Arbitration: ఆర్బిట్రేషన్లో కొత్త పంథా
మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ఉంది.శ్రీకృష్ణుడి మధ్యవర్తిత్వం విఫలం కావడంతో దుష్పరిణామాలు సంభవించాయి. వ్యాపారంలో అభిప్రాయభేదాలు వస్తే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు.
ఈ నెల 18న ప్రారంభం కానున్న ఐఏఎంసీ
అన్ని ప్రయత్నాల తర్వాతే కోర్టులకు రావాలి
పరిచయ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
హైదరాబాద్లో ఏర్పాటు చేయడం సంతోషకరం: సీఎం కేసీఆర్
హైదరాబాద్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఐఏఎంసీ లోగోను ఆవిష్కరిస్తున్న సీజేఐ జస్టిస్
ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, తెలంగాణ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ, రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ఉంది.శ్రీకృష్ణుడి మధ్యవర్తిత్వం విఫలం కావడంతో దుష్పరిణామాలు సంభవించాయి. వ్యాపారంలో అభిప్రాయభేదాలు వస్తే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు.
-సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
వ్యాపార నిర్వహణ, ఆర్థికాభివృద్ధిలో కాంట్రాక్టుల అమలు కీలకం.. దురదృష్టవశాత్తూ దేశం ఇందులో వెనుకబడి ఉంది. ఆలస్యమైనప్పటికీ దేశంలో అదీ హైదరాబాద్లో ఇలాంటి సంస్థ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.
- సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్లో ఏర్పాటవుతున్న ఐఏఎంసీ (ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్) ఆర్బిట్రేషన్ ప్రక్రియను ఆసాంతం మార్చనుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సింగపూర్, లండన్ కేంద్రాల స్థాయిలో హైదరాబాద్లో ఈ నెల 18న ఐఏఎంసీ ప్రారంభమవుతోందన్నారు. ఇక్కడి ప్యానల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేటర్లు, పరిపాలనా సిబ్బంది, మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హెచ్ఐసీసీలోని నోవాటెల్లో శనివారం ఐఏఎంసీ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, న్యాయకోవిదులు, న్యాయమూర్తులు, మంత్రులు, ఇతర ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాని(ఏడీఆర్)కి ప్రాధాన్యం ఇస్తున్నారు. 40 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న అనుభవంతో చెబుతున్నా అన్ని ప్రయత్నాలు పూర్తయ్యాక చివరగా కోర్టును ఎంపిక చేసుకోవాలి. ఏడీఆర్, ఆర్బిట్రేషన్, మీడియేషన్లతో వివాదాలు పరిష్కారం కావడంతోపాటు సంబంధాల పునరుద్ధరణ జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎవరికీ విజయం, ఓటమి ఉండదు. ప్రస్తుత ఆర్బిట్రేషన్ కేంద్రాలు అంతర్జాతీయ వాణిజ్య నగరాలైన పారిస్, సింగపూర్, హాంకాంగ్, లండన్, న్యూయార్క్, స్టాక్ హోంలలో ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రాన్ని అంతర్జాతీయస్థాయిలో నిలపడానికి సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మేనన్తోపాటు లండన్లో ప్రముఖ ఆర్బిట్రేటర్లతో మాట్లాడా. వారు సహకారం అందిస్తామన్నారు. వసతుల అందుబాటుతోపాటు తెలంగాణ ప్రజల సహృదయం కారణంగా హైదరాబాద్లో ఈ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. జూన్లో నా ఆలోచనలను సీఎంతో పంచుకున్నా.. ఆయన సహకారంతో అనతి కాలంలోనే అవి వాస్తవ రూపం దాల్చాయి. జస్టిస్ రవీంద్రన్ ఈ సంస్థ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డిలకు కృతజ్ఞతలు.
మంత్రి కేటీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ
కేసీఆర్ది పెద్దమనసు
కేసీఆర్ది పెద్దమనసు. ఆయన ఏది చేసినా పెద్ద ఆర్భాటంగానే చేస్తారు. అది పెద్దలు, తీర్చిదిద్దిన గురువులు ఆయనకిచ్చిన వరం అనుకుంటా. ఇంత పెద్ద అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, భూమిని ఇవ్వడం ఆయన పెద్దమనసుకు నిదర్శనం.
సీజేఐ మానసపుత్రిక ఇది: జస్టిస్ నాగేశ్వరరావు
ఐఏఎంసీ సీజేఐ మానస పుత్రిక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఐఏఎంసీ ట్రస్టీ జస్టిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ సాయం లేకుండా దీన్ని ఏర్పాటు చేయడం సాధ్యంకాదని.. ఇందులో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. సివిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఉన్న వివిధ దశలతో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యం ఏడీఆర్ ఆవిష్కరణకు కారణమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి పేర్కొన్నారు. మీడియేషన్ డ్రాఫ్ట్ బిల్లును పార్లమెంటు ఆమోదించాల్సిన తరుణమిదేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలు ఆర్బిట్రేషన్, మీడియేషన్ అవసరాలను వివరించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ స్వాగతం పలకగా, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, రాష్ట్ర మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
ఐఏఎంసీ పరిచయ కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర ప్రతినిధులు
‘రచ్చబండ’ నుంచే ఏడీఆర్ విధానం: కేసీఆర్
వివాదాల పరిష్కారంలో ఆర్బిట్రేషన్ అత్యున్నతమైనదిగా గుర్తింపు పొందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఐఏఎంసీ పరిచయ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘పూర్వకాలం వివాదాలను గ్రామ పెద్దలు పరిష్కరించేవారు.. కొత్తగా వచ్చిన ఏడీఆర్ విధానం ‘రచ్చబండ’ నుంచి వచ్చిందే. హైదరాబాద్లో ఇలాంటి సంస్థ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంతోపాటు విమానాశ్రయం, హోటళ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రపంచస్థాయి కంపెనీలు నగరంలో ఉన్నాయి. హైదరాబాద్లో ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐకి హృదయపూర్వక కృతజ్ఞతలు. తక్షణం 25 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాం. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయించాం. సీజేఐ నేతృత్వంలో ట్రస్టీలు జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రన్ల సహకారంతో ఈ కేంద్రం రాష్ట్రం, దేశం, ఏషియాలోనే మంచి గుర్తింపు పొంది, ప్రపంచస్థాయిలో నిలుస్తుంది’’ అని వెల్లడించారు.
అత్యుత్తమ పారిశ్రామిక విధానం: కేటీఆర్
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెలంగాణలో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రూపొందిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అన్ని దేశాల్లోనూ అధ్యయనం చేసి టీఎస్ఐపాస్ను తీసుకొచ్చామన్నారు. ఐఏఎంసీ పరిచయ సదస్సు ముగింపు కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఐఏఎంసీకి ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వివాదాల పరిష్కారం కోసం ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. జీవితకాల ట్రస్టీ జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ మాట్లాడుతూ.. ఈ కేంద్రానికి న్యాయవాదులు, పరిశ్రమల నుంచి సహకారం అవసరమన్నారు.
తెలుగులో మాట్లాడితేనే సంతోషం
ఎలాగైతే తెలుగువాళ్లు భోజనంలో పెరుగన్నం తినకపోతే సంతృప్తి చెందరో రెండు ముక్కలు తెలుగులో చెప్పకపోతే నేనూ సంతోషపడను. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలుగు భాషాభిమాని. భాషా సంస్కృతుల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్న మనిషి. తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఈ దేశంలోని చట్టాల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఆ మార్పుల్లో భాగంగా మరో తెలుగుబిడ్డ డాక్టర్ పీసీ రావు ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్ యాక్ట్ 1996ను రాశారు. కోర్టులే కాదు.. ప్రభుత్వాలు, అధికారులు కూడా న్యాయం చేయవచ్చని, సమాజంలో గుర్తింపు ఉండి, గౌరవం ఉన్న ఏ వ్యక్తి అయినా తీర్పు చెప్పడానికి అర్హుడేనని రాష్ట్రపతి, ప్రధానమంత్రి సమక్షంలో నేను చెప్పాను. మీడియేషన్ కేంద్రంలో సమాజం గౌరవించిన బిడ్డలు ప్యానల్ సభ్యులుగా ఉంటారు. గరికపాటి, నాగఫణి శర్మ వంటి సమాజంలో గుర్తింపు పొందినవారి మాటకు విలువ ఉంటుంది.. అలాంటి వారు ప్యానెల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నా.
- జస్టిస్ ఎన్వీ రమణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.