Farm Laws Repeal Bill: సాగు చట్టాలకు చెల్లు
వివాదం రేకెత్తించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. సోమవారం శీతాకాల సమావేశాలు మొదలైన వెంటనే తొలుత లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ ఎలాంటి చర్చ లేకుండానే...
తొలిరోజే ఆమోదించిన పార్లమెంటు
రాజ్యసభలో 12 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్
మునుపటి సమావేశాల్లో ప్రవర్తనపై చర్య
టికాయిత్కు మొక్క ఇచ్చి రైతుల అభినందన
దిల్లీ: వివాదం రేకెత్తించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. సోమవారం శీతాకాల సమావేశాలు మొదలైన వెంటనే తొలుత లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ ఎలాంటి చర్చ లేకుండానే దీనికి మూజువాణి ఓటుతో సమ్మతి తెలిపాయి. మొత్తం ప్రక్రియ రెండు గంటల్లో ముగిసిపోయింది. బిల్లును శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఉభయ సభల్లోనూ బిల్లు ప్రవేశపెట్టారు. చట్టాల రద్దు నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించినా, దానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించాలని పట్టుపట్టాయి. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఉభయ సభల్లో సభ్యులు నిరసనలు తెలిపారు. పలుమార్లు సభా కార్యకలాపాలకు అంతరాయం వాటిల్లింది. మునుపటి వర్షాకాల సమావేశాల్లో అనుచిత ప్రవర్తనకు గానూ రాజ్యసభలో 12 మంది విపక్ష సభ్యుల్ని ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
మద్దతు ధరకు చట్టబద్ధత ఎప్పుడు?
వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత ఎప్పుడంటూ విపక్షాలు లోక్సభలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారంపైనా స్పష్టమైన హామీకి పట్టుపట్టాయి. సభాపతి స్థానం వద్దకు వెళ్లి నినాదాలు చేశాయి. చర్చకు ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానిస్తే.. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మంత్రి తోమర్ విమర్శించారు. మూడు చట్టాల రద్దుకు ఉభయపక్షాలూ సమ్మతించినప్పుడు చర్చ అవసరం లేదన్నారు. వివిధ డిమాండ్లను విపక్షాలు లేవనెత్తి, సభలో ఇతర కార్యకలాపాలను అడ్డుకున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ల నిరసనల నడుమ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాల నోటీసులను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. కొందరు సభ్యులు సభను ఆటంకపరిచే కృత నిశ్చయంతో వచ్చినట్లున్నారని వ్యాఖ్యానించారు.
ఆనాటి ప్రవర్తనకు 12 మంది సభ్యులపై చర్య
ఈ ఏడాది ఆగస్టు 11 నాటి సమావేశంలో రాజ్యసభలో రభస సృష్టించినందుకు సెక్షన్-256 కింద 12 మంది సభ్యుల్ని ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ ప్రకటించారు. ఈ మేరకు తీర్మానాన్ని సభలో ఆమోదించారు. సస్పెండైన వారిలో ఛాయావర్మ (కాంగ్రెస్), ప్రియాంక చతుర్వేది (శివసేన), డోలాసేన్ (తృణమూల్), ఎలమారం కరీం (సీపీఎం), బినయ్ విశ్వం (సీపీఐ) తదితరులు ఉన్నారు. సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామికమని విపక్షాలు ధ్వజమెత్తాయి. సస్పెన్షన్లపై చర్చకు మంగళవారం విపక్షాలు అత్యవసరంగా భేటీ కానున్నాయి. సభను, సభాపతి స్థానాన్ని తీవ్రంగా అవమానించేలా ప్రవర్తించడం వల్లనే సభ్యులు సస్పెండయ్యారని ప్రభుత్వం సమర్థించుకుంది. ఆగస్టు 11న ఈ సభ్యులు పరిధులు అతిక్రమించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ మేరకు ఆయన వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ఛైర్మన్కు వారు క్షమాపణ చెబితే సస్పెన్షన్లు ఎత్తివేసే అవకాశం ఉంటుందని చెప్పారు. 256వ నిబంధన కింద గతంలోనూ కొందరు ఎంపీల్ని సస్పెండ్ చేసినా, ఒకేసారి 12మందిపై చర్య తీసుకోవడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలని పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద జరిపిన ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్, మల్లికార్జునఖర్గే, రేవంత్రెడ్డి తదితరులు
నిబంధనలను గాలికి: కాంగ్రెస్
అన్నదాతల పేరుతో పార్లమెంటులో సోమవారం సూర్యోదయమైందని రాహుల్గాంధీ పేర్కొన్నారు. చర్చ జరిగితే తప్పులు బయటపడిపోతాయని ప్రభుత్వం భయపడిందని విలేకరుల సమావేశంలో ఆయన ఎద్దేవా చేశారు. చర్చను అనుమతించకపోతే పార్లమెంటును మూసివేయడం మేలని అభిప్రాయపడ్డారు. బిల్లును ఆమోదించే విషయంలో పార్లమెంటరీ నిబంధనల్ని గాలికి వదిలేశారనీ, చర్చకు ఏమాత్రం ఆస్కారం కల్పించలేదని లోక్సభలో కాంగ్రెస్పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి విమర్శించారు. చర్చ జరిగితే ఈ బిల్లుల వెనుక కుట్ర బయటపడేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. బిల్లుల్ని ప్రవేశపెట్టినప్పుడు, చట్టాల్ని రద్దు చేస్తున్నప్పుడు ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్విప్ జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.
గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన
సమావేశాల ఆరంభానికి ముందు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశమయ్యారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వరకు ఎంపీలు ప్రదర్శన నిర్వహించారు. కనీస మద్దతు ధరపై చట్టం తేవాలని, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నినాదాలిచ్చారు. పార్లమెంటు ఆవరణలో విపక్ష నేతలు సమావేశమై, వ్యూహాన్ని చర్చించారు. తృణమూల్ కాంగ్రెస్, ఆప్ నేతలు దీనికి హాజరు కాలేదు.
రద్దు బిల్లు 750 మంది రైతులకు నివాళి
ఇది కర్షక విజయం: టికాయిత్
ఇతర డిమాండ్లపై నేటిలోగా స్పందించాలి: ఎస్కేఎం
దిల్లీ: నూతన సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేయడం.. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మందికి నివాళి అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధర సహా వివిధ అంశాలపై చర్చ జరిగేవరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని చెప్పారు. చట్టాల రద్దును పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. చట్టాలను రద్దు చేయడం నిరసనకారుల విజయమని ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) పేర్కొంది. తాము లేవనెత్తుతున్న డిమాండ్లపై ప్రభుత్వం మంగళవారంలోగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. తదుపరి కార్యాచరణ నిర్ణయించడానికి బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఎస్కేఎం నేతలు సోమవారం సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.