ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్ల దాడి
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా భాజపా నాయకుల కార్లపై రాళ్లు, కర్రలతో దాడి జరిగింది. నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ వాహనంతో పాటు మరో ఏడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
పలువురు కార్యకర్తలకు గాయాలు
నిజామాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
పోలీసులు, తెరాస శ్రేణులు కలిసే చేశారని ఎంపీ ఫిర్యాదు
ఈనాడు, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా భాజపా నాయకుల కార్లపై రాళ్లు, కర్రలతో దాడి జరిగింది. నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ వాహనంతో పాటు మరో ఏడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. నందిపేట్ మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దాడి చేసింది తెరాస శ్రేణులేనని, ఇందులో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హస్తం ఉందంటూ ఎంపీ అర్వింద్ విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. పోలీసులు వారికి సహకరించారని, నిజామాబాద్ సీపీకీ ఇందులో సంబంధం ఉందంటూ ఆరోపించారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో అదనపు డీసీపీ వినీత్కు ఫిర్యాదు చేశారు.
తోపులాట.. రాళ్లదాడి
మండలంలో మంగళవారం ప్రారంభోత్సవాలు, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం ఉదయమే ఆయన బయలుదేరారు. తన పర్యటనను అడ్డుకొనేందుకు తెరాస శ్రేణులు కుట్ర చేస్తున్నాయంటూ మార్గమధ్యలో ఆర్మూర్ మండలం మామిడిపల్లి వద్ద ధర్నాకు దిగారు. వారిని నిలువరించాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచే సీపీకి ఫోన్చేసి మాట్లాడారు. కాసేపటి తర్వాత నందిపేట్కు బయల్దేరగా ఇస్సాపల్లి వద్ద పోలీసులు ఆపి.. ముందుకెళ్తే గొడవలు జరిగే పరిస్థితి ఉందని చెప్పటంతో గంటన్నరపాటు అక్కడే నిలిచిఉన్నట్లు ఎంపీ వివరించారు. పర్యటన రద్దు చేసుకొని వెనక్కి వెళ్తుండగా రెండు వైపుల నుంచి తెరాస కార్యకర్తలు కర్రలు, కత్తులు, రాళ్లతో వచ్చి దాడికి దిగినట్లు చెప్పారు. కొందరు వ్యక్తులు దాడులు చేస్తుండగా.. భాజపా కార్యకర్తలు పరుగులు తీస్తున్న వీడియోలు బయటకొచ్చాయి.
లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా
మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అర్వింద్ నిజామాబాద్ సీపీ కార్యాలయానికి చేరుకొని అక్కడే విలేకర్లతో మాట్లాడారు. భాజపాకు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తెరాస దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. తెరాస వారు దాడికి పాల్పడే అవకాశం ఉందని ఊహించి పోలీసులను అప్రమత్తం చేసినా.. అడ్డుకోలేకపోయారని విమర్శించారు. దీనిపై లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి 50 వేల ఓట్ల తేడాతో ఓడించకుంటే తన పేరు ధర్మపురి అర్వింద్ కాదని ఎంపీ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, రాజాసింగ్, ఈటల ఫోన్చేసి ఘటనపై మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు.
పోలీసుల అండతోనే తెరాస దాడి: సంజయ్
నీలగిరి, న్యూస్టుడే: ఎంపీ అర్వింద్, కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో భాజపా బలపడుతుండడంతో అభద్రతతో ముఖ్యమంత్రి, ఆయన సహచరులు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి విపక్ష ప్రజా ప్రతినిధులు పర్యటించినా తట్టుకోలేక తెరాస నాయకులు పోలీసుల అండతో దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన చెందారు. దాడి విషయం చెప్పడానికి పోలీసు కమిషనర్, డీజీపీకి ఫోన్ చేస్తే ఎత్తడం లేదన్నారు. 317జీవో సవరించాలని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నా సీఎం స్పందించడం లేదని.. ఆ ఆందోళనతోనే వరంగల్లో రమేశ్ అనే ఉద్యోగి మృతి చెందినట్లు సంజయ్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
నడి వేసవిలో వణికించిన వాన
భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. -
మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి
‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. -
‘రైతు భరోసా’ బంద్
‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. -
అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
యూఎస్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు
రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. -
20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. -
ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందలు దాటేశాయి. -
50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి
తెలంగాణలో 50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్మెంట్ 30 శాతంతో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్యూటీఎఫ్) శివశంకర్ను కోరింది. -
ముఖ గుర్తింపు విధానం నుంచి మినహాయించండి!
తెలంగాణలోని పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్త విద్యాసంవత్సరం నుంచి చేపడుతున్న ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం నుంచి అంధ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని రాష్ట్ర అంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మల్లేశం, రాఘవేందర్రెడ్డి, ఇతర నేతలు అనిల్కుమార్, జి.మల్లేశ్, నాగేంద్రమ్మలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. -
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. -
టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల
కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. -
భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!
రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276