ఎరువుల కర్మాగారం.. స్థానికులకు శరాఘాతం!
గత మార్చి నెలలో పునఃప్రారంభమైన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)తో స్థానికులు అవస్థలు పడుతున్నారు. పరిశ్రమకు ఆనుకుని ఉన్న రామగుండం నగరపాలక సంస్థ 14వ డివిజన్లోని వీర్లపల్లి
కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలు
పట్టించుకోని యాజమాన్యం
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి: గత మార్చి నెలలో పునఃప్రారంభమైన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)తో స్థానికులు అవస్థలు పడుతున్నారు. పరిశ్రమకు ఆనుకుని ఉన్న రామగుండం నగరపాలక సంస్థ 14వ డివిజన్లోని వీర్లపల్లి వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రూ.6,180 కోట్లతో పునరుద్ధరించిన కర్మాగారంలో నిత్యం రూ.కోట్ల విలువైన ఎరువుల ఉత్పత్తి జరుగుతున్నా స్థానికుల ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, కుటుంబ పరిస్థితులపై ఎడతెగని నిర్లక్ష్యం కనిపిస్తోంది.
ప్రాథమిక సౌకర్యాలూ కరవే
కర్మాగారం పునఃప్రారంభించిన వెంటనే ప్రభావిత ప్రాంతాలైన వీర్లపల్లి, శాంతినగర్, ఎల్కలపల్లిగేట్, ఇందిరానగర్, సంజయ్గాంధీనగర్లలో అన్ని వసతులు కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో సుమారు 15వేల మంది నివసిస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస వసతులు కూడా కల్పించ లేదు. యూరియా, అమ్మోనియా తయారీ ట్యాంకుల నుంచి వెలువడే దట్టమైన పొగతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి ఎక్కువ ఒత్తిడితో పొగ వస్తుండటంతో వాయువులు లీకై ఘాటైన దుర్వాసన వెలువడుతోంది. ఈ ప్రాంతంలో పలువురు వినికిడి, శ్వాసకోశ, గుండెజబ్బులతో సతమతమవుతున్నారు. వీర్లపల్లివాసులకు 3 కి.మీ. దూరంలో ఉండే లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రమే దిక్కు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం నివాస ప్రాంతాల్లో 50 డెసిబెల్స్ కంటే తక్కువ శబ్దం ఉండాలి. కాని పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి పలు విడతల్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ పరిశ్రమలో షట్డౌన్ సమయంలో 59.16 డెసిబెల్స్, ఉత్పత్తి సమయంలో 72.08 డెసిబెల్స్ శబ్దం నమోదైంది. రాత్రి వేళల్లో 45 డెసిబెల్స్ ఉండాలి. కాగా 72.08గా నమోదైంది. కర్మాగారానికి 20 మీటర్ల దూరంలో ఉన్న వీర్లపల్లి వాసులపై శబ్ద కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని నివేదికల్లో తేలింది. మరోవైపు ఎరువుల కర్మాగారం వ్యర్థాలతో కూడిన జలం నేరుగా గోదావరిలోనే కలుస్తోంది. దీంతో తరచూ నదిలో నురుగు, దుర్వాసనతో కూడిన నీటి తెట్టు ఏర్పడుతోంది. జల కాలుష్యంపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశంతో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంటు(ఎస్టీపీ)ను నిర్మిస్తున్నారు. మరోపక్క శాంతినగర్ ప్రాంతంలో ప్లాంటు నుంచి వచ్చే వ్యర్థ జలాలు స్థానిక చెరువులో కలుస్తున్నాయి. రసాయనాలతో కూడిన ఈ నీటిని తాగుతున్న పశువులు, పందులు చనిపోతున్నాయి. ప్రతి నెలా పదుల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
నియంత్రణపై పలుమార్లు సూచించాం
రవిదాస్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ
మురుగు వ్యర్థాలు శుద్ధి చేసే ఎస్టీపీ ప్లాంటు ఏర్పాటుపై ఇప్పటికే ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం ప్లాంటు నిర్మిస్తున్నారు. ఇక పరిశ్రమల జోన్లో 70-85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం ప్రమాదమే. వీర్లపల్లి వద్ద అప్పుడప్పుడు 90 డెసిబెల్స్ కంటే ఎక్కువ తీవ్రత నమోదవుతోంది. శబ్ద కాలుష్య నియంత్రణపై పలుమార్లు ఆ సంస్థకు సూచించాం. అయినా పట్టించుకోవడం లేదు. వారిపై చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు.
వీర్లపల్లి వాసులు కోరుతున్నదేమిటి?
వీర్లపల్లి ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పరిశ్రమ బొగ్గుతో నడిచే కాలంలో తక్కువ జనాభా ఉండేదని, ప్రస్తుతం నాలుగింతలు పెరిగిందని చెబుతున్నారు. అధిక పీడనంతో కూడిన సహజ వాయువుతో నడిచే ప్రస్తుత పరిశ్రమతో తమకు ఎప్పటికైనా ముప్పే పొంచి ఉందని ఆవేదన చెందుతున్నారు. అమ్మోనియా, యూరియా ఉత్పత్తి సమయంలో, లీకేజీల సమయంలో వెలువడే దుర్గంధం భరించలేకుండా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడిగితే కేసులు పెడుతున్నారు
-కుడికాల సతీష్కుమార్, వీర్లపల్లి
ఎరువుల కర్మాగారం పునఃనిర్మాణ సమయంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ధర్నాలకు దిగితే పునరావాసం కల్పించి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభించాక గేటు వద్దకు కూడా వెళ్లనివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గట్టిగా అడిగితే యాజమాన్యం కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. మా సమస్యపై కలెక్టరేట్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
నడి వేసవిలో వణికించిన వాన
భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. -
మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి
‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. -
‘రైతు భరోసా’ బంద్
‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. -
అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
యూఎస్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు
రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. -
20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. -
ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందలు దాటేశాయి. -
50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి
తెలంగాణలో 50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్మెంట్ 30 శాతంతో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్యూటీఎఫ్) శివశంకర్ను కోరింది. -
ముఖ గుర్తింపు విధానం నుంచి మినహాయించండి!
తెలంగాణలోని పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్త విద్యాసంవత్సరం నుంచి చేపడుతున్న ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం నుంచి అంధ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని రాష్ట్ర అంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మల్లేశం, రాఘవేందర్రెడ్డి, ఇతర నేతలు అనిల్కుమార్, జి.మల్లేశ్, నాగేంద్రమ్మలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. -
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. -
టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల
కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. -
భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!
రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికులు ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM