HarishRao: నీతి ఆయోగ్ది రాజకీయ రంగు
నీతి ఆయోగ్ రాజకీయ రంగును పులుముకుందని..భాజపాకు వంతపాడుతూ ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా
భాజపాకు వంతపాడడం సిగ్గుచేటు
సీఎం అడిగిన ప్రశ్నలకు జవాబుల్లేవు
అసత్యాలతో తప్పుడు వివరణలు
మంత్రి హరీశ్రావు ధ్వజం
* కేంద్రం సెస్లను 10 నుంచి 20 శాతానికి పెంచుకుని.. రాష్ట్రాలకు పన్నుల వాటాలో నిధులు తగ్గించింది. ఏడేళ్లలో సమకూర్చుకున్న సెస్లు రూ.15,47,560 కోట్లు.. ఈ ఏడాదివి రూ.5,35,112 కోట్లతో కలిపితే అది దాదాపు రూ.21 లక్షల కోట్లు.
* గతంలో రాష్ట్రాలకు పన్నుల వాటా 41 శాతం ఉండేది. దాని ప్రకారం చూస్తే రూ.21 లక్షల కోట్లల్లో రూ.8,60,000 కోట్లు హక్కుగా అన్ని రాష్ట్రాలకూ రావాలి. రాష్ట్ర వాటాగా తెలంగాణకు రూ.42 వేల కోట్లు రాకుండా పోయాయి. మరో విషయం ఏమంటే అసలు రాష్ట్రాలకు ఇప్పుడు పన్నుల వాటాగా ఇస్తున్నది 42 శాతం కాదు 29.6 శాతమే.
- ఆర్థిక మంత్రి హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: నీతి ఆయోగ్ రాజకీయ రంగును పులుముకుందని..భాజపాకు వంతపాడుతూ ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాల్సింది పోయి..తప్పుడు వివరణతో వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. మంత్రులు మహమూద్ అలీ, గంగుల కమలాకర్లతో కలిసి ఆదివారం ఇక్కడ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల అమలు కోసం నీతి ఆయోగ్ చెప్పినా ఆ సిఫార్సులను కేంద్రం చెత్త బుట్టలో వేసింది. కానీ ఇప్పుడేమో నిధులు ఇచ్చినా వాడుకోలేదని అదే చెప్పడం విడ్డూరంగా ఉంది’’ అని అన్నారు. అలాగే ఆర్థిక సంఘం సిఫార్సులను గతంలో అమలు చేశారని.. మోదీ ప్రభుత్వం మాత్రం అమలు చేయలేదని, దీనిపై అది ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ‘‘సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం పెట్టిన గంటల వ్యవధిలోనే నీతి ఆయోగ్ స్పందించింది. కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వకపోగా తన విలువను తగ్గించుకుంది. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లి ఎన్ని సార్లు చెప్పినా అరణ్య రోదనే అవుతోంది. రాష్ట్రం సమావేశం బహిష్కరించింది అంటే తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అది వెంటనే ప్రకటన ఇచ్చింది అంటే ఒత్తిడి ఎంత పని చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజల్ని పక్కదోవ పట్టించటమే
జలజీవన్ మిషన్ కోసం తెలంగాణకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని అడిగాం. రూ.3 వేల కోట్లు ఇచ్చామని నీతి ఆయోగ్ చెప్తోంది. అందులో తెలంగాణ రూ.రెండు వందల కోట్లు మాత్రమే వాడుకుందని తప్పుడు ప్రకటన చేస్తోంది. ఇది ప్రజల్ని పక్కదోవ పట్టించటమే. కేంద్రం కాగితాల మీద లెక్కలు చూపుతోంది కానీ ఆచరణలో నిధులు ఇవ్వట్లేదు. మిషన్ కాకతీయకు అడిగితే... రూ.1,195 కోట్లు పీఎం కేఎస్వై ద్వారా ఇచ్చామంటున్నారు. అసలు దానికి మిషన్ కాకతీయకు ఏమైనా సంబంధం ఉందా? రాష్ట్రాలకు 32 శాతం నుంచి 42 శాతానికి నిధులు పెంచామంటోంది. ఇది పూర్తిగా సత్యదూరమని 15వ ఆర్థిక సంఘం, కాగ్ చెప్పింది. నవభారత వ్యూహం పేరుతో 2022 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో అన్నింటా వైఫల్యం కనిపిస్తోంది. అందరికీ ఇళ్లు, నల్లా ద్వారా దేశప్రజలకు సురక్షిత నీరు, 24 గంటల విద్యుత్, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటివి డిసెంబరు 19, 2018లో నీతి ఆయోగ్ నిర్దేశించుకోగా ఈ లక్ష్యాలు అలాగే మిగిలిపోయాయి’’ అని హరీశ్రావు విమర్శించారు.
ఆర్థిక సంఘం చెప్పిందిలా... జరిగిందిలా
* 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్ కింద రూ.723 కోట్లు, పౌష్టికాహార రంగం కోసం రూ.171 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే, కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.
* అలాగే 2021-26 మధ్య తెలంగాణకు సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్లు రూ. 3,024 కోట్లు ఇవ్వాలని సూచిస్తే కేంద్రం ఈ ప్రతిపాదనను పక్కనపెట్టింది.
* మిషన్ భగీరథ నిర్వహణ కోసం రూ.2,350 కోట్ల గ్రాంట్గా ఇవ్వాలని సూచిస్తే పట్టించుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.