ఎంతెంత చల్లన?
విశ్వంలో అతి చల్లటి చోటు ఎక్కడుందంటే అంతరిక్షంలో అని చెబుతారు. కానీ చాలా విశ్వవిద్యాలయాల్లోని భౌతికశాస్త్ర విభాగాల్లో ఉందంటే నమ్ముతారా? కొన్ని దశాబ్దాలుగా పరిశోధకులు వీలైనంత తక్కువ ఉష్ణోగ్రతకు.. పరమశూన్య ఉష్ణోగ్రతకు చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.
విశ్వంలో అతి చల్లటి చోటు ఎక్కడుందంటే అంతరిక్షంలో అని చెబుతారు. కానీ చాలా విశ్వవిద్యాలయాల్లోని భౌతికశాస్త్ర విభాగాల్లో ఉందంటే నమ్ముతారా? కొన్ని దశాబ్దాలుగా పరిశోధకులు వీలైనంత తక్కువ ఉష్ణోగ్రతకు.. పరమశూన్య ఉష్ణోగ్రతకు చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పదార్థం పైకి ప్రవహించే స్థితి దగ్గర్నుంచి రసాయనిక ప్రతి చర్యలను కాసేపు ఆపేయటం వరకూ ఎన్నెన్నో విచిత్ర విషయాలూ వెలుగు చూస్తున్నాయి. చల్లదనాన్ని జయించాలనే ప్రయత్నం ఇప్పుడు క్వాంటమ్ ఫ్రిజ్ రూపకల్పన దశకూ చేరుకుంది.
చల్లదనం అంటే ఏంటనే ప్రశ్న వేలాది ఏళ్లుగా మనిషి మెదడును తొలుస్తూనే ఉంది. గ్రీకు తత్వవేత్త పార్మెనెడీస్ క్రీస్తు పూర్వం 450లో దీన్ని ఫ్రిజిడమ్ ప్రీమంగా భావించారు. వీలైనంతవరకు చల్లబడే ఈ ఊహాత్మక పదార్థం ఇతర వస్తువులనూ చల్లబడేలా చేస్తుంది. రాబర్ట్ బోయేల్ అనే రసాయన శాస్త్రవేత్త 1664లో గాలి, నీరు వంటి వాటిని విస్తృతంగా అధ్యయనం చేసి ఈ వివరణ సమర్థనీయం కాదని ప్రకటించారు. వేడి, చల్లదనం రెండూ వేర్వేరని.. ఇవి రసాయనికంగా లేదా ప్రాణుల ద్వారా పుట్టుకొస్తాయని బోయేల్, ఆయన అనుయాయులు విశ్వసించారు. వేడి, చల్లదనం వస్తువు సాపేక్ష ధర్మాలని, ఇవి దానిలోని అణువులు కదిలే వేగాన్ని బట్టి ఆధారపడి ఉంటాయని ఇప్పుడు గుర్తించగలిగాం. అణువులు తక్కువ శక్తి కలిగి, నెమ్మదిగా కదిలే స్థితిలో కన్నా ఎక్కువ శక్తిని కలిగి, వేగంగా కదిలే స్థితిలో వస్తువు వేడిగా ఉంటుంది.
పరిమితిని బట్టి
ఏదైనా ఎంతవరకు చల్లబడొచ్చనేది దాని ప్రాథమిక పరిమితి మీద ఆధారపడి ఉంటుంది. లార్డ్ కెల్విన్ 1848లో పరమ శూన్య భావనను పరిచయం చేశారు. ఈ స్థితిలో అణువుల కదలిక పూర్తిగా ఆగిపోతుంది. అందువల్ల ఇంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతకు చేరుకోవటం సాధ్యం కాదు. అనేక ప్రయోగాల తర్వాత మైనస్ 273 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పరమ శూన్య స్థితిగా కెల్విన్ లెక్కించారు. వస్తువులపై శక్తిని ప్రయోగిస్తే తప్ప వేడి నిరంతరం చల్లదనం వైపు ప్రవహిస్తుందనీ గుర్తించారు. ఫ్రిజ్లు ఈ సూత్రం మీదే పనిచేస్తాయి. ఇవి శక్తిని వాడుకొని వస్తువులను చల్లబరుస్తాయి. అధునాతన ఫ్రిజ్లు గరిష్ఠంగా మైనస్ 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చల్లబరచగలవు. హీలియం వాయువును ఒత్తిడికి గురిచేసి నాజిల్ ద్వారా వేగంగా పంపించటం ద్వారా మైనస్ 269 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కూడిన ద్రవ హీలియాన్ని సృష్టించొచ్చు. ఇది పరమశూన్య ఉష్ణోగ్రత కన్నా కేవలం 4 డిగ్రీలే తక్కువ. ఇంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతను సాధించటానికి 1990లో లేజర్తోనూ ప్రయత్నాలు చేశారు. శూన్య ఛాంబర్లో కదిలే అణువులను లేజర్తో ఢీకొట్టి వాటి వేగాన్ని దాదాపు పూర్తిగా తగ్గించగలిగారు. పరమశూన్య ఉష్ణోగ్రతను దాదాపు సాధించగలిగారు. అణువుల వేగాన్ని తగ్గించటమే కాదు, వేడిగా ఉన్న అణువులను లేజర్తో దూరంగా వెళ్లగొట్టే పరిశోధన కూడా జరిగింది. దీంతో పరమశూన్య ఉష్ణోగ్రతకు మరింత దగ్గరికి చేరుకున్నారు. ఈ రెండు పరిశోధనలకూ నోబెల్ బహుమతులు లభించాయి. ఇవన్నీ క్వాంటమ్ ఫ్రిజ్ ప్రపంచానికి దారులు తెరచాయి.
చిత్ర విచిత్రం
కెటెరెల్, ఆయన బృందం 1995లో పదార్థం కొత్త స్థితిని గుర్తించింది. దీన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ 70 ఏళ్ల క్రితమే ఊహించారు. కాకపోతే ఎన్నడూ పరిశీలించలేదు. వస్తువును చల్లబరచినప్పుడు అది గడ్డ కడుతుందనే అనుకుంటాం. కానీ లక్షలాది అతి చల్లటి అణువులు సారూప్య క్వాంటమ్ పదార్థంగా ప్రవర్తిస్తాయి. దీన్నే బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అని పిలుచుకుంటున్నారు. ఈ అణువులు తమ గుర్తింపును కోల్పోతాయి. విచిత్రమైన ద్రవంగా మారతాయి. కొన్నిసార్లు పైకీ ప్రవహిస్తాయి. అప్పట్నుంచీ అతి శీతల రంగంలో కొత్త పద్ధతులు పుట్టుకురావటం మొదలైంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు అణువులను పూర్తిగా నిశ్చల స్థితికి తీసుకురాగలుగుతున్నారు కూడా. వీటిని ఇటుకల మాదిరిగా అవసరమైనట్టుగా జోడించగలుగుతున్నారు. పదార్థాల అంతర్గత నిర్మాణం వాటి గుణాలను నిర్దేశిస్తుందనే ఊహా సిద్ధాంతాన్ని తేలికగా పరీక్షించటానికిది మార్గం సుగమం చేసింది. కొన్నిరకాల సూపర్కండక్టర్లలో అణువుల క్వాంటమ్ ధర్మం కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని గుర్తించటానికి వీలు కల్పించింది. రసాయన శాస్త్రంలోనూ గుణాత్మక మార్పులు వచ్చాయి. లేజర్ కూలింగ్తో రసాయనిక ప్రతిచర్యలు అనుకున్నట్టుగా, నెమ్మదిగా జరిగేలా చేయొచ్చనీ తేలింది. దీంతో అణువులు ఎలా సంయోగం చెందుతాయో, ఎలా విడిపోతాయో స్పష్టంగా చూడటం సాధ్యమైంది. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు 2019లో పొటాషియం, రుబిడియమ్ అణువులను 500 నానాకెల్విన్ ఉష్ణోగ్రతకు చల్లబరచి ప్రతిచర్యకు ప్రేరేపించారు. అనంతరం లేజర్తో ప్రతిచర్యలను సగంలోనే ఆపేయగలిగారు. ఈ క్రమంలో గది ఉష్ణోగ్రత వద్ద ఎన్నడూ చూడని మధ్యవర్తి అణువును గుర్తించగలిగారు. ఇంకాస్త లేజర్ కాంతిని ప్రసరింపజేసి ఆ గడ్డకట్టిన స్థితిని మార్చేసి, మిగతా ప్రతిచర్యను కొనసాగించారు.
శీతలం నుంచి వేడికి
క్వాంటమ్ అనేది విచిత్రమైన ప్రపంచం. ఇందులో అణువులు కొన్నిసార్లు ఒకే సమయంలో రెండు చోట్ల ఉనికిలో ఉంటాయి. ఇవి చాలా దూరంలో ఉన్నప్పటికీ ఒకదానిపై మరోటి తక్షణం ప్రభావం చూపుతాయి. అయితే ఈ క్వాంటమ్ ప్రవర్తనలు చుట్టుపక్కల అణు కంపనాల వంటి బయటి ప్రభావాలతో మారిపోతాయి. నిజానికి క్వాంటమ్ ఫ్రిజ్ అంటే మన వంటింట్లోని ఫ్రిజ్ మాదిరిగా ఏమీ ఉండదు. ఇందులో పాల వంటివేవీ పెట్టుకోలేం. ఇందులో ఒకదానిలోంచి మరో దానిలోకి వేడి ప్రసారమయ్యేలా అతి చిన్న క్వాంటమ్ వస్తువులను అమరుస్తారు. లేజర్తో చల్లబరిచిన టెర్బియం అణువులతో సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు 2019లో ఓ క్వాంటమ్ ఫ్రిజ్ను రూపొందించారు. దీని ద్వారా పరిమితికి మించి అణువులను చల్లబరచొచ్చనీ నిరూపించారు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ స్టట్గర్ట్ పరిశోధకులు క్వాంటమ్ కంప్యూటర్లలో క్వాంటమ్ బిట్స్గా ప్రవర్తించే అణువులతో క్వాంటమ్ ఫ్రిజ్ను రూపొందించారు. దీంతో వేడి వ్యతిరేక దిశలో ప్రవహించేలా చేశారు కూడా. అంటే చల్లటి ప్రదేశం నుంచి వేడిని గ్రహించేలా చేశారు. వేడి, చల్లటి ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రత తేడా చాలా చాలా తక్కువైనప్పటికీ వ్యతిరేక దిశలో ఉష్ణం ప్రవహించటమనేది థర్మోడైనమిక్స్ సూత్రాలకు విరుద్ధమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూత్రాన్ని తాగు నీరుగా మార్చే స్పేస్సూట్
మూత్రాన్ని తాగే నీరులా మారిస్తే? ఇదేం చోద్యమనుకోకండి. మున్ముందు అంతరిక్షంలో సుదీర్ఘకాలం నడిచే వ్యోమగాములకు ఇదెంతో అవసరం. -
జింక్ సూక్ష్మక్రిములు!
వరి పండించే రైతులకు శుభవార్త. పంట పొలాల్లో జింక్ లోపాన్ని తగ్గించటానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్-బనారస్ హిందూ యూనివర్సిటీ (ఏఐఎస్-బీహెచ్యూ) పరిశోధకులు వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. -
కాలేయంలో నాయక కణాలు
అవయవాల్లో కాలేయం తీరే వేరు. ఎప్పుడైనా దెబ్బతిన్నా తిరిగి తానే మరమ్మతు అవుతుంది. దీనికి కారణం కొత్త కణాలు పుట్టుకురావటమేనని ఇప్పటివరకూ భావిస్తున్నారు. -
సాలెగూడు మైక్రోఫోన్
సాలెగూళ్లంటే శాస్త్రవేత్తలకే కాదు.. ఇంజినీర్లకూ ఆసక్తే. దీని దారాలు సన్నగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. వీటి స్ఫూర్తితోనే తేలికైన, గాలి ఆడే పదార్థాలను రూపొందించి.. వాటిని విమాన భాగాల తయారీకీ వాడుకుంటున్నారు. -
మరో బొటనవేలు
బొటన వేలు గొప్పతనమేంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది లేకపోతే దేన్నీ గట్టిగా పట్టుకోలేం. మహా భారతంలో ఏకలవ్యుడి కథ తెలుసుగా. ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి పోటీ రావొచ్చనే భావనతో ఏకలవ్యుడి -
తల కిందుల చెట్టు పుట్టుక గుట్టు రట్టు
బావోబ్యాబ్ చెట్ల ఆకర్షణే వేరు. ‘తల కిందుల చెట్లు’ అని పేరొందిన ఇవి చూడగానే ఆకర్షిస్తాయి. వేలాది ఏళ్ల పాటు జీవించే ఇవి స్థానిక సంస్కృతి, సంప్రదాయాల్లోనూ భాగమమయ్యాయి -
ఆకాశ దేశాన అద్భుత కాంతులు!
రాత్రిపూట ఆకాశం ఎలా ఉంటుంది? ఇంకెలా.. నల్లగా. నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తే తెల్లటి వెన్నెల కాస్తుంది. -
3డీ ముద్రణతో రాకెట్ ఇంజిన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనతను సాధించింది. 3డీ ముద్రణతో రూపొందించిన ద్రవ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించి సంచలనం సృష్టించింది. -
మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్