కొత్త మిర్చికి రికార్డు ధర

వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌కు గురువారం తొలిసారిగా వచ్చిన ఆర్మూరు మిర్చి రకానికి క్వింటా రూ.20 వేలు, యూఎస్‌-341 రకానికి రూ.27,011 ధర పలికింది.

Published : 25 Nov 2022 03:33 IST

ఎనుమాముల మార్కెట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌కు గురువారం తొలిసారిగా వచ్చిన ఆర్మూరు మిర్చి రకానికి క్వింటా రూ.20 వేలు, యూఎస్‌-341 రకానికి రూ.27,011 ధర పలికింది. ఇప్పటివరకు కొత్త మిర్చి రకాలకు ఈ స్థాయిలో ధర రాలేదు. ఇప్పటికే మార్కెట్‌లో దేశీ రకానికి ఈ ఏడాది రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.90 వేలు, వండర్‌హాట్‌ రకానికి రూ.40వేల ధర లభించింది. శీతల గిడ్డంగుల్లోని తేజ రకానికి క్వింటా రూ.22 వేలు, వండర్‌హాట్‌ క్వింటా రూ.40 వేలు, యూఎస్‌-341కు రూ.26,100 ధర లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని