విపక్షాల వాకౌట్
పార్లమెంట్ ఉభయసభల్లో రెండోరోజూ విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. వర్షాకాల సమావేశాల్లో రభస చేసినందుకు 12 మంది ఎంపీలపై ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ పలుపార్టీల సభ్యులు మంగళవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
రాజ్యసభ సభ్యులపై వేటును నిరసించిన ఎంపీలు
ప్రొరోగ్ అయ్యాక అప్పటి పరిణామాలపై చర్యలా?: ఖర్గే
ఉభయ సభల్లో రెండోరోజూ అంతరాయం
రాజ్యసభ సభ్యుల సస్పెన్షనుపై మహాత్ముని విగ్రహం ఎదుట ప్రతిపక్ష నేతల నిరసన
దిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో రెండోరోజూ విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. వర్షాకాల సమావేశాల్లో రభస చేసినందుకు 12 మంది ఎంపీలపై ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ పలుపార్టీల సభ్యులు మంగళవారం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. సభను అపవిత్రం చేయడం పట్ల వారు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. సభ తీసుకున్న నిర్ణయం సబబేనని చెప్పారు. నిబంధనల ప్రకారమే అది జరిగిందనీ, అలాంటి అధికారం సభకు, సభాపతికి ఉన్నాయని చెప్పారు. సస్పెన్షన్ ఎత్తివేతను కోరుతూ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించిన తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. గత సమావేశం ప్రొరోగ్ అయిన తర్వాత ఆనాటి ఘటనలపై కొన్ని నెలల తర్వాత ఇప్పుడు వేటు వేయడం తగదనీ, వారి సస్పెన్షన్.. సభా నిబంధనలకు పూర్తి విరుద్ధం, అప్రజాస్వామికం అని ఖర్గే చెప్పారు. నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. మొత్తం సమావేశ కాలం పాటు వేటు వేయడం ‘మితిమీరిన చర్య’గా పేర్కొంటూ విడిగా లేఖ సమర్పించారు. ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం సబబు కాదన్నారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఛైర్మన్ తేల్చి చెప్పారు. ‘..వారు సభకు అంతరాయం కలిగించారు. టేబుళ్లపైకి వచ్చారు. పత్రాలు విసిరికొట్టారు. ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని చెప్పారు. తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించక తప్పడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలోనూ సభలో అనేక మందిపై చర్యలు తీసుకున్నామనీ, దానిని అప్రజాస్వామికమని అనడం తప్పు అని చెప్పారు.
లోక్సభలో తెరాస నిరసన
సభ్యులపై సస్పెన్షన్ను నిరసిస్తూ అంతకుముందు లోక్సభలో కూడా విపక్షాలు ఆందోళనకు దిగాయి. వారికి మద్దతుగా సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రభుత్వం నిరంకుశత్వంతో వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ప్రశ్నోత్తరాల సమయం మొదలవగానే తెరాస సభ్యులు వెల్లోకి వెళ్లి, కనీస మద్దతు ధరపై చట్టాన్ని తీసుకురావాలని, ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలనీ డిమాండ్ చేశారు. ఆ మేరకు నినాదాలిచ్చారు. కాంగ్రెస్, వామపక్ష సభ్యులు సహా ఇతర విపక్ష ఎంపీలు కొన్ని అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నించారు. తమకు అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్, ఎన్సీపీ, వామపక్షాలు, డీఎంకే వాకౌట్ చేశాయి. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల వేతనాలు, సేవా నిబంధలనకు సంబంధించిన సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
గాంధీ విగ్రహం వద్ద నిరసన
సభలో మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం రావడం లేదని లోక్సభలో కాంగ్రెస్పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి చెప్పారు. ఎంపీల గొంతు నొక్కాలని చూస్తే గళమెత్తకుండా కూర్చోలేమని ఆయన విలేకరులకు చెప్పారు. ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. 12 మందిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చర్చలేమీ చేపట్టకుండా ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ‘సభ్యులు దేని కోసం క్షమాపణ చెప్పాలి? పార్లమెంటులో ప్రజా సంబంధిత అంశాలను లేవనెత్తినందుకా?’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు.
రోజువారీగా వ్యూహ రూపకల్పన
సమావేశం ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు సమావేశమై, సభ్యుల సస్పెన్షన్పై చర్చించాయి. సభలో అనుసరించాల్సిన తీరుపై రోజువారీగా వ్యూహం రూపొందించాలని నిర్ణయించాయి. ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. డీఎంకే, శివసేన, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఆప్, ఆర్జేడీ, ఎన్సీ, ఆర్ఎస్పీ, తెరాస తదితర 16 పార్టీల సభ్యులు హాజరయ్యారు. సస్పెన్షన్కు గురైన వారిలో తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నప్పటికీ టీఎంసీ హాజరు కాలేదు. సభలను బహిష్కరించాక పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉభయసభల ఎంపీలు నిరసనకు దిగారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని ఛైర్మన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాము చేసింది తప్పేం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోమని స్పష్టంచేశారు. ఆ తర్వాత రెండోసారి విపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద 12 మంది ఎంపీలు డిసెంబర్ 23 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు నిరసన వ్యక్తం చేస్తారని తృణమూల్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక