ఏ చలీ వణికించలేదు!
తూర్పు లద్దాఖ్లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. ఎముకలు కొరికే చలికి సైతం తమను కదిలించే
అటు చైనాతో.. ఇటు శీతాకాలంతో పోరాటానికి భారత్ సిద్ధం
అధునాతన వసతులతో సరిహద్దుల్లో ప్రత్యేక ఆవాసాలు
తూర్పు లద్దాఖ్కు తరలిన టన్నుల ఆహారం, సామగ్రి
దిల్లీ: తూర్పు లద్దాఖ్లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. ఎముకలు కొరికే చలికి సైతం తమను కదిలించే దమ్ము లేదని చాటేందుకు సిద్ధమైంది. శీతాకాలం ఆరంభం కాగానే భారత సేన వెనుదిరుగుతుందన్న డ్రాగన్ అపోహలను పటాపంచలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇందుకోసం మన బలగాలు చేపట్టిన అతిపెద్ద సైనిక సరఫరా ఆపరేషన్ దాదాపుగా పూర్తికావొస్తోంది. ఇందులో భాగంగా భారీ ట్యాంకులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంధనం, ఆహారం, శీతాకాల నిత్యావసరాలు ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఈ ఆపరేషన్ను సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు భారత్ అటు చైనాను, ఇటు హిమాలయ శీతాకాలాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.
తూర్పు లద్దాఖ్లో చలికాలం ఆరంభమవుతోంది. అక్కడ.. చైనాతో సాగుతున్న వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశం లేకపోవడంతో శీతాకాలంలోనూ ఇదే సంఖ్యలో బలగాలను కొనసాగించాలని భారత సైన్యం నిర్ణయించింది. ఇక్కడ 50 వేల మందికిపైగా సైనికులు ఉన్నారు. వీరిని శీతాకాలంలో కొనసాగించడం ఆషామాషీ కాదు. ఇందుకోసం భారీగా సామగ్రి అవసరం. వీటిని మన సైన్యం.. అక్కడికి హుటాహుటిన తరలిస్తోంది. ఇందుకోసం జులై మధ్యలోనే ఆపరేషన్ ప్రారంభం కాగా.. అది ఇప్పుడు పూర్తికావొస్తోంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత సైన్యం.. పెద్ద సంఖ్యలో టి-90, టి-72 ట్యాంకులు, శతఘ్నులు, పదాతిదళ పోరాట శకటాలను చుషుల్, దెమ్చోక్ సహా సున్నితమైన అన్ని ప్రాంతాలకూ తరలించింది. భారీగా శీతాకాల దుస్తులు, గుడారాలు, వేల టన్నుల ఆహార పదార్థాలు, కమ్యూనికేషన్ సాధనాలు, ఇంధనం, హీటర్లు, ఇతర సరఫరాలను.. సరిహద్దు శిబిరాలకు చేరవేసింది. వీటిలో కొన్ని.. సముద్రమట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ ఆపరేషన్ కోసం భారత వాయుసేనలోని సి-130జె, సి-17 గ్లోబ్మాస్టర్ సహా అన్ని రవాణా విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగించింది. స్వాతంత్య్రం తర్వాత లద్దాఖ్లో చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ ఇదేనని సీనియర్ సైనికాధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా బారులు తీరిన యుద్ధట్యాంకులు, సాయుధ శకటాలు కనిపిస్తున్నాయి.
కఠోర వాతావరణం..
తూర్పు లద్దాఖ్లో అక్టోబర్ నుంచి జనవరి మధ్య ఉష్ణోగ్రతలు మైనస్ 5 నుంచి మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ మేర ఉంటాయి. రాత్రివేళ పెనువేగంతో వీచే శీతల గాలులు.. మనిషిని నిలువునా గడ్డకట్టించేస్తాయి. అందువల్ల వాతావరణాన్ని తట్టుకోవడానికి శీతాకాల దుస్తులు, ఇతర ఉపకరణాలను ఐరోపా దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. తీవ్ర చలిగాలులను తట్టుకునేందుకు సరికొత్త ఆవాసాలు, ప్రిఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలను భారత సేన యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోంది. వీటికి పెద్దగా సిమెంటు, ఇసుక అవసరం లేదు. వీటిని వేగంగా వినియోగానికి సిద్ధం చేయవచ్చు. బలమైన గాలులు, చలి నుంచి రక్షించేందుకు ఈ ఆవాసాల్లో ఇన్సులేషన్ ఉంటుంది. హీటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వంట గది, మరుగుదొడ్లు వంటివీ ఇందులో ఉంటాయి. ఇందుకోసం అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.
నిమిషాల్లోనే..
ఆదేశాలు అందిన నిమిషాల వ్యవధిలోనే.. చైనా వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్దకు దూసుకెళ్లే సామర్థ్యం భారత ట్యాంకు దళాలకు ఉంది. ఆగస్టు 29, 30 తేదీల్లో చైనాకు చెక్ పెట్టేందుకు భారత సేన.. పాంగాంగ్ సరస్సు దక్షిణ రేవులోని కీలక పర్వత ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఈ దళాలు తమ సత్తాను ప్రదర్శించాయి. నాడు మెరుపు వేగంతో ఎల్ఏసీ వద్దకు దూసుకెళ్లి, చైనా సైన్యాన్ని నిలువరించాయి.
‘‘సరైన శిక్షణ, శీతాకాలాన్ని ఎదుర్కొనే ప్రత్యేక దుస్తుల సరఫరా వల్ల సైనికుల పోరాట సన్నద్ధత పటిష్ఠంగా ఉంటుంది. ఫలితంగా స్వల్ప వ్యవధిలోనే వారు యుద్ధానికి సిద్ధంకాగలరు. సైనికులకు శిక్షణ, నైపుణ్యాలకు పదునుబెట్టే కార్యక్రమాలు శీతాకాలంలోనూ కొనసాగుతాయి’’ అని ఓ అధికారి తెలిపారు.
టీవీలూ సిద్ధం..
కుటుంబాలకు వేల కిలోమీటర్ల దూరంలో, ప్రతికూల వాతావరణంలో.. శత్రు సేనకు కూతవేటు దూరంలో విధులు నిర్వర్తించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇంత కఠోర పరిస్థితుల్లో పనిచేసే వీర జవాన్లకు కాస్తంత ఆటవిడుపు కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీవీలు, సెట్టాప్ బాక్స్లను ఏర్పాటు చేస్తున్నారు. వీరికి అధిక కేలరీలు కలిగిన పోషకాహారాలను అందిస్తున్నారు.
పదును తగ్గని ఆయుధాలు
ఈ ప్రాంతంలో మన సైన్యం మోహరించిన టి-90, టి-72 ట్యాంకులు, ‘బీఎంపీ-2’ పదాతి దళ సాయుధ శకటాలు.. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచేయగలవు. ప్రపంచంలో ఇలాంటి కఠోర వాతావరణంలో సాయుధ శకటాలను మోహరించిన ఏకైక దేశం భారత్. ఈ ట్యాంకులు, శకటాలు, భారీ తుపాకుల నిర్వహణ, మరమ్మతులు చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. నదులు దాటడం, అడ్డంకులను అధిగమించడం మన ట్యాంకు రెజిమెంట్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడ సింధు నది ప్రవహిస్తోంది. ‘‘ఇలాంటి వాతావరణంలో పనిచేసిన అనుభవం మన యాంత్రిక పదాతి దళానికి ఉంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ సుదీర్ఘకాలం పోరాటం చేయగలదు’’ అని ఓ అధికారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.