వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పేరు నమోదుకు వినతి

వైఎస్సార్‌ తెలంగాణ పేరుతో పార్టీని నమోదు చేయాలని భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ప్రతిపాదన అందింది. హైదరాబాద్‌కు చెందిన వాడుక రాజగోపాల్‌ ఛైర్మన్‌/ప్రెసిడెంట్‌గా, సుధీర్‌కుమార్‌ ప్రధాన

Published : 04 Jun 2021 03:39 IST

ఈనాడు, దిల్లీ: వైఎస్సార్‌ తెలంగాణ పేరుతో పార్టీని నమోదు చేయాలని భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ప్రతిపాదన అందింది. హైదరాబాద్‌కు చెందిన వాడుక రాజగోపాల్‌ ఛైర్మన్‌/ప్రెసిడెంట్‌గా, సుధీర్‌కుమార్‌ ప్రధాన కార్యదర్శిగా, నూకల సురేష్‌ కోశాధికారిగా ఈసీఐకి ప్రతిపాదనలు పంపారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పేరు నమోదుకు తమకు ప్రతిపాదనలు అందాయని, పార్టీ పేరుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూన్‌ 16లోగా తెలియజేయాలని ఈసీఐ ఓ ప్రకటనలో కోరింది. రాజగోపాల్‌ షర్మిల రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్తగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని