Mancherial: కోరికలు తీర్చలేదని కక్ష కట్టారు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పలు ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆరిజిన్ డెయిరీ నిర్వాహకురాలు బోడపాటి శేజల్ అలియాస్ నందిని మాట్లాడుతున్న వీడియోలు, ఆడియోలు కొద్ది రోజులుగా కలకలం రేపుతున్నాయి.
కేసుల పేరుతో వేధిస్తున్నారు..
బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆరిజిన్ డెయిరీ నిర్వాహకుల ఆరోపణలు
ఈనాడు డిజిటల్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పలు ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆరిజిన్ డెయిరీ నిర్వాహకురాలు బోడపాటి శేజల్ అలియాస్ నందిని మాట్లాడుతున్న వీడియోలు, ఆడియోలు కొద్ది రోజులుగా కలకలం రేపుతున్నాయి. డెయిరీ నిర్వాహకులు ఎమ్మెల్యేతో చేసినట్లు చెబుతున్న వాట్సప్ ఛాటింగ్లు కూడా వైరల్ అవుతున్నాయి. తమ డెయిరీ కోసం ఎమ్మెల్యే చిన్నయ్య రెండెకరాల స్థలం సమకూర్చారని, ప్రతిఫలంగా తన వ్యక్తులకు సంస్థలో వాటా ఇవ్వాలని కోరారని శేజల్ ఆరోపించారు. ‘ఓ సారి ఆయనను కలవడానికి వెళ్లినప్పుడు.. నాతో పాటు ఉన్న యువతిని రాత్రికి పంపించమని ఆయన అడిగారు. అటువంటి వాళ్లం కాదని చెప్పినా.. పట్టుబట్టడంతో మాకు తెలిసిన వ్యక్తుల ద్వారా బ్రోకర్ల నంబర్లు ఎమ్మెల్యేకు ఇచ్చాం. అయితే దళితబంధు పథకం గురించి మాట్లాడదామంటూ ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి పోలీసులకు అప్పగించారు’ అని శేజల్ తెలిపారు. ‘మహిళనని చూడకుండా పోలీసులు నన్ను మూడు రోజులపాటు పోలీస్ స్టేషన్లోనే ఉంచి రిమాండ్కు పంపించారు. బెయిల్పై బయటికొచ్చినా ఎమ్మెల్యే అనుచరులు వెంబడించేవారు. లక్షెట్టిపేట పోలీస్స్టేషన్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు తీసుకోలేదు. ప్రాణభయం ఉందని చెప్పినా.. నేరుగా వచ్చి ఇవ్వాలని అంటున్నారు. ఎమ్మెల్యేతో మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయని పోలీసులు అనేవారు. ఇటీవల కూడా మాపై మరో రెండు కేసులు పెట్టించారు. రాజీ చేసుకోవాలంటూ ఎమ్మెల్యే పలువురితో ఫోన్ చేయిస్తున్నారు’ అని శేజల్ ఆరోపించారు.
ఓ మంత్రిపైనా ఆరోపణలు
ఇతర రాష్ట్రాల నుంచి పశువులను తెప్పించి వాటికి దళితబంధు పథకం వర్తింపచేయడానికి ఒక మంత్రి రూ.కోటి అడుగుతున్నారని డెయిరీ నిర్వాహకుడు ఆదినారాయణ ఎమ్మెల్యేతో వాట్సప్ చాట్ చేసినట్లున్న స్క్రీన్షాట్లు ప్రచారమవుతున్నాయి. ట్యాబ్లెట్ తీసుకో, కాఫ్, ఫీవర్ ఉందా, 8 గంటలకు ట్యాబ్లెట్ డెలివరీ బాస్, డెలివరీ అయ్యింది బాస్, ఎంజాయ్ బాస్ అనే చాటింగ్ కూడా ఉంది. ఇందులో ట్యాబ్లెట్ అంటే అమ్మాయి అని డెయిరీ నిర్వాహకులు చెబుతున్నారు.
లైంగికంగా ఎవరినీ వేధించలేదు
- దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే, బెల్లంపల్లి
డెయిరీకి సంబంధించిన మహిళలను లైంగికంగా వేధించాననే ఆరోపణలు నిరాధారం. ఇదంతా భాజపా, కాంగ్రెస్ నాయకులు పన్నిన కుట్ర. రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని డెయిరీకి మద్దతిచ్చాను. నిర్వాహకులు రైతుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. ఆ సొమ్ము విషయమై ఎండీ ఆదినారాయణ స్పందించకపోవడంతో రైతులు కేసులు పెట్టారు. అతడిపై ఏపీలోని అత్తిలి పోలీస్ స్టేషన్లో ఒకటి, హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మరొకటి కేసులున్నాయని తేలింది.
రూ. 1.50 కోట్ల వరకు నష్టపోయాం
- ఆదినారాయణ, ఎండీ, ఆరిజిన్ డెయిరీ
ఎమ్మెల్యే చిన్నయ్య మా డెయిరీ కోసం లావుణి పట్టా ఉన్న భూమిని చూపించి రూ.20 లక్షలు తీసుకున్నారు. ఈ భూమి షిండే దేవానంద్ పేరిట ఉంది. అదేమని అడిగితే తాను చూసుకుంటానని ఎమ్మెల్యే చెప్పారు. పార్టీ సభలంటూ డబ్బులివ్వాలని ఒత్తిడి చేసేవారు. మా సంస్థలో పనిచేసే మహిళలను పంపించాలని అడిగేవారు. ఆయన కోరికలు తీర్చకపోవడంతో కక్ష కట్టి కేసులు పెట్టించారు. ఇప్పటివరకు రూ.1.50 కోట్లు నష్టపోయాం. రైతులెవరినీ మేం మోసం చేయలేదు.
ఏమిటీ డెయిరీ కథ?
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చౌటపాలెం గ్రామానికి చెందిన కందిమల్ల ఆదినారాయణ, అనంతపురం జిల్లా గంగవరానికి చెందిన బోడపాటి శేజల్ కలిసి.. 2022 మార్చిలో బెల్లంపల్లిలో స్థాపించిన ఆరిజిన్ డెయిరీని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. రైతులు 35 శాతం డబ్బులు చెల్లిస్తే మిగతా 65 శాతం మొత్తాన్ని కంపెనీ ద్వారా రుణంగా అందించి గేదెలు, ఆవులను కొనుగోలు చేస్తామని నిర్వాహకులు చెప్పారు. పశువుల బీమా పేరిట రూ.708 చొప్పున మంచిర్యాల జిల్లాలో 1000 మంది నుంచి రూ.7.08 లక్షలు వసూలు చేశారు. పశువుల రుణాల పేరిట 18 మంది నుంచి 35 శాతం వాటా చొప్పున రూ.21 లక్షలు తీసుకున్నారు. కానీ వారు తమకు తిరిగి చెల్లింపులు చేయలేదని రైతులు ఫిర్యాదు చేయడంతో ఆదినారాయణ, శేజల్పై కేసు నమోదు చేసినట్లు ఈ ఏడాది జనవరి 14న అప్పటి మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే