రాజుకుంటున్న రాజకీయ రగడ!
రాష్ట్రంలో మున్సిపల్ రాజకీయరగడ రోజు రోజుకూ రాజుకుంటోంది. పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన మూడేళ్లవరకు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు అవకాశం లేదు.
12కు చేరిన అవిశ్వాస నోటీసులు
అదే బాటలో మరిన్ని మున్సిపాలిటీలు
రాజ్భవన్ దాటని మున్సిపల్ చట్ట సవరణ బిల్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ రాజకీయరగడ రోజు రోజుకూ రాజుకుంటోంది. పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన మూడేళ్లవరకు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు అవకాశం లేదు. ఆ గడువు గతనెల 27వ తేదీతో ముగియటంతో పలు మున్సిపాలిటీల్లో అసమ్మతికి తెరలేచింది. గురువారం నాటికి ఒక మున్సిపల్ కార్పొరేషన్తోపాటు 11 మున్సిపాలిటీల ఛైర్మన్లపై కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. మరిన్ని మున్సిపాలిటీల్లోని అసంతృప్త కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. అసమ్మతులు రాజుకుంటాయని ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం మూడేళ్ల వ్యవధిని నాలుగేళ్లకు పెంచేలా చట్ట సవరణ చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సవరణకు చట్టబద్ధత కల్పించేందుకు గత ఏడాది సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును గవర్నర్కు పంపింది. గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న ఏడు బిల్లుల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కూడా ఉండటంతో అసంతృప్తులకు అవకాశం చిక్కింది.
నోటీసులు ఇచ్చిన వాటిలో...
రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు కొలువుదీరి మూడేళ్లు పూర్తయింది. మేడ్చల్ జిల్లాలోని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు మేడ్చల్, దమ్మాయిగూడ మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులను అధికారులకు అందజేశారు. ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్పేట (రంగారెడ్డి జిల్లా), తాండూరు, వికారాబాద్ (వికారాబాద్ జిల్లా), యాదగిరిగుట్ట, ఆలేరు (యాదాద్రి జిల్లా), చండూరు, నందికొండ (నల్గొండ జిల్లా), హుజూరాబాద్ (కరీంనగర్ జిల్లా) మున్సిపాలిటీల్లో ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నోటీసులను కౌన్సిలర్లు ఇప్పటికే అందజేశారు. కొన్ని మున్సిపాలిటీలకు చెందిన అసంతృప్త నాయకులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. మరికొన్నిచోట్ల అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆయా నియోజకవర్గ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. నోటీసులకు వ్యతిరేకంగా తాండూరు, వికారాబాద్, యాదగిరిగుట్ట తదితర మున్సిపాలిటీల ఛైర్మన్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది.
30 రోజుల్లోగా సమావేశాలు...
కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చిన తర్వాత వాటిని ఉపసంహరించుకునే అవకాశం లేదన్నది సమాచారం. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలంటే మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లోని 50 శాతం మంది సభ్యుల సంతకాలతో అధికారులకు నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసు అందిన 30 పని దినాల్లో సమావేశాన్ని నిర్వహించాలని 2019 మున్సిపల్ చట్టం స్పష్టం చేస్తోంది. నిర్ధారిత గడువులోగా అవిశ్వాసాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. అందులో మూడింట రెండొంతుల మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే ఆమోదం పొందుతుంది. అనంతరం నూతన ఛైర్మన్ను ఎన్నుకునేందుకు మరోదఫా సమావేశ నిర్వహణ కోసం అధికారులు నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.