Azadi Ka Amrit Mahotsav: ఔషధ యోగం.. ఆరోగ్య భాగ్యం
ఆంగ్లేయుల 200 సంవత్సరాల దుర్మార్గ పాలనలో అన్ని రంగాల మాదిరే వైద్య రంగమూ వ్యాధిగ్రస్థమైంది. వరుస కరవుల కారణంగా పౌష్టికాహారలోపం వెన్నాడి లక్షల మంది చిన్నచిన్న జబ్బులకూ పిట్టల్లా రాలిపోయారు. స్వాతంత్య్రం సిద్ధించాక ఒక్కో
75 ఏళ్ల వైద్య రంగంలో గణనీయ ప్రగతి
భారీగా పెరిగిన సగటు ఆయుర్దాయం
నిర్మూలన దశలో వివిధ వ్యాధులు
మందుల తయారీలో స్వావలంబన
వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఘన చరిత్ర
ఆంగ్లేయుల 200 సంవత్సరాల దుర్మార్గ పాలనలో అన్ని రంగాల మాదిరే వైద్య రంగమూ వ్యాధిగ్రస్థమైంది. వరుస కరవుల కారణంగా పౌష్టికాహారలోపం వెన్నాడి లక్షల మంది చిన్నచిన్న జబ్బులకూ పిట్టల్లా రాలిపోయారు. స్వాతంత్య్రం సిద్ధించాక ఒక్కో అడుగు వేసుకుంటూ జవసత్వాలు కూడదీసుకున్నాం. ఇప్పుడు అనూహ్యంగా 47 లక్షల మంది సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద వైద్యారోగ్య రంగాన్ని సృష్టించుకున్నాం. మందు బిళ్లల కోసం అంగలార్చిన మనమే... ప్రపంచ ఔషధ అవసరాల్లో 20% తీరుస్తున్నాం. కలరా, మశూచి, పోలియో వంటి మహమ్మారులను తరిమేశాం. కరోనా సంక్షోభంలోనూ టీకాల ఉత్పత్తితో మానవాళికి బతుకుపై భరోసా కల్పించాం. ఇలాంటి మెరుపులతోపాటు దృష్టి సారించాల్సిన కొన్ని మరకలూ ఉన్నాయి. అమృత మహోత్సవాల నేపథ్యంలో... వైద్య రంగంలో ఇన్నేళ్ల ప్రయాణం ఎలా సాగింది? రానున్న 25 సంవత్సరాల్లో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఏమిటి?
దేశంలో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు జీడీపీలో 2.1 శాతం
ఇది 1947లో భారతీయుడి సగటు ఆయుర్దాయం. 32 సంవత్సరాలు: ఇప్పుడది 70 ఏళ్లు
ఆంగ్లేయులు వెళ్లిపోయే నాటికి ప్రతి 1000 మందిలో ఏడాదికి చనిపోయేవారి సంఖ్య 45 మంది: నేడు అది 7 మాత్రమే
ఇది స్వాతంత్య్రం వచ్చే నాటికి ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీల నిష్పత్తి 946: ప్రస్తుతం అది 1020
భారత్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే నాటికి ఏటా మలేరియా మరణాల సంఖ్య ఇది 8 లక్షలు: ఇప్పుడవి 1000 మాత్రమే
ప్రాథమిక వైద్యమే ప్రాణాధారం
గ్రామాలకూ అందుబాటులో వైద్య సేవలు
పురోగమనంలో ఆరోగ్య భారతం
ఆంగ్లేయుల నుంచి 1947లో విముక్తి పొంది, స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్కు అధిక జనాభా, కొడిగట్టిన ఆర్థిక పరిస్థితి, అంటువ్యాధులు శాపంగా పరిణమించాయి. జవసత్వాలు కూడదీసుకుంటూ.. ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా ఆరోగ్య సూచికల్లో, మౌలిక వసతుల్లో భారత్ పురోభివృద్ధి దిశగా పయనిస్తోంది. మన వైద్యనిపుణులు మశూచి, ప్లేగు వ్యాధులను నిర్మూలించగలిగారు. మలేరియాను అదుపులోకి తీసుకొచ్చారు. పిల్లలకు ఉచిత టీకాల పంపిణీ కోసం 2014లో ప్రారంభించిన ఇంద్రధనుష్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. 2014లోనే భారత్ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. జిల్లాకొక వైద్య కళాశాలను స్థాపించడం ద్వారా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన కార్యాచరణ మొదలైంది. నాణానికి మరోవైపు... ఇప్పటికీ పట్టణాల్లో 60%, గ్రామాల్లో 50% మంది ఎక్కువగా ప్రైవేటు వైద్యులనే సంప్రదిస్తున్నారు. 18 ఏళ్లలోపు పిల్లల్లో ఏకంగా 47.2 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. క్షయ పీడితులు ఎక్కువగా ఉన్నది మన దేశంలోనే. నవజాత శిశువుల మరణాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలు.. చేరుకోవాల్సిన గమ్యాలపై సింహావలోకనం..
మార్గదర్శకత్వానికి ఎన్నెన్నో కమిటీలు
ప్రజలకు ఆరోగ్యాన్ని చేరువ చేయడానికి ప్రభుత్వం భోర్, ఛద్దా, ముఖర్జీ, కర్తార్సింగ్ తదితర కమిటీలను ఏర్పాటు చేసింది. వీటి సూచనలతో పీహెచ్సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల ఏర్పాటు. ఆరోగ్య పరిరక్షణకు చికిత్స అనుసంధానం, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్ల నియామకం, కుటుంబ నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమం, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వంటి ఎన్నో కార్యక్రమాలు అమలయ్యాయి. జాతీయ ఆరోగ్య విధానం(1983, 2002, 2017)తోనూ ప్రగతికి బాటలు వేశారు.
అవకాశాల గని ‘ఈ-హెల్త్’
దేశంలో ఇంటర్నెట్ ఆధారిత వైద్య సేవలు అందిస్తున్న ఈ-హెల్త్ రంగం విలువ 2022 నాటికి రూ.86 వేల కోట్లకు చేరింది. దీన్ని ఆలంబనగా చేసుకుని విస్తృతమైన ఉపాధి కల్పించవచ్చు.
తల్లీబిడ్డల సంరక్షణలో ముందడుగు
దేశంలో ఏఎన్ఎం వ్యవస్థ (1960-70)ను ఏర్పాటు చేశాక మాతాశిశు సంరక్షణ కార్యక్రమాల నిర్వహణ పెరిగింది. అంగన్వాడీ వ్యవస్థ(1975) ద్వారా మహిళలకు కుటుంబ నియంత్రణ, పిల్లల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన తదితర కార్యక్రమాలను రూపొందించారు. ఆశా ఆరోగ్య కార్యకర్తల వ్యవస్థ(2005)తో మహిళల ఆరోగ్యంపై మరింతగా దృష్టి కేంద్రీకరించడానికి అవకాశాలు పెరిగాయి.
* 1992-93లో 26 శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఇప్పుడు 86.6 శాతానికి పెరిగాయి. కొన్ని రాష్ట్రాల వెనుకబాటు ఫలితంగా ప్రసూతి మరణాల్లో 186 దేశాల్లో భారత్ 120వ ర్యాంకుతో దిగువన ఉంది. మహిళల్లో రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, క్యాన్సర్ వంటి వ్యాధుల తీవ్రత పెరుగుతోంది.
* దేశంలో తట్టు (స్మాల్పాక్స్)ను ఏప్రిల్ 1977 నాటికి పూర్తిగా నిర్మూలించగలిగా.
ఔషధ రంగంలో ఘనం
ఔషధాల ఉత్పత్తిలో పరిమాణం పరంగా భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల అవసరాల్లో 20% మనమే తీరుస్తున్నాం. ప్రపంచానికి జనరిక్ ఔషధాలను సమకూరుస్తున్న అతిపెద్ద దేశం భారత్. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు వినియోగించే యాంటీ వైరల్ ఔషధాల్లో 80% మన దేశం నుంచి సరఫరా చేస్తున్నవే.
టీకాల హబ్
దేశంలో టీకాల ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. ప్రపంచంలో వినియోగించే వ్యాక్సిన్లలో 60% భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్స్ ద్వారా కొవాగ్జిన్, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా ద్వారా కొవిషీల్డ్, బయోలాజికల్-ఈ ద్వారా కార్బోవాక్స్ టీకాలు భారత్లోనే ఉత్పత్తి అయ్యాయి.
గ్రామాలు.. నగరాల్లో ఒకేరకమైన వైద్యం!
రానున్న పాతికేళ్లలో వైద్యరంగం ఎలా పురోగమించాలో.. ఏయే లోపాలను సవరించుకోవాలో నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు..
* వైద్యరంగానికి తమ ఆదాయంలో బ్రిటన్ 12%, అమెరికా 14%, జపాన్ 9-10%... చొప్పున నిధులు కేటాయిస్తుంటే.. మనం 2.1% దగ్గరే ఆగిపోయాం. దేశంలో గ్రామాలు, నగరాల్లో ప్రజలకు ఒకేరకమైన వైద్యం అందుబాటులో ఉండాలి. ఆరోగ్య సూచీల్లో కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు... ఐరోపా దేశాలతో సమానంగా పురోగమిస్తున్నాయి. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాలు దిగువన ఉన్నాయి. ఇలాంటి వ్యత్యాసాలను నివారించాలి.
వైద్య పర్యాటకంతో ఉపాధికి బాటలు
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్లో అయిదో వంతు తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్య సేవలు లభిస్తున్నాయి. మనదేశ వైద్యపర్యాటకం వ్యవస్థ విలువ 2022 నాటికి సుమారు రూ.90 వేల కోట్లకు చేరింది. దీని అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి.
సమగ్ర ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ కావాలి
‘మహమ్మారులు వాస్తవం. వీటి నుంచి కాపాడుకోవడానికి ఖర్చు చాలా ఎక్కువ కావడంతోపాటు అవి మనం తట్టుకోలేనంతగా దాడి చేస్తాయని కొవిడ్ కాలంలో స్పష్టమైంది. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేయడం, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను నెలకొల్పడం తప్ప మరో మార్గం లేదు. దీన్ని ప్రాధాన్యంగా గుర్తించి, నిధులు కేటాయించాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం లాంటి ప్రయోగాలతో సమయాన్ని వృథా చేయకూడదు. ప్రాథమిక వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండేలా నిధులు కేటాయించాల’ని కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు అభిప్రాయపడ్డారు.
ఇప్పటికీ ఆరోగ్య బీమా 15 శాతమే
‘తీవ్ర అనారోగ్య సమస్య వస్తే 70% మంది ప్రజలకు సొంత డబ్బులు, అప్పులే దిక్కు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలతో కొంతవరకు మేలు జరిగినా... అన్ని వర్గాలకు ధీమా అందించడంలో బ్రిటన్ వైద్య విధానాన్ని అనుసరిస్తే మేలు. అక్కడ 97% మంది ప్రజలు నేషనల్ హెల్త్ సర్వీస్ పరిధిలోకి వస్తారు. అమెరికాలోనూ 70% మంది ప్రైవేటుగానైనా ఆరోగ్య బీమా చేసుకుంటున్నారు. భారత్లో 15% మంది మాత్రమే ఆరోగ్య బీమా పరిధిలో ఉన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలందరినీ దీని పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంద’ని ప్రముఖ జీర్ణకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య రవిరాజు తాతపూడి సూచిస్తున్నారు.
చిన్న సమస్యలకూ పెద్దాసుపత్రులా?
‘ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయకుండా ఎన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టినా ఫలితం లభించదు. ఇందుకోసం మూడంచెల వైద్య విధానం ఉండాలి. ప్రతి గ్రామానికి ఒక పీహెచ్సీ, కనీసం 50 కి.మీ. దూరంలో మాధ్యమిక వైద్యం అందుబాటులో ఉండాలి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రతి రెండు జిల్లాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి. ప్రజలు చిన్న సమస్యలకూ పెద్దాసుపత్రులకు వస్తుండడంతో నిజంగా ఉన్నత వైద్యం అవసరమైన వారికి లభించడంలేద’ని నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి ఆచార్య డాక్టర్ తాడూరి గంగాధర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కృష్ణయ్య వివరించారు.
75 ఏళ్ల కిందటితో పోల్చితే వైద్యుల సంఖ్య భారీగా పెరిగినా, వారిలో అత్యధికులు నగరాలు, పట్టణాలకే పరిమితం అవుతుండడం గ్రామీణ ఆరోగ్యానికి శాపంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు ఉండాలి. భారత్లో ప్రతి 1400 మందికి ఒకరున్నారు. కానీ మొత్తం వైద్యుల్లో 70% మంది పట్టణాలు, నగరాల్లోనే ఉన్నారు.
ప్రస్తుతం దేశంలో 80% మరణాలకు గుండెజబ్బులు, క్యాన్సర్, మధుమేహం, తీవ్ర శ్వాసకోశ వ్యాధులు కారణమవుతున్నాయి. ధూమపానం, మద్యపానం, పౌష్టికాహార లోపం, శారీరక వ్యాయామం లేకపోవడం ఈ వ్యాధులకు దారి తీస్తున్నాయి.
తొలి అల్లోపతి ఆసుపత్రి ఎప్పుడంటే...
దేశంలో ఆధునిక వైద్య విధానాలను తొలిసారిగా 16వ శతాబ్దంలో ప్రవేశపెట్టింది పోర్చుగీసు వారు. కానీ, తొలి అల్లోపతి ఆసుపత్రిని నిర్మించిన బ్రిటిష్ (1664) వారు.. తొలి మెడికల్ స్కూలును 1846లో కోల్కతాలో నెలకొల్పారు.
ఏటా 1,500 మంది పిల్లల వైద్య నిపుణులకు పట్టాలు
పీడియాట్రిక్స్ అసోసియేషన్ ప్రకారం... ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 50 వేల మంది పిల్లల వైద్యనిపుణులు ఉన్నారు. ఏటా 1,500 మంది వరకు కొత్తగా పట్టా పుచ్చుకుంటున్నారు. అయినా దేశంలో సగటున 10వేల జనాభాకు ఒక పిల్లల వైద్యుడు ఉండాలనే లక్ష్యం నెరవేరడం లేదు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం