ఏపీలో పేదల ఇళ్లపై పిడుగు!
సభ, సమావేశం.. వేదిక ఏదైనా సరే పేదలపై తమకే పేటెంట్ హక్కు ఉందనేలా పదే పదే మాట్లాడే ఏపీ సీఎం జగన్.. అదే పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు.
46 వేల మంది గృహాల రద్దు?
ఆ స్థానంలో అమరావతి లబ్ధిదారులకు కేటాయింపు
కేంద్రానికి నివేదించాలని నిర్ణయం
ఇప్పటికే వేల సంఖ్యలో రద్దు జాబితాలోకి
ఈనాడు డిజిటల్, అమరావతి: సభ, సమావేశం.. వేదిక ఏదైనా సరే పేదలపై తమకే పేటెంట్ హక్కు ఉందనేలా పదే పదే మాట్లాడే ఏపీ సీఎం జగన్.. అదే పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు. మాటెత్తితే 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. 22 లక్షల గృహాల్ని కట్టిస్తున్నామని చెప్పే ఆయన ఆర్థిక స్తోమత లేక కట్టుకునేందుకు ముందుకురాని ఏపీలోని 46 వేల మంది కడు పేదలకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయబోతున్నారు. గడిచిన రెండేళ్లలో ఇప్పటికే పలుమార్లు కొన్ని వేల మంది పేదల ఇళ్లను రద్దు చేశారు. అది కనిపించకుండా వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను చేర్చి ‘లెక్క’ సరిచేస్తున్నారు. 2020 డిసెంబర్లో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ప్రభుత్వమే ఇళ్లు కట్టించాలని లబ్ధిదారులు అడిగితే నిర్మించి తాళాన్ని వారి చేతికి ఇస్తామని చెప్పిన జగన్.. ఆ తర్వాత చేతులెత్తేశారు. తమకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని బడుగు, బలహీనవర్గాలు మొరపెట్టుకుంటున్నా కనికరించడం లేదు. నిర్దాక్షిణ్యంగా రద్దు జాబితాలో చేర్చేస్తున్నారు. పేదల పక్షాన నిలవడమంటే ఇదేనా అని ఆ అభాగ్యులు ప్రశ్నిస్తున్నారు. రద్దు చేయబోతున్న ఈ ఇళ్ల స్థానంలోనే రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయించిన వారికి మంజూరు చేయాలని కేంద్రానికి నివేదించనున్నారు. కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు.
53 వేల కొత్త ఇళ్ల మంజూరుకు ప్రతిపాదన
‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం పర్యవేక్షణకు సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంసీ) సమావేశాన్ని నెలకోసారి నిర్వహిస్తుంది. ఈ కమిటీ ఆమోదిస్తేనే ఈ పథకం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మినహా ఇంటి నిర్మాణానికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వ సాయంపైనే ఆధారపడింది. ఈ నేపథ్యంలో ఇళ్ల మంజూరుకు సీఎస్ఎంసీ ఆమోదం తప్పనిసరి. అయితే ఈ పథకం కింద వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మంజూరు చేసిన ఇళ్లను 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం నిర్దేశించింది. కొన్ని నెలలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని కోరినా ససేమిరా అంటోంది. దీంతో కొత్త ఎత్తుగడ వేసిన జగన్ ప్రభుత్వం.. వివిధ కారణాలతో ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు రాని పేదల పేరిట మంజూరైనవి రద్దు చేసి, కొత్తగా ఎంపిక చేసిన వారి పేరు మీద కేటాయించాలని కోరుతోంది. ఆ ప్రకారమే కేంద్రం కూడా అనుమతి ఇస్తోంది. తాజాగా రాజధానేతరులకు అమరావతిలో 50 వేల ఇళ్ల స్థలాలు కేటాయించింది. వీరి ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. జులైలో ఇక్కడ ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈ నెలలో దిల్లీలో జరిగే సీఎస్ఎంసీ సమావేశంలో కేంద్రం నుంచి అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి పొందేలా అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 46,928 ఇళ్లను రద్దు చేసి వాటి స్థానంలో 53,011 గృహాల్ని కొత్తగా మంజూరు చేయాలని కోరబోతున్నట్లు తెలిసింది. కొత్త మంజూరులో ఎన్టీఆర్ జిల్లాలో 23,821, గుంటూరు జిల్లాలో 23,196, వైయస్ఆర్ జిల్లాలో 2,431, ప్రకాశం జిల్లాలో 1,866, మిగతావి కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఉన్నాయి.
రద్దు జాబితాలో సీఎం సొంత జిల్లాకు 2వ స్థానం
మొత్తంగా 148 ప్రాజెక్టుల పరిధిలోని 46,928 గృహాల్ని రద్దు చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో అత్యధికంగా నంద్యాల జిల్లాలో 8,959 ఉండగా.. ఆ తర్వాత స్థానం ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వైయస్ఆర్దే. ఇక్కడ 15 ప్రాజెక్టుల పరిధిలో 8,126 ఇళ్లను రద్దు జాబితాలో చేర్చారు. అనకాపల్లి జిల్లాలో 4,806, పల్నాడులో 3,094 ఇళ్లు ఆ జాబితాలో ఉన్నాయి. 26 జిల్లాల ప్రాతిపదికన చూస్తే 9 జిల్లాల్లో 2 వేలకు పైగా గృహాల్ని రద్దు చేయబోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
Bapatla: రహదారిపై యుద్ధవిమానాల ల్యాండింగ్
బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. -
తెలంగాణ సొమ్ము దిల్లీకి
భారాస, కాంగ్రెస్ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదు. -
గవర్నర్ తమిళిసై రాజీనామా
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు. -
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏడాది వయస్సున్న కుమారుడి తలకు ఏర్పడిన భారీ కణితి ప్రాణాంతకంగా మారింది. తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆప్ నేతలకు రూ.100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర
దిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య
-
రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి
-
సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్లు
రాష్ట్రంలో సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం వడగళ్లవాన పడింది. రాజన్న సిరిసిల్ల మండలంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఓ రైతు మరణించారు. -
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. -
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత గత ఏడాది మార్చి 15న దాఖలు చేసిన రిట్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. -
తల్లీ వందనం.. తపనకు అభినందనం
దివ్యాంగుడైన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి(బి)కి చెందిన చరణ్కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా, చేతుల కదలికలూ పరిమితంగానే ఉన్నాయి. -
యాదగిరీశుడి కల్యాణ వైభోగం
యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. గజ వాహనంపై నారసింహుడు, పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి.. మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని కల్యాణ తతంగాలను చేపట్టారు. -
బోరుతోనే ఊరికి పేరు.. 40 ఏళ్లుగా ఇంకని తీరు
ఆదిలాబాద్ గ్రామీణ మండలం తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్గూడ గ్రామంలో ఉన్న చేతిపంపు నుంచి నిరంతరం నీరు ఉబికివస్తోంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి.. ఈ చేతిపంపు ఏర్పాటు వేశారు. దీని కారణంగానే గ్రామానికి బోరింగ్గూడ అని పేరొచ్చిందని తిప్ప మాజీ సర్పంచి కిషన్ తెలిపారు. -
ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్డు.. దేశంలోనే వెరీగుడ్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది. -
ఎన్నికల తర్వాతే వీసీల నియామకాలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామక ప్రక్రియ లోక్సభ ఎన్నికల తర్వాతే చేపట్టనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. -
TS News: భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు
ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. -
గొత్తికోయల ఆక్రమణలో 26 వేల ఎకరాలు
గొత్తికోయలు రాష్ట్రంలో 26 వేల ఎకరాల అటవీ ప్రాంతాల్ని ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ వివరాల్ని కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు నివేదించారు. -
‘స్టేట్మెంట్’ దాఖలు విషయంలో అనిశ్చితి!
తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్మెంట్ ఆఫ్ కేస్’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది. -
20 నుంచి మళ్లీ అయ్యర్ కమిటీ పర్యటన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో లోటుపాట్లపై పరిశీలనకు నియమించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) నిపుణుల కమిటీ ఈనెల 20న హైదరాబాద్కు రానుంది. -
ప్రభుత్వ ఆదేశాలనే అమలు చేస్తున్నాం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు జీరో బిల్లులకు విద్యుత్తు చట్ట ప్రకారం రాయితీ నిధులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తెలిపింది. దీనికి సంబంధించిన వివరణ పత్రాన్ని సోమవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్