ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్ల దాడి
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా భాజపా నాయకుల కార్లపై రాళ్లు, కర్రలతో దాడి జరిగింది. నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ వాహనంతో పాటు మరో ఏడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
పలువురు కార్యకర్తలకు గాయాలు
నిజామాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
పోలీసులు, తెరాస శ్రేణులు కలిసే చేశారని ఎంపీ ఫిర్యాదు
ఈనాడు, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా భాజపా నాయకుల కార్లపై రాళ్లు, కర్రలతో దాడి జరిగింది. నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ వాహనంతో పాటు మరో ఏడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. నందిపేట్ మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దాడి చేసింది తెరాస శ్రేణులేనని, ఇందులో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హస్తం ఉందంటూ ఎంపీ అర్వింద్ విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. పోలీసులు వారికి సహకరించారని, నిజామాబాద్ సీపీకీ ఇందులో సంబంధం ఉందంటూ ఆరోపించారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో అదనపు డీసీపీ వినీత్కు ఫిర్యాదు చేశారు.
తోపులాట.. రాళ్లదాడి
మండలంలో మంగళవారం ప్రారంభోత్సవాలు, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం ఉదయమే ఆయన బయలుదేరారు. తన పర్యటనను అడ్డుకొనేందుకు తెరాస శ్రేణులు కుట్ర చేస్తున్నాయంటూ మార్గమధ్యలో ఆర్మూర్ మండలం మామిడిపల్లి వద్ద ధర్నాకు దిగారు. వారిని నిలువరించాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచే సీపీకి ఫోన్చేసి మాట్లాడారు. కాసేపటి తర్వాత నందిపేట్కు బయల్దేరగా ఇస్సాపల్లి వద్ద పోలీసులు ఆపి.. ముందుకెళ్తే గొడవలు జరిగే పరిస్థితి ఉందని చెప్పటంతో గంటన్నరపాటు అక్కడే నిలిచిఉన్నట్లు ఎంపీ వివరించారు. పర్యటన రద్దు చేసుకొని వెనక్కి వెళ్తుండగా రెండు వైపుల నుంచి తెరాస కార్యకర్తలు కర్రలు, కత్తులు, రాళ్లతో వచ్చి దాడికి దిగినట్లు చెప్పారు. కొందరు వ్యక్తులు దాడులు చేస్తుండగా.. భాజపా కార్యకర్తలు పరుగులు తీస్తున్న వీడియోలు బయటకొచ్చాయి.
లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా
మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అర్వింద్ నిజామాబాద్ సీపీ కార్యాలయానికి చేరుకొని అక్కడే విలేకర్లతో మాట్లాడారు. భాజపాకు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తెరాస దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. తెరాస వారు దాడికి పాల్పడే అవకాశం ఉందని ఊహించి పోలీసులను అప్రమత్తం చేసినా.. అడ్డుకోలేకపోయారని విమర్శించారు. దీనిపై లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి 50 వేల ఓట్ల తేడాతో ఓడించకుంటే తన పేరు ధర్మపురి అర్వింద్ కాదని ఎంపీ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, రాజాసింగ్, ఈటల ఫోన్చేసి ఘటనపై మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు.
పోలీసుల అండతోనే తెరాస దాడి: సంజయ్
నీలగిరి, న్యూస్టుడే: ఎంపీ అర్వింద్, కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో భాజపా బలపడుతుండడంతో అభద్రతతో ముఖ్యమంత్రి, ఆయన సహచరులు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి విపక్ష ప్రజా ప్రతినిధులు పర్యటించినా తట్టుకోలేక తెరాస నాయకులు పోలీసుల అండతో దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన చెందారు. దాడి విషయం చెప్పడానికి పోలీసు కమిషనర్, డీజీపీకి ఫోన్ చేస్తే ఎత్తడం లేదన్నారు. 317జీవో సవరించాలని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నా సీఎం స్పందించడం లేదని.. ఆ ఆందోళనతోనే వరంగల్లో రమేశ్ అనే ఉద్యోగి మృతి చెందినట్లు సంజయ్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.