కేంద్రం చిన్నచూపు
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పురాతన కట్టడాలు, అద్భుతమైన వారసత్వ సంపద, కనువిందు చేసే జలపాతాలు ...
పర్యాటకం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను పట్టించుకోవడం లేదు
పద్మశ్రీ పురస్కారాలపై ప్రధానితో గొడవపెట్టుకున్నా
విమానాశ్రయాలు కట్టుకుంటామన్నా ఆరున్నరేళ్లుగా తేల్చడం లేదు
శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణకు ఉజ్వలమైన చరిత్ర ఉంది. విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు, కళలతో కూడుకున్న ప్రాంతమిది. ఇదంతా చారిత్రక ప్రదేశం. విశేషమైన అటవీ సంపద ఉంది. పురాతన కోటలు అనేకం రాష్ట్రంలో ఉన్నాయి. 58 ఏళ్లుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది.
- సీఎం కేసీఆర్
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పురాతన కట్టడాలు, అద్భుతమైన వారసత్వ సంపద, కనువిందు చేసే జలపాతాలు అనేకం రాష్ట్రంలో ఉన్నా.. పర్యాటకం సహా పలు అంశాల్లో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు. పద్మశ్రీ పురస్కారాల విషయంలోనూ అన్యాయమే జరుగుతోందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ ఇటీవల గొడవ పెట్టుకున్నానని, పద్మశ్రీ పురస్కారాలకు పేర్లను పంపాలా? వద్దా? చెప్పాల్సిందిగా అడిగానని సీఎం తెలిపారు. ‘‘రాష్ట్రంలో అర్హులైన కళాకారులు లేరా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? పంపి..పంపి అలిసిపోయి చెబుతున్న మాటలివి’’ అని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాలను నేరుగా కలిసి విన్నవించానని సీఎం వివరించారు. రాష్ట్రంలో అద్భుతమైన కళాకారులున్నారని ఆయన స్పష్టంచేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ముఖ్యమంత్రి సోమవారం మాట్లాడారు. ‘‘తెలంగాణకు ఉజ్వల చరిత్ర ఉంది. జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. సమైక్య రాష్ట్రంలో దాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. ఆర్డీఎస్పై జరిగిన అన్యాయాన్ని ఉటంకిస్తూ ఉద్యమంలో నేను మొదటి పాదయాత్ర.. జోగులాంబ ఆలయం నుంచి గద్వాల వరకూ చేశా. కృష్ణా, గోదావరి పుష్కరాలపైనా ఉద్యమించా. గతంలో ఎస్సారెస్పీ నుంచి నీరు వదిలితే నేరుగా ధవళేశ్వరంలో కలిసేది. ఇప్పుడు 160 కి.మీ. సజీవ ప్రవాహం కనిపిస్తోంది. అక్కడ అభివృద్ధి చేయడానికి చాలా ఉన్నాయి.
త్వరలో పర్యాటకంపై సమగ్ర కమిటీ
విద్యుత్తు, వ్యవసాయం, సాగునీరు విషయాల్లో ఇన్నాళ్లూ ఇబ్బందుల్లో ఉండటంతో పర్యాటకంపై ఎక్కువ దృష్టిపెట్టలేకపోయాం. త్వరలో అన్ని జిల్లాలకు చెందిన శాసనసభ్యులతో సమ్రగ కమిటీని ఏర్పాటు చేస్తాం. మంత్రి ఆధ్వర్యంలో అవసరమనుకుంటే పర్యటనలు చేసి.. కోటలు, చారిత్రక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు, విశిష్ట ప్రాచుర్యం ఉన్న దేవాలయాలను ప్రపంచానికి తెలియజెప్పేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందరు శాసనసభ్యులూ తమ నియోజకవర్గాల పరిధిలో గతంలో విస్మృతికి గురైన చారిత్రక ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో.. వాటిని గుర్తించి మంత్రికి సమాచారమివ్వాలి. ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంపై కేంద్రం చిన్నచూపు చూస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రితోనూ గొడవపడ్డాను. వాళ్లకు ఎందుకో ఏమో మన మీద దృష్టి రావడం లేదు. అవసరమైతే ఒకసారి గలాటా పెట్టుకోవాలా? అనేది అర్థమవడం లేదు. విమానాశ్రయాలు కావాలని అడిగాం. మీరు అనుమతిస్తే మా డబ్బుతో మేమే కట్టుకుంటామన్నా ఆరున్నర సంవత్సరాలుగా సాంకేతిక పరిశీలనలో ఉందని చెబుతున్నారు. మొన్న దీనికి సంబంధించిన మంత్రి వస్తే ఇంటికి పిలిచి భోజనం పెట్టి చెప్పాం. ఇప్పుడు వరంగల్లో టెక్స్టైల్ పార్కు వస్తోంది. మామునూరులో విమానాశ్రయం వస్తే.. రాదల్చుకున్నవారు నాగ్పుర్, ముంబయి, కేరళ తదితర ప్రాంతాల నుంచి వరంగల్కు నేరుగా వస్తారు. హైదరాబాద్ నుంచి వరంగల్కు పోవడానికి విమానం అక్కర్లేదనే నెపంతో కాలయాపన చేయకండి అని కూడా చెప్పా. అవసరమైతే కేంద్రంతో మరోసారి గట్టిగా మాట్లాడదాం. ఇవన్నీ చేయించుకుందాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.