ఎరువుల కర్మాగారం.. స్థానికులకు శరాఘాతం!
గత మార్చి నెలలో పునఃప్రారంభమైన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)తో స్థానికులు అవస్థలు పడుతున్నారు. పరిశ్రమకు ఆనుకుని ఉన్న రామగుండం నగరపాలక సంస్థ 14వ డివిజన్లోని వీర్లపల్లి
కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలు
పట్టించుకోని యాజమాన్యం
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి: గత మార్చి నెలలో పునఃప్రారంభమైన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)తో స్థానికులు అవస్థలు పడుతున్నారు. పరిశ్రమకు ఆనుకుని ఉన్న రామగుండం నగరపాలక సంస్థ 14వ డివిజన్లోని వీర్లపల్లి వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రూ.6,180 కోట్లతో పునరుద్ధరించిన కర్మాగారంలో నిత్యం రూ.కోట్ల విలువైన ఎరువుల ఉత్పత్తి జరుగుతున్నా స్థానికుల ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, కుటుంబ పరిస్థితులపై ఎడతెగని నిర్లక్ష్యం కనిపిస్తోంది.
ప్రాథమిక సౌకర్యాలూ కరవే
కర్మాగారం పునఃప్రారంభించిన వెంటనే ప్రభావిత ప్రాంతాలైన వీర్లపల్లి, శాంతినగర్, ఎల్కలపల్లిగేట్, ఇందిరానగర్, సంజయ్గాంధీనగర్లలో అన్ని వసతులు కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో సుమారు 15వేల మంది నివసిస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస వసతులు కూడా కల్పించ లేదు. యూరియా, అమ్మోనియా తయారీ ట్యాంకుల నుంచి వెలువడే దట్టమైన పొగతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి ఎక్కువ ఒత్తిడితో పొగ వస్తుండటంతో వాయువులు లీకై ఘాటైన దుర్వాసన వెలువడుతోంది. ఈ ప్రాంతంలో పలువురు వినికిడి, శ్వాసకోశ, గుండెజబ్బులతో సతమతమవుతున్నారు. వీర్లపల్లివాసులకు 3 కి.మీ. దూరంలో ఉండే లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రమే దిక్కు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం నివాస ప్రాంతాల్లో 50 డెసిబెల్స్ కంటే తక్కువ శబ్దం ఉండాలి. కాని పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి పలు విడతల్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ పరిశ్రమలో షట్డౌన్ సమయంలో 59.16 డెసిబెల్స్, ఉత్పత్తి సమయంలో 72.08 డెసిబెల్స్ శబ్దం నమోదైంది. రాత్రి వేళల్లో 45 డెసిబెల్స్ ఉండాలి. కాగా 72.08గా నమోదైంది. కర్మాగారానికి 20 మీటర్ల దూరంలో ఉన్న వీర్లపల్లి వాసులపై శబ్ద కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని నివేదికల్లో తేలింది. మరోవైపు ఎరువుల కర్మాగారం వ్యర్థాలతో కూడిన జలం నేరుగా గోదావరిలోనే కలుస్తోంది. దీంతో తరచూ నదిలో నురుగు, దుర్వాసనతో కూడిన నీటి తెట్టు ఏర్పడుతోంది. జల కాలుష్యంపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశంతో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంటు(ఎస్టీపీ)ను నిర్మిస్తున్నారు. మరోపక్క శాంతినగర్ ప్రాంతంలో ప్లాంటు నుంచి వచ్చే వ్యర్థ జలాలు స్థానిక చెరువులో కలుస్తున్నాయి. రసాయనాలతో కూడిన ఈ నీటిని తాగుతున్న పశువులు, పందులు చనిపోతున్నాయి. ప్రతి నెలా పదుల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
నియంత్రణపై పలుమార్లు సూచించాం
రవిదాస్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ
మురుగు వ్యర్థాలు శుద్ధి చేసే ఎస్టీపీ ప్లాంటు ఏర్పాటుపై ఇప్పటికే ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం ప్లాంటు నిర్మిస్తున్నారు. ఇక పరిశ్రమల జోన్లో 70-85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం ప్రమాదమే. వీర్లపల్లి వద్ద అప్పుడప్పుడు 90 డెసిబెల్స్ కంటే ఎక్కువ తీవ్రత నమోదవుతోంది. శబ్ద కాలుష్య నియంత్రణపై పలుమార్లు ఆ సంస్థకు సూచించాం. అయినా పట్టించుకోవడం లేదు. వారిపై చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు.
వీర్లపల్లి వాసులు కోరుతున్నదేమిటి?
వీర్లపల్లి ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పరిశ్రమ బొగ్గుతో నడిచే కాలంలో తక్కువ జనాభా ఉండేదని, ప్రస్తుతం నాలుగింతలు పెరిగిందని చెబుతున్నారు. అధిక పీడనంతో కూడిన సహజ వాయువుతో నడిచే ప్రస్తుత పరిశ్రమతో తమకు ఎప్పటికైనా ముప్పే పొంచి ఉందని ఆవేదన చెందుతున్నారు. అమ్మోనియా, యూరియా ఉత్పత్తి సమయంలో, లీకేజీల సమయంలో వెలువడే దుర్గంధం భరించలేకుండా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడిగితే కేసులు పెడుతున్నారు
-కుడికాల సతీష్కుమార్, వీర్లపల్లి
ఎరువుల కర్మాగారం పునఃనిర్మాణ సమయంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ధర్నాలకు దిగితే పునరావాసం కల్పించి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభించాక గేటు వద్దకు కూడా వెళ్లనివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గట్టిగా అడిగితే యాజమాన్యం కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. మా సమస్యపై కలెక్టరేట్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.