పవన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను 2024లో ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మెగా అభిమానులంతా కలిసి పనిచేయాలని చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌ అభిమానుల సంయుక్త సమావేశం నిర్ణయించింది.  అభిమాన

Published : 23 May 2022 04:33 IST

చిరంజీవి, పవన్‌, రామ్‌చరణ్‌ అభిమానుల సమావేశంలో నిర్ణయం

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను 2024లో ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మెగా అభిమానులంతా కలిసి పనిచేయాలని చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌ అభిమానుల సంయుక్త సమావేశం నిర్ణయించింది.  అభిమాన సంఘాల కీలక ప్రతినిధులు విజయవాడలో ఆదివారం సమావేశమయ్యారు. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం వ్యవస్థాపకుడు స్వామినాయుడు, సంఘం జాతీయ అధ్యక్షుడు మహేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రవికుమార్‌, సినిమా దర్శకుడు బాబీ, హాస్యనటుడు భద్రం తదితరులు పాల్గొన్నారు. మెగా అభిమానులంతా పవన్‌ కల్యాణ్‌ వెంటే నడుస్తారని స్వామినాయుడు వివరించారు. విశాఖపట్నం, తిరుపతిలలోనూ త్వరలో మెగా అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఏపీలో తొలుత ఏర్పాటుచేసి ఆ తర్వాత తెలంగాణలోనూ పెడతామని నాయకులు తెలిపారు. సినిమా టికెట్‌ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్‌ వద్దకు చిరంజీవి వెళ్లినప్పటి పరిస్థితి తమను బాధించిందని సమావేశంలో కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని