వజ్రం కృత్రిమం!
వజ్రం తీరే వేరు. దీని తళతళ మెరుపులు, దృఢత్వం ముందు ఏదైనా దిగదుడుపే. అందుకే అంతటి విలువ. ఇటీవల ప్రయోగశాలలో వృద్ధి చేసిన కృత్రిమ వజ్రాలకూ ఆదరణ పెరుగుతోంది. మన ప్రధానమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడి సతీమణికి ప్రయోగశాలలో తయారుచేసిన వజ్రాన్ని బహూకరించిన సంగతి తెలిసిందే.
![](https://assets.eenadu.net/article_img/eenadu270623-1a.jpg)
వజ్ర విశిష్టతే వేరు
మనకు తెలిసిన అత్యంత గట్టి పదార్థం వజ్రమే. పూర్తిగా కర్బనంతో తయారయ్యే దీని దృఢత్వానికి కారణం కర్బన బంధాలే. వజ్రంలోని ప్రతి కార్బన్ అణువు చుట్టూ మరో నాలుగు కార్బన్ అణువులుంటాయి. ఇవన్నీ బలమైన సమయోజనీయ బంధాలతో అనుసంధానమవుతాయి. ఈ సార్వత్రిక, బిగుతైన బంధమే వజ్రానికి దృఢత్వం, విశిష్టతను సంతరించి పెడుతోంది. ఎలాంటి రసాయనాన్నయినా, అత్యధిక ఉష్ణోగ్రతనయినా తట్టుకో గలగటానికి కారణమిదే. దీని కాంతి వక్రీభవన, విక్షేపణ గుణమూ అనన్య సామాన్యం. అందుకే తళతళ మెరుస్తుంది. ఆకర్షిస్తుంది. కాబట్టే అత్యంత విలువైన రత్నంగా భాసిల్లుతోంది. పురాతన కాలం నుంచీ ఆభరణాలకు వింత శోభను చేకూరుస్తోంది. ప్రయోగశాలలో తయారుచేసే వజ్రాలు సైతం అచ్చం ఇలాంటి సహజ వజ్రాల రసాయన, దృశ్య గుణాలే కలిగుంటాయి. గనులను తవ్వాల్సిన అవసరం లేకపోవటం.. తయారీలో సౌర, పవన విద్యుత్తు వంటి వనరులను వాడుకోవటం వల్ల ఇవి పర్యావరణ హితానికీ తోడ్పడతాయి.
భూ అంతర్భాగంలో పుట్టి..
వజ్రం కార్బన్తో తయారవటం వల్ల చాలామంది ఇది బొగ్గు నుంచి పుట్టుకొచ్చి ఉండొచ్చని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. భూ ఉపరితలానికి సుమారు 100 మైళ్ల లోతున అత్యధిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద వజ్రాలు ఏర్పడతాయి. భూ ఉపరితలం వద్ద కనిపించేవి చాలావరకు అగ్నిపర్వతాల విస్ఫోటనం మూలంగా మ్యాంటిల్ రాళ్లతో పాటు పైకి ఎగిసి వచ్చినవే. గనుల్లో ఈ రాళ్లను తవ్వి తీసి, వజ్రాలను సంగ్రహిస్తారు. వీటిని సానబెట్టి తళతళ మెరిసేలా చేస్తారు. గ్రహశకలాలు భూమిని ఢీకొట్టినప్పుడు పుట్టుకొచ్చే అత్యధిక వేడి, పీడనం ప్రభావంతో కొన్ని వజ్రాలు ఏర్పడ్డాయని భావిస్తారు. మరికొన్ని ఉల్కలతో భూమికి చేరు కున్నాయి. మనల్ని ఆకట్టుకునే వజ్రం వెనక కథ ఇదీ.
ప్రయోగ శాలలో ఎలా?
ప్రయోగశాలలో వృద్ధి చేసే వజ్రాల తయారీకీ భూమిలోపల సహజ వజ్రాలు ఏర్పడే వాతావరణమే ఆధారం. ప్రత్యేక పరిజ్ఞానంతో అలాంటి పరిస్థితులను సృష్టించి, కృత్రిమ వజ్రాలను తయారు చేస్తారు. ఇందుకు దాదాపు నెల పడుతుంది. వీటిని తయారు చేసేందుకు రకరకాల పద్ధతులు ఉన్నాయి. అన్నింటికన్నా ప్రాచుర్యంలో ఉన్నది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది హై ప్రెషర్, హై టెంపరేచర్ (హెచ్పీహెచ్టీ) పద్ధతి. పేరుకు తగ్గట్టుగానే దీనికి భారీ అచ్చు పరికరం అవసరం. కనీసం 1500 సెల్షియస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 7,30,000 పీఎస్ఐ పీడనాన్ని సృష్టించగల పరికరాన్ని దీనికి ఉపయోగిస్తారు. సాధారణంగా వజ్రం బీజంగా గ్రాఫైట్ను వాడతారు. అత్యధిక వేడి, పీడనాలకు గురిచేసినప్పుడు దీనిలోని కర్బన రూపం అత్యంత విలువైన కార్బన్ రూపంలోకి మారుతుంది. కెమికల్ వాపర్ డిపోజిషన్ (సీవీడీ) అనే ప్రక్రియతోనూ వజ్రాలను తయారుచేస్తారు. ఇందులో కర్బనం దండిగా ఉండే మీథేన్ వంటి వాయు రేణువులతో నిండిన రసాయన గదిలో వజ్రం బీజాన్ని 800 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఈ వాయు రేణువులు కార్బన్, హైడ్రోజన్ అణువులుగా విడిపోయి వజ్ర బీజం మీద పోగుపడతాయి. చదరం, వృత్తాకారాల్లో వజ్రపు స్ఫటికాలుగా రూపొందుతాయి. ఈ స్ఫటికాలను వేడి చేసి రంగులను కల్పిస్తారు. సీవీడీ పద్ధతిలో తొలిసారిగా 1952లో వజ్రాన్ని తయారు చేసినట్టు యూనియన్ కార్బయిడ్ సంస్థ ప్రకటించుకుంది. ఇలాంటి వజ్రాలను మొదట్లో పరిశ్రమల్లో.. ముఖ్యంగా టెలీకమ్యూనికేషన్లు, లేజర్ ఆప్టిక్స్ రంగాల్లో వాడుకున్నారు. రత్నాల నాణ్యతతో కూడిన ప్రయోగశాల వజ్రాలను జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ 70ల్లో తొలిసారి తయారుచేసింది. దాదాపు ఇదే సమయంలో జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా ప్రయోగశాల వజ్రాల మీద మొదటిసారిగా శాస్త్రీయ అధ్యయనం నిర్వహించింది.
వజ్ర ‘అనుకరణలు’ కావు
మాయిసనైట్, క్యూబిక్ జిర్కోనియా, వైట్ సఫైర్, యాగ్ వంటివి వజ్రాన్ని పోలి ఉంటాయి (డైమండ్ సిమ్యులాంట్స్). ఇవి వజ్రం మాదిరిగా కనిపించినా అంత మెరుపు, మన్నిక, దృఢత్వం ఉండవు. వీటిని తేలికగా గుర్తుపట్టొచ్చు. కానీ ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు అలా కాదు. రసాయనికంగా, భౌతికంగా, ప్రకాశం పరంగా.. ఎలా చూసినా కృత్రిమ వజ్రాలు సహజంగానే కనిపిస్తాయి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించటం చాలా కష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూత్రాన్ని తాగు నీరుగా మార్చే స్పేస్సూట్
మూత్రాన్ని తాగే నీరులా మారిస్తే? ఇదేం చోద్యమనుకోకండి. మున్ముందు అంతరిక్షంలో సుదీర్ఘకాలం నడిచే వ్యోమగాములకు ఇదెంతో అవసరం. -
జింక్ సూక్ష్మక్రిములు!
వరి పండించే రైతులకు శుభవార్త. పంట పొలాల్లో జింక్ లోపాన్ని తగ్గించటానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్-బనారస్ హిందూ యూనివర్సిటీ (ఏఐఎస్-బీహెచ్యూ) పరిశోధకులు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. -
కాలేయంలో నాయక కణాలు
అవయవాల్లో కాలేయం తీరే వేరు. ఎప్పుడైనా దెబ్బతిన్నా తిరిగి తానే మరమ్మతు అవుతుంది. దీనికి కారణం కొత్త కణాలు పుట్టుకురావటమేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. -
సాలెగూడు మైక్రోఫోన్
సాలెగూళ్లంటే శాస్త్రవేత్తలకే కాదు.. ఇంజినీర్లకూ ఆసక్తే. దీని దారాలు సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. వీటి స్ఫూర్తితోనే తేలికైన, గాలి ఆడే పదార్థాలను రూపొందించి.. వాటిని విమాన భాగాల తయారీకీ వాడుకుంటున్నారు. -
మరో బొటనవేలు
బొటన వేలు గొప్పతనమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది లేకపోతే దేన్నీ గట్టిగా పట్టుకోలేం. మహా భారతంలో ఏకలవ్యుడి కథ తెలుసుగా. ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి పోటీ రావొచ్చనే భావనతో ఏకలవ్యుడి -
తల కిందుల చెట్టు పుట్టుక గుట్టు రట్టు
బావోబ్యాబ్ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి -
ఆకాశ దేశాన అద్భుత కాంతులు!
రాత్రిపూట ఆకాశం ఎలా ఉంటుంది? ఇంకెలా.. నల్లగా. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తే తెల్లటి వెన్నెల కాస్తుంది. -
3డీ ముద్రణతో రాకెట్ ఇంజిన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. 3డీ ముద్రణతో రూపొందించిన ద్రవ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. -
మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి