చేయటానికి, తరలించటానికి అవసరమయ్యే ఖర్చూ తగ్గుతుంది. అంతర్జాతీయంగా మధ్యవర్తుల అవసరమూ తగ్గుతుంది. ఒకరకంగా ఆహార భద్రతకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందన్నమాట. బ్లెండ్హబ్ ఆహార ఉత్పత్తి కేంద్రాలు మనదేశంలోనూ కొనసాగుతున్నాయి. మెక్సికో, స్పెయిన్, కొలంబియా, థాయ్లాండ్ వంటి దేశాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. స్థానిక రైతులు, చిన్న వ్యాపారులు, స్థానిక స్వచ్ఛంద సేవకులు ఇప్పటికే దీంతో ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ఆహార పదార్థాలను పండించేవారిని, ఉత్పత్తి దారులను, వినియోగదారులను కలిపే మహత్తర మార్గంగా పేరొందింది. ఆహార సరఫరాను సేవా వాణిజ్యంగా మలవటం మూలంగానే బ్లెండ్హబ్ ప్రశంసలు పొందింది. సామాజిక ప్రభావం విభాగంలో విజేతగా నిలిచింది.
వినూత్న డిజిటల్ బోధన
కొవిడ్-19 విజృంభించినప్పుడు విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కానీ హోనోరిస్ యునైటెడ్ యూనివర్సిటీస్ బోధన మాత్రం కొనసాగింది. కారణం ఆగ్మెంటెడ్ రియాల్టీతో బోధించటం. ఆఫ్రికాలో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల్లో మొట్టమొదటి, అతిపెద్ద నెట్వర్క్ కలిగున్నది ఇదే. జీవితంలో ఎప్పటికైనా విజయం సాధించాలనుకునే వారి కలలను వినూత్న విద్యా బోధనతో ఇది నిజం చేస్తోంది. దీని ద్వారా 15 సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిల్లో 71వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది 70 ప్రాంగణాలు, బోధన కేంద్రాలతో ఆన్లైన్ ద్వారా విద్యను బోధిస్తోంది. కొన్నిచోట్ల ప్రత్యక్ష తరగతులూ నిర్వహిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లోని 32 పట్టణాల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. హోనోరిస్ యునైటెడ్ యూనివర్సిటీస్ విద్యార్థులు యూరప్, అమెరికా, ఆసియాలోని 190కి పైగా యూనివర్సిటీలతోనూ అనుసంధానమై నేర్చుకుంటారు. వైద్యం, ఆరోగ్య శాస్త్రం, ఇంజినీరింగ్, ఐటీ, వాణిజ్యం, న్యాయం, భవన నిర్మాణం, లలిత కళలు, ఫ్యాషన్ డిజైనింగ్, మీడియా, రాజనీతి శాస్త్రం, విద్య.. ఇలా పలు రంగాల్లో 420 డిగ్రీలను దీని ద్వారా అందిస్తున్నారు. మరో ఐదేళ్లలో 17 లక్షల మందికి ఉన్నత విద్యను అందించాలనేది దీని సంకల్పం. కాబట్టే అడాప్టివ్ కెపాసిటీ విభాగంలో అవార్డును దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూత్రాన్ని తాగు నీరుగా మార్చే స్పేస్సూట్
మూత్రాన్ని తాగే నీరులా మారిస్తే? ఇదేం చోద్యమనుకోకండి. మున్ముందు అంతరిక్షంలో సుదీర్ఘకాలం నడిచే వ్యోమగాములకు ఇదెంతో అవసరం. -
జింక్ సూక్ష్మక్రిములు!
వరి పండించే రైతులకు శుభవార్త. పంట పొలాల్లో జింక్ లోపాన్ని తగ్గించటానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్-బనారస్ హిందూ యూనివర్సిటీ (ఏఐఎస్-బీహెచ్యూ) పరిశోధకులు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. -
కాలేయంలో నాయక కణాలు
అవయవాల్లో కాలేయం తీరే వేరు. ఎప్పుడైనా దెబ్బతిన్నా తిరిగి తానే మరమ్మతు అవుతుంది. దీనికి కారణం కొత్త కణాలు పుట్టుకురావటమేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. -
సాలెగూడు మైక్రోఫోన్
సాలెగూళ్లంటే శాస్త్రవేత్తలకే కాదు.. ఇంజినీర్లకూ ఆసక్తే. దీని దారాలు సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. వీటి స్ఫూర్తితోనే తేలికైన, గాలి ఆడే పదార్థాలను రూపొందించి.. వాటిని విమాన భాగాల తయారీకీ వాడుకుంటున్నారు. -
మరో బొటనవేలు
బొటన వేలు గొప్పతనమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది లేకపోతే దేన్నీ గట్టిగా పట్టుకోలేం. మహా భారతంలో ఏకలవ్యుడి కథ తెలుసుగా. ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి పోటీ రావొచ్చనే భావనతో ఏకలవ్యుడి -
తల కిందుల చెట్టు పుట్టుక గుట్టు రట్టు
బావోబ్యాబ్ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి -
ఆకాశ దేశాన అద్భుత కాంతులు!
రాత్రిపూట ఆకాశం ఎలా ఉంటుంది? ఇంకెలా.. నల్లగా. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తే తెల్లటి వెన్నెల కాస్తుంది. -
3డీ ముద్రణతో రాకెట్ ఇంజిన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. 3డీ ముద్రణతో రూపొందించిన ద్రవ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. -
మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు