TRS: శీతాకాల సమావేశాల బహిష్కరణ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను తెరాస ఎంపీలు బహిష్కరించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల్లు, యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలంటూ ఉభయ సభల్లో చేసిన ...
ధాన్యం కొనుగోళ్లపై ప్రజాక్షేత్రంలో పోరాడతాం
స్పష్టం చేసిన తెరాస ఎంపీలు
పార్లమెంటు భవనం నుంచి బయటకు వస్తున్న తెరాస ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, పి.రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, వెంకటేష్ నేత, బి.బి.పాటిల్, సురేష్రెడ్డి, రంజిత్రెడ్డి, దయాకర్, లింగయ్య యాదవ్, మాలోత్ కవిత
ఈనాడు, దిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను తెరాస ఎంపీలు బహిష్కరించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల్లు, యాసంగి పంటపై స్పష్టత ఇవ్వాలంటూ ఉభయ సభల్లో చేసిన నిరసనలకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేశారు. క్షేత్రస్థాయి పోరాటాలతో ఈ సమస్యకు పరిష్కారం సాధిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రధాని, కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ముందుగా ప్రకటించిన విధంగా నల్లచొక్కాలు ధరించిన తెరాస ఎంపీలు ఉభయ సభల్లో మంగళవారం కూడా ఆందోళనకు దిగారు. తెలంగాణ నుంచి పంట సేకరించకపోవడం, ఎఫ్సీఐ ధాన్యం తరలించకపోవడం, ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది టన్నుల వడ్లు మార్కెట్ యార్డుల్లో ఉండడం తదితర అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. తెలంగాణ సభ్యులతోపాటు ఇతర అంశాలపై పలు విపక్ష పార్టీల ఆందోళనతో అయిదు నిమిషాలకే రాజ్యసభ వాయిదా పడింది. మరోవైపు ఎమ్మెస్పీ చట్టం, జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానంపై చర్చించాలంటూ లోక్సభలో తెరాస పక్షనేత నామా నాగేశ్వరరావు నోటీసు ఇవ్వగా సభాపతి ఓం బిర్లా తిరస్కరించారు. నిరసనగా తెరాస సభ్యులు వెల్లో బైఠాయించి నినాదాలు చేశారు. సభాపతి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో, తెలంగాణ భవన్లో తెరాస ఎంపీలు విలేకరులతో మాట్లాడారు. పోరాడితేనే తెలంగాణ వచ్చిందని, అదే తీరున ధాన్యం సేకరణపైనా క్షేత్రస్థాయిలో పోరాడతామని కేశవరావు తెలిపారు. ప్రధాని మోదీని ప్రజాసామ్య వ్యతిరేకిగా అభివర్ణించిన ఆయన..తాము మోదీకి పూర్తివ్యతిరేకంగా ఉన్నామన్నారు. ‘‘ఇది ఫాసిస్ట్, ప్రజా, రైతు వ్యతిరేక, అహంకారపూరిత ప్రభుత్వం. నేటి నుంచి మా నినాదం మోదీని పంపించడమే(ఆజ్ సే హమారా నారా..మోదీ జారా)’’ అని కేకే స్పష్టంచేశారు. ‘ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తారా’ అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘ఆ ఆలోచన లేదని’ కేశవరావు బదులిచ్చారు.
నిరసనలు ఫలితమివ్వలేదు.. అందుకే బహిష్కరణ నిర్ణయం
ధాన్యం సేకరణే రాష్ట్రంలో అతిపెద్ద సమస్య. ఏళ్లుగా సాఫీగా సాగుతున్న ప్రక్రియను కొనసాగించాలని కోరాం. రాష్ట్రంలో మిగిలినపోయిన పారా బాయిల్డ్ రైస్ తీసుకోవాలని విన్నవించాం. గోదాములు నిండిపోయాయి. రైల్వే ర్యాక్లు ఇవ్వడం లేదు. సమస్యను వివరించినా వారికి అర్థం కావడం లేదు. పార్లమెంటులో ఎంతగా నిరసన తెలిపినా కేంద్రం పట్టించుకోలేదు. పంట కొనుగోలుపై మేం అడిగే ప్రశ్నపై కేంద్ర మంత్రి రూపాలాకు అవగాహన ఉంది. స్వతహాగా రైతు అయిన ఆయన ‘మీరు అడిగే దానిలో అర్థం ఉంది’ అని అన్నారు. మిగిలిన మంత్రులే అర్థం చేసుకోలేకున్నారు. ఇది పూర్తిగా రైతు, ప్రజా, ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం. పార్లమెంటులో నిరసనలు ఫలించకపోవడంతో సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం. సమస్యను ప్రజలకు వివరిస్తాం
- కేశవరావు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత
రైతులను రోడ్లపై పడేసే కుట్ర
భాజపా నాయకులు తెలంగాణ రైతులను రోడ్లపై పడేసే కుట్రకు పాల్పడుతున్నారు. కేంద్ర మంత్రులు ఒక ప్రకటన చేస్తుంటే, భాజపా ఎంపీలు మరో ప్రకటన చేస్తున్నారు. రాష్ట్ర సమస్యపై సభలో మేం ఆందోళన చేస్తుంటే రాష్ట్రానికే చెందిన భాజపా, కాంగ్రెస్ ఎంపీలు కలిసి రావడం లేదు. పార్లమెంట్లో ఆ ఎంపీల వ్యవహార శైలిని ప్రజలు గుర్తించాలి. ధాన్యం సేకరణ అంశాన్ని పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశం, సభా కార్యకలాపాల కమిటీలోనూ లేవనెత్తాం. సభలు ప్రారంభమైనప్పట్నుంచి ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. యాసంగిలో వరి సాగుపై ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక ప్రశ్నకు సమాధానమిస్తే, యాసంగి పంట కొనమని వాణిజ్యశాఖ మంత్రి సమాధానమిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరగనందునే సమావేశాలు బహిష్కరిస్తున్నాం. భాజపా నాయకులు చెప్పే మాటలను రైతులు నమ్మొద్దు. కేసీఆర్ సూచనలను రైతులు పాటించాలి.
- నామా నాగేశ్వరరావు, తెరాస లోక్సభా పక్ష నేత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.