కేసీఆర్‌ గారూ.. ఇదిగో సాక్ష్యం: వీడియో పోస్టుచేసిన అస్సాం సీఎం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతూనే ఉంది. ‘రాహుల్‌గాంధీయే కాదు నేను కూడా ప్రశ్నిస్తున్నా.. మెరుపు దాడుల (సర్జికల్‌ స్ట్రయిక్స్‌) సందర్భంగా ఏం

Updated : 15 Feb 2022 08:13 IST

సైన్యాన్ని అవమానిస్తే నవభారతం సహించదని వ్యాఖ్య

ఈనాడు, గువాహటి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతూనే ఉంది. ‘రాహుల్‌గాంధీయే కాదు నేను కూడా ప్రశ్నిస్తున్నా.. మెరుపు దాడుల (సర్జికల్‌ స్ట్రయిక్స్‌) సందర్భంగా ఏం జరిగిందో బయటపెట్టాలి’ అంటూ కేసీఆర్‌ వ్యాఖ్యానించడంపై హిమంత బిశ్వశర్మ సోమవారం ఉదయం ట్విటర్‌లో స్పందించారు.  కేసీఆర్‌ వ్యాఖ్యల వీడియోను జత చేస్తూ ‘విపక్షం మెరుపు దాడుల గురించి ప్రశ్నిస్తూ.. అమరవీరులను అవమానించేందుకు పూనుకుంది’ అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌, కాంగ్రెస్‌ నాయకులు గాంధీ కుటుంబానికి తమ విధేయతను ప్రదర్శించడానికి పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘డియర్‌ కేసీఆర్‌ గారూ.. మన సైన్యం చేసిన వీరోచిత దాడులకు ఇదిగో సాక్ష్యం’ అంటూ పేర్కొన్నారు.  ‘సైన్యాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి మీరెందుకు ప్రయత్నిస్తున్నారు? సైన్యాన్ని అవమానిస్తే నవభారతం సహించదు’’ అని ట్విటర్‌లో కేసీఆర్‌కు జవాబిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని