ఎండలోనూ చల్లగా..
ఎండాకాలంలో ఏసీల నుంచి వచ్చే చల్లగాలి ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ ఏసీలు చాలా విద్యుత్తును వాడుకుంటాయి. హానికర వాయువులను వెదజల్లుతాయి.
ఎండాకాలంలో ఏసీల నుంచి వచ్చే చల్లగాలి ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ ఏసీలు చాలా విద్యుత్తును వాడుకుంటాయి. హానికర వాయువులను వెదజల్లుతాయి. ఇలాంటి ఇబ్బందిని తొలగించే ఉద్దేశంతోనే యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు పర్యావరణ హిత ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. ఎండ తగిలినా చల్లగా ఉండే వృక్ష ఆధారిత రంగు పొరను రూపొందించారు. ఇది ఏదో ఒకనాడు భవనాలు, కార్లు, పరికరాల వంటివి చల్లగా ఉండటానికి తోడ్పడగలదని భావిస్తున్నారు. అదీ బయటి నుంచి ఎలాంటి ఇంధనం అవసరం లేకుండానే.
ఎండ తగిలితే చాలా పదార్థాలు వేడెక్కుతాయి. ఎందుకో తెలుసా? అవి సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కాంతి, కంటికి కనిపించే కాంతి, పరారుణ కాంతిని గ్రహించుకుంటాయి కాబట్టి. కానీ కొన్ని పదార్థాలు మాత్రం వీటిని ప్రతిఫలింపజేస్తాయి. పైగా పరారుణ రూపంలో తమలోని వేడిని వాతావరణం ద్వారా అంతరిక్షంలోకి వెదజల్లుతాయి కూడా. అందువల్ల చల్లగా ఉంటాయి. సాధారణంగా పదార్థాలకు ఎరుపు వంటి రంగులను జోడిస్తే మరింత ఎక్కువ కాంతిని గ్రహించుకుంటాయి. దీనికి విరుద్ధంగా కాంతిని ప్రతిఫలింపజేసే రంగు పదార్థాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. అదీ కలపలోని రెండు రకాల సెల్యులోజ్ పదార్థాలతో. సెల్యులోజ్లోని రసాయన బంధాలు సరైన పరారుణ కాంతిని వెలువరించటానికి అనువుగా ఉంటాయి. కలప గుజ్జు లేదా పత్తి వంటి వాటి నుంచి సంగ్రహించే సెల్యులోజ్ నానోక్రిస్టల్స్ వర్ణద్రవ్యం లేకుండానే చాలా వర్ణాల్లో ప్రకాశించే రంగును సృష్టించగలవు. అందుకే కాంతిని ప్రతిఫలింపజేసే పలక మీద సెల్యులోజ్ నానోక్రిస్టల్స్ను అమర్చి.. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల పొరను పుట్టించారు. దీన్ని ఒకరకంగా సబ్బు నురగ మీది రంగులతో పోల్చుకోవచ్చు. వేర్వేరు కాంతి తరంగధైర్ఘ్యాలను పలు దిశలకు వెదజల్లటం ద్వారానే సబ్బు నురగ మీద ఇంద్రధనుస్సు రంగులు ప్రకాశిస్తుంటాయి. సెల్యులోజ్ నానోక్రిస్టల్స్తోనూ ఇలాగే రంగులను వెదజల్లే విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటికి ఎండ తాకినా కూడా చుట్టుపక్కల పరిసరాల కన్నా సగటున 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రత కలిగుండటం విశేషం. దీన్ని గోడల మీద పరికరాల మీద అమర్చితే అవి చల్లగా ఉండటానికి తోడ్పడుతుంది. ఇప్పటికే ఇలాంటి రంగులు, పొరలు కొన్ని తయారవుతున్నాయి. కాకపోతే అవన్నీ తెలుపు లేదా అద్దంలాంటి మెరుపు వన్నె కలిగుంటాయి. గోడలు నీలం రంగులోనో, ఆకుపచ్చ రంగులోనో ఉండాలని కోరుకుంటే? ఇవేవీ ఉపయోగపడవు. ఇక్కడే కొత్తరకం రంగు పొర ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అయితే వాతావరణం వంటివి ఈ రంగుల పొర మీద విపరీత ప్రభావం చూపొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి దీన్ని వాడకంలోకి తేవటానికి మరింత కృషి చేయాల్సిన అవసరముందని వివరి స్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూత్రాన్ని తాగు నీరుగా మార్చే స్పేస్సూట్
మూత్రాన్ని తాగే నీరులా మారిస్తే? ఇదేం చోద్యమనుకోకండి. మున్ముందు అంతరిక్షంలో సుదీర్ఘకాలం నడిచే వ్యోమగాములకు ఇదెంతో అవసరం. -
జింక్ సూక్ష్మక్రిములు!
వరి పండించే రైతులకు శుభవార్త. పంట పొలాల్లో జింక్ లోపాన్ని తగ్గించటానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్-బనారస్ హిందూ యూనివర్సిటీ (ఏఐఎస్-బీహెచ్యూ) పరిశోధకులు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. -
కాలేయంలో నాయక కణాలు
అవయవాల్లో కాలేయం తీరే వేరు. ఎప్పుడైనా దెబ్బతిన్నా తిరిగి తానే మరమ్మతు అవుతుంది. దీనికి కారణం కొత్త కణాలు పుట్టుకురావటమేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. -
సాలెగూడు మైక్రోఫోన్
సాలెగూళ్లంటే శాస్త్రవేత్తలకే కాదు.. ఇంజినీర్లకూ ఆసక్తే. దీని దారాలు సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. వీటి స్ఫూర్తితోనే తేలికైన, గాలి ఆడే పదార్థాలను రూపొందించి.. వాటిని విమాన భాగాల తయారీకీ వాడుకుంటున్నారు. -
మరో బొటనవేలు
బొటన వేలు గొప్పతనమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది లేకపోతే దేన్నీ గట్టిగా పట్టుకోలేం. మహా భారతంలో ఏకలవ్యుడి కథ తెలుసుగా. ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి పోటీ రావొచ్చనే భావనతో ఏకలవ్యుడి -
తల కిందుల చెట్టు పుట్టుక గుట్టు రట్టు
బావోబ్యాబ్ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి -
ఆకాశ దేశాన అద్భుత కాంతులు!
రాత్రిపూట ఆకాశం ఎలా ఉంటుంది? ఇంకెలా.. నల్లగా. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తే తెల్లటి వెన్నెల కాస్తుంది. -
3డీ ముద్రణతో రాకెట్ ఇంజిన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. 3డీ ముద్రణతో రూపొందించిన ద్రవ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. -
మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత