TS News: ఎలన్ మస్క్ పాఠశాలకు వరంగల్ విద్యార్థి
వరంగల్కు చెందిన ఆరో తరగతి విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేత, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ పాఠశాలలో ప్రవేశం సాధించాడు. హనుమకొండ
అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తిచేసి ఎంపిక
అనిక్ పాల్ సర్కారు బడి విద్యార్థి
న్యూస్టుడే, గోపాలపూర్ (వరంగల్): వరంగల్కు చెందిన ఆరో తరగతి విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేత, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ పాఠశాలలో ప్రవేశం సాధించాడు. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన రేణుకుంట్ల విజయ్పాల్, సృజన దంపతులు వరంగల్ నగరంలోని గోపాలపూర్లో నివసిస్తున్నారు. విజయ్పాల్ జనగామ జిల్లా జఫర్గఢ్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వీరి చిన్న కుమారుడు అనిక్ పాల్ నిట్ సమీపంలోని ప్రభుత్వ ఆర్ఈసీ పాటక్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
‘సింథసిస్’ లక్ష్యమిదీ..: ఇప్పుడున్న విద్యా ప్రణాళికలు, బోధన పద్ధతులు విద్యార్థుల్లో ఆశించిన మేరకు నైపుణ్యాలను అందించలేకపోతున్నాయని భావించిన ఎలన్ మస్క్ సింథసిస్ పాఠశాల స్థాపించారు. 21వ శతాబ్దపు సాంకేతికత ఆధారంగా బోధన ఉంటుంది. ఇక్కడ ప్రయోగాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ పాఠశాల గురించి తెలుసుకున్న విజయ్పాల్ తమ కుమారుడి ప్రవేశానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించడం మొదలుపెట్టారు.
ఇలా ప్రవేశం..: ప్రవేశ పరీక్షలో మూడు స్థాయులుంటాయి. సింథసిస్ పాఠశాల యాజమాన్యం వీడియోలు, గేమ్స్ రూపంలో ప్రశ్నలను ఇచ్చి వాటిని విద్యార్థులు ఎలా చేధిస్తున్నారన్న దాన్ని పరిశీలిస్తారు. అనిక్ పాల్ మొదటి రెండు దశల్లో ప్రశ్నలకు విజయవంతంగా సమాధానాలిచ్చాడు. తరువాత ఒక వివరణాత్మక సమస్యకు వీడియో రూపొందించి పంపించాడు. చివరిగా ఆన్లైన్లో ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహించిన సింథసిస్ యాజమాన్యం అనిక్పాల్కు ఈనెల 12న ఆరో తరగతిలో ప్రవేశం కల్పించింది. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తివేసిన తరువాత అమెరికాకు పంపిస్తామని తండ్రి విజయ్పాల్ తెలిపారు. అక్కడ ఇంటర్ వరకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది.
అరుదైన నైపుణ్యం...
చాలామంది పిల్లలు చరవాణిలో ఆన్లైన్ వీడియోగేమ్స్ ఆడతారు. అనిక్పాల్ మాత్రం వీడియోగేమ్స్ ఆడి వదిలేయకుండా వీటిని ఎలా రూపొందిస్తారనే అన్వేషణ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే కోడింగ్, పైథాన్ లాంగ్వేజ్లు నేర్చుకున్నాడు. స్కిల్్్ట నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మేకిన్ లెర్నింగ్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేశాడు. ఐఐటీ మద్రాస్ నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ కార్యక్రమంలో అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు సమర్పించి భళా అనిపించాడు. ఇందులో దేశవ్యాప్తంగా పాల్గొన్నవారిలో అనిక్పాల్ అతి చిన్న వయస్కుడు. అనిక్ అబాకస్, వేదగణితం, రూబిక్ క్యూబ్, మెమోరీ టెక్నిక్లు నిత్యం సాధన చేసేవాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.