పీహెచ్సీల్లో ఆరోగ్యశ్రీ సేవలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) స్థాయికి కూడా ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇందుకనుగుణంగా అన్ని పీహెచ్సీలు ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుసంధాన ఆసుపత్రుల
సాధారణ ప్రసవాలకూ ప్రోత్సాహకాలు
కుక్క, పాము కాటు మందుల్లేకుంటే చర్యలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై సమీక్షలో మంత్రి హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) స్థాయికి కూడా ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇందుకనుగుణంగా అన్ని పీహెచ్సీలు ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుసంధాన ఆసుపత్రుల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీలు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది. పీహెచ్సీల్లో తేలికపాటి శస్త్రచికిత్సలు చేస్తారు. ఉదాహరణకు చర్మంపై ప్రమాదకరం కాని కణితుల తొలగింపు వంటివి. ఈ ఆసుపత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఈ చికిత్సలు పొందే అవకాశం ఉంటుంది. వీటిని నిర్వహించినందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి నిధులు పీహెచ్సీకి చేరతాయి. సాధారణప్రసవాలు పెంచాలనే లక్ష్యంలో భాగంగా వైద్యులకూ, నర్సులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబోతున్నట్లు హరీశ్ వెల్లడించారు. పీహెచ్సీల పనితీరుపై మంగళవారం మంత్రి అన్ని జిల్లాల వైద్యాధికారులు, పథకాల అధికారులు, వైద్యాధికారులు, సూపర్వైజర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పీహెచ్సీల పరిధిలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, వారికి అందుతున్న వైద్య సేవలు, గర్భిణులకు వైద్యసేవలు, వ్యాక్సినేషన్, అధిక రక్తపోటు, మధుమేహం తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణీ, పరీక్షలు ఇతర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజల ఆరోగ్య సంరక్షణలో పీహెచ్సీలది ముఖ్య పాత్ర. గర్భిణి దశలో తప్పనిసరిగా 4సార్లు పరీక్షలు నిర్వహణతో మాతా, శిశు మరణాలు తగ్గించవచ్చు. ప్రతి పీహెచ్సీ పరిధిలో 100% ఆసుపత్రి ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. టెలి వైద్య విధానాన్ని వినియోగించుకొని, పీహెచ్సీ స్థాయిలోనే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలి.
మందులు బయటకు రాయొద్దు
పీహెచ్సీల్లో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పాము, కుక్క కాటు మందులు తప్పకుండా అందుబాటులో ఉండాలి. లేదంటే చర్యలు తప్పవు. రోగులకు మందులను బయటకు రాస్తే ఉపేక్షించబోం. వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. 24 గంటలు నడిచే పీహెచ్సీల్లో అత్యవసర సేవలను అన్ని వేళల్లో అందించాలి. డీఎంహెచ్వోలు ఆకస్మిక తనిఖీలు చేసి పనితీరును పరిశీలించాలి. ఆన్లైన్ విధానంలో ఎప్పటికప్పుడు వివరాలు అప్లోడ్ చేయాలి. జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షల ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి. సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధుల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయాలి. తెలంగాణ నిర్ధారణ పరీక్షల ప్రయోగశాలలను సద్వినియోగం చేసుకోవాలి. పాత పీహెచ్సీల స్థానంలో అవసరమైతే కొత్త నిర్మాణాలు చేపడతాం. మరమ్మతులు ఉన్నచోట వెంటనే పనులు చేపట్టాలి. పీహెచ్సీ, సబ్సెంటర్ స్థాయుల్లో వైద్యసేవలు అందించే క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేయాలి’’ అని మార్గనిర్దేశం చేశారు. సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ పాల్గొన్నారు.
నిమ్స్ నర్సులు ఆందోళన విరమించాలి
నిమ్స్లో ఆందోళన చేస్తున్న నర్సులు తక్షణమే విరమించి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్రావు కోరారు. గత నెల 28 నుంచి నర్సులు ఆందోళన కొనసాగిస్తుండగా.. మంగళవారం ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, నిమ్స్ సంచాలకులు డాక్టర్ మనోహర్, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్ గంగాధర్లతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమై దీనిపై చర్చించారు. నర్సుల ముఖ్యమైన డిమాండ్లను నెరవేర్చినప్పటికీ మొండికేసి ఆందోళన చేయడం తగదని హితవు పలికారు. రోగులకు ఇబ్బందులు కలిగేలా పరిస్థితులను సృష్టిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.