వర్సిటీలో వసూల్ రాజా
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఓ కీలక అధికారి తనిఖీల పేరుతో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘అడిగినంత ఇవ్వండి.. లేకుంటే మీ ఇష్టమ’ని బెదిరిస్తున్నట్లు
తనిఖీల పేరిట ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు బెదిరింపులు
అడిగినంత ఇవ్వకుంటే వేధింపులు
తెలంగాణ వర్సిటీలో ఓ అధికారి బాగోతం
ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్న యాజమాన్యాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఓ కీలక అధికారి తనిఖీల పేరుతో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘అడిగినంత ఇవ్వండి.. లేకుంటే మీ ఇష్టమ’ని బెదిరిస్తున్నట్లు సమాచారం. అసలే అంతంతమాత్రంగా నడుస్తున్న చిన్నాచితకా కళాశాలల యజమానులు ఆయన నుంచి ఫోన్ వచ్చినా.. పిలుపు వచ్చినా వణికిపోతున్నారు. పలువురు ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు ముగ్గురు మంత్రులను కొన్ని కళాశాలల యజమానులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నట్లు తెలిసింది. అయినా ఫలితం లేదని వారు వాపోతున్నారు.
ఉన్నతాధికారుల హెచ్చరికలూ బేఖాతరు
విశ్వవిద్యాలయంలో కీలక పదవిలో ఉన్న ఆ అధికారి వచ్చీరావడంతోనే ‘ఆదాయ మార్గాల’ అన్వేషణ మొదలుపెట్టారు. తాను పెద్దమొత్తంలో ఖర్చు చేసి ఈ పదవిని చేజిక్కించుకున్నానని స్వయంగా చెప్పుకొనే ఆయన.. దాన్ని రాబట్టేందుకు పరికరాలను, వస్తువులను ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. వర్సిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికే ఎక్కువ మంది ఉన్నా.. పదుల సంఖ్యలో కొత్త నియామకాలు చేపట్టారు. అందుకు బేరాలు కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారం బయటపడటంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని నియామకాలను నిలిపివేసింది. ఆయనను ఉన్నతాధికారులు పలుమార్లు హైదరాబాద్కు పిలిపించి హెచ్చరించినా మార్పు రాలేదు. నియామకాలు ఆగిపోవడం.. బోధన, బోధనేతర ఉద్యోగాలను ఉమ్మడి బోర్డు ద్వారా భర్తీ చేస్తుండటంతో ఆయన కొత్త ఆదాయ మార్గాలను వెతికారు. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు అనుబంధ గుర్తింపు, తనిఖీలను ఇందుకు ఆసరాగా చేసుకున్నారు. చిన్న చిన్న కళాశాలలనే కాదు.. యూజీసీ స్వయంప్రతిపత్తి ఉన్న కాలేజీలనూ వదలడం లేదు.
విద్యార్థికి రూ.వెయ్యి చొప్పున..
వర్సిటీ పరిధిలో సుమారు 60 కళాశాలలున్నాయి. కొద్ది నెలల క్రితం ఆ అధికారి కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేయించారు. వాటి నివేదికలను బయటపెడతానంటూ భయపెట్టి... ఎంపిక చేసిన కాలేజీల నుంచి భారీగా వసూలు చేశారు. తాజాగా కొత్త విద్యా సంవత్సరానికి(2022-23) కళాశాలలో ఉన్న ఒక్కో విద్యార్థికి రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఒక కళాశాలలో 200 మంది ఉంటే రూ.2 లక్షలు సమర్పించుకోవాలన్నమాట. అంతంతమాత్రంగా నడుస్తున్న ఓ కళాశాల యజమాని.. సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించారు. రూ.లక్షలు ఇవ్వాలని ఆయనను డిమాండ్ చేయడంతో ఇటీవల ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. ఎక్కడ తనిఖీల పేరిట ఇబ్బంది పెడతారోనని వసూళ్ల పర్వం గురించి బహిరంగంగా చెప్పేందుకు రాజకీయ పలుకుబడి ఉన్న యజమానులూ జంకుతున్నారు. నిజామాబాద్లో తనది ప్రముఖ కళాశాల అయినా ఇబ్బంది పడుతున్నానని, ఎక్కువ మంది విద్యార్థులు ఉండటంతో రూ.15 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఓ యజమాని ‘ఈనాడు’తో వాపోయారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల రాష్ట్ర సంఘం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. ఆ సంఘం రాష్ట్ర ప్రతినిధులు ఇటీవల నిజామాబాద్కు వెళ్లి రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధుల దృష్టికీ తీసుకెళ్తామని, ఎవరూ భయపడొద్దని, ఆత్మహత్య ఆలోచనలు మానుకోవాలని భరోసా ఇచ్చారు. ఆ అధికారిపై చర్య తీసుకుంటే తమ ప్రభుత్వం ఎక్కడ ఇరుకున పడుతుందోనని రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులు సైతం తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్