ఏపీలో పేదల ఇళ్లపై పిడుగు!
సభ, సమావేశం.. వేదిక ఏదైనా సరే పేదలపై తమకే పేటెంట్ హక్కు ఉందనేలా పదే పదే మాట్లాడే ఏపీ సీఎం జగన్.. అదే పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు.
46 వేల మంది గృహాల రద్దు?
ఆ స్థానంలో అమరావతి లబ్ధిదారులకు కేటాయింపు
కేంద్రానికి నివేదించాలని నిర్ణయం
ఇప్పటికే వేల సంఖ్యలో రద్దు జాబితాలోకి
ఈనాడు డిజిటల్, అమరావతి: సభ, సమావేశం.. వేదిక ఏదైనా సరే పేదలపై తమకే పేటెంట్ హక్కు ఉందనేలా పదే పదే మాట్లాడే ఏపీ సీఎం జగన్.. అదే పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు. మాటెత్తితే 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. 22 లక్షల గృహాల్ని కట్టిస్తున్నామని చెప్పే ఆయన ఆర్థిక స్తోమత లేక కట్టుకునేందుకు ముందుకురాని ఏపీలోని 46 వేల మంది కడు పేదలకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయబోతున్నారు. గడిచిన రెండేళ్లలో ఇప్పటికే పలుమార్లు కొన్ని వేల మంది పేదల ఇళ్లను రద్దు చేశారు. అది కనిపించకుండా వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను చేర్చి ‘లెక్క’ సరిచేస్తున్నారు. 2020 డిసెంబర్లో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ప్రభుత్వమే ఇళ్లు కట్టించాలని లబ్ధిదారులు అడిగితే నిర్మించి తాళాన్ని వారి చేతికి ఇస్తామని చెప్పిన జగన్.. ఆ తర్వాత చేతులెత్తేశారు. తమకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని బడుగు, బలహీనవర్గాలు మొరపెట్టుకుంటున్నా కనికరించడం లేదు. నిర్దాక్షిణ్యంగా రద్దు జాబితాలో చేర్చేస్తున్నారు. పేదల పక్షాన నిలవడమంటే ఇదేనా అని ఆ అభాగ్యులు ప్రశ్నిస్తున్నారు. రద్దు చేయబోతున్న ఈ ఇళ్ల స్థానంలోనే రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయించిన వారికి మంజూరు చేయాలని కేంద్రానికి నివేదించనున్నారు. కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు.
53 వేల కొత్త ఇళ్ల మంజూరుకు ప్రతిపాదన
‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం పర్యవేక్షణకు సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంసీ) సమావేశాన్ని నెలకోసారి నిర్వహిస్తుంది. ఈ కమిటీ ఆమోదిస్తేనే ఈ పథకం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మినహా ఇంటి నిర్మాణానికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వ సాయంపైనే ఆధారపడింది. ఈ నేపథ్యంలో ఇళ్ల మంజూరుకు సీఎస్ఎంసీ ఆమోదం తప్పనిసరి. అయితే ఈ పథకం కింద వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మంజూరు చేసిన ఇళ్లను 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం నిర్దేశించింది. కొన్ని నెలలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని కోరినా ససేమిరా అంటోంది. దీంతో కొత్త ఎత్తుగడ వేసిన జగన్ ప్రభుత్వం.. వివిధ కారణాలతో ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు రాని పేదల పేరిట మంజూరైనవి రద్దు చేసి, కొత్తగా ఎంపిక చేసిన వారి పేరు మీద కేటాయించాలని కోరుతోంది. ఆ ప్రకారమే కేంద్రం కూడా అనుమతి ఇస్తోంది. తాజాగా రాజధానేతరులకు అమరావతిలో 50 వేల ఇళ్ల స్థలాలు కేటాయించింది. వీరి ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. జులైలో ఇక్కడ ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈ నెలలో దిల్లీలో జరిగే సీఎస్ఎంసీ సమావేశంలో కేంద్రం నుంచి అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి పొందేలా అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 46,928 ఇళ్లను రద్దు చేసి వాటి స్థానంలో 53,011 గృహాల్ని కొత్తగా మంజూరు చేయాలని కోరబోతున్నట్లు తెలిసింది. కొత్త మంజూరులో ఎన్టీఆర్ జిల్లాలో 23,821, గుంటూరు జిల్లాలో 23,196, వైయస్ఆర్ జిల్లాలో 2,431, ప్రకాశం జిల్లాలో 1,866, మిగతావి కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఉన్నాయి.
రద్దు జాబితాలో సీఎం సొంత జిల్లాకు 2వ స్థానం
మొత్తంగా 148 ప్రాజెక్టుల పరిధిలోని 46,928 గృహాల్ని రద్దు చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో అత్యధికంగా నంద్యాల జిల్లాలో 8,959 ఉండగా.. ఆ తర్వాత స్థానం ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వైయస్ఆర్దే. ఇక్కడ 15 ప్రాజెక్టుల పరిధిలో 8,126 ఇళ్లను రద్దు జాబితాలో చేర్చారు. అనకాపల్లి జిల్లాలో 4,806, పల్నాడులో 3,094 ఇళ్లు ఆ జాబితాలో ఉన్నాయి. 26 జిల్లాల ప్రాతిపదికన చూస్తే 9 జిల్లాల్లో 2 వేలకు పైగా గృహాల్ని రద్దు చేయబోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే