ఒంటిపై రక్తపు దద్దుర్లు వస్తే చికిత్సకు ఆలస్యం చేయొద్దు
రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు మృత్యువాత పడుతున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి 23 వరకు రోజుకు దాదాపు 20 డెంగీ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
డెంగీలో ఇదే ముప్పు సంకేతం
‘ఈనాడు’తో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు మృత్యువాత పడుతున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి 23 వరకు రోజుకు దాదాపు 20 డెంగీ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఈ వైరస్ సోకిందని ఎలా గుర్తించాలి.. ఎప్పుడు ప్రమాదం.. ఆసుపత్రిలో ఎప్పుడు చేర్చాలి.. ప్లేట్లెట్లు ఎప్పుడు ఎక్కించాలి.. తదితర అంశాలను గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు ‘ఈనాడు’కు వివరించారు.
ప్లేట్లెట్లు ఎప్పుడు ఎక్కించాలి?
ఈ వైరస్ శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రక్తం గడ్డకట్టడంలో కీలకంగా వ్యవహరించే ప్లేట్లెట్లను ఇది తగ్గించేస్తుంది. ఫలితంగా రక్తం పలుచబడి రక్తస్రావానికి కారణమవుతుంది. 50 వేలకు తగ్గడంతోపాటు రక్తస్రావం జరుగుతూ ఉంటే ప్లేట్లెట్లు ఎక్కించాలి. రక్తస్రావం లేకున్నా.. 20 వేలకు ప్లేట్లెట్ల కౌంట్ పడిపోతే.. మెదడు ఇతర అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరగక ముందే ఎక్కిస్తారు. రోగి పరిస్థితిని బట్టి వైద్యులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు.
ఎన్ని రోజులకు డెంగీ లక్షణాలు బయటపడతాయి?
ఏడిస్ ఈజిప్టి దోమల వల్ల డెంగీ సోకుతుంది. అప్పటికే డెంగీ సోకిన వ్యక్తిని కుట్టిన దోమ ఇతరులను కుట్టడం ద్వారా వారికి కూడా వ్యాపిస్తుంది. 4-7 రోజుల్లో లక్షణాలు బయట పడతాయి. 101-104 డిగ్రీల జ్వరం, తీవ్ర తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్లు, తీవ్ర నడుంనొప్పి తదితర లక్షణాలు ఉంటే డెంగీగా అనుమానించాలి. వెంటనే ఎన్ఎస్1 పరీక్ష చేయించుకోవాలి. మూడు రోజుల్లోపే ఈ పరీక్షలో డెంగీ బయట పడుతుంది. తర్వాత డెంగీ ఉందా లేదా చూడాలంటే ఐజీఎం పరీక్షతోనే సాధ్యం. ఈ పరీక్షలో కూడా డెంగీ లేనట్లు తేలితే.. అప్పుడు మలేరియా, గన్యా ఇతర పరీక్షలు అవసరం అవుతాయి. మరికొందరికి డెంగీ-మలేరియా.. డెంగీ-కరోనా.. డెంగీ-టైఫాయిడ్.. ఇలా కలయికతో కూడా జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
డెంగీ బాధితులు ఆసుపత్రిలో చేరే అవసరం ఎప్పుడు ఉంటుంది?
ముఖ్యంగా డెంగీ హెమరేజిక్, డెంగీ షాక్ సిండ్రోమ్ లక్షణాలు ఉంటే రోగిని ఆసుపత్రికి తరలించాలి. ఇలాంటప్పుడు రోగి శరీర భాగాల నుంచి రక్తస్రావం, రక్తనాళాల్లో ద్రవాల(క్యాపెల్లర్) లీకేజీ ఉంటుంది. అప్పుడు కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్, పండ్ల రసాలు, ఇతర ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. ముఖ్యంగా ప్లేట్లెట్లు తగ్గడం కంటే క్యాపెల్లర్ లీకేజీతోనే ఎక్కువ ప్రమాదం. దీంతో బీపీ, పల్స్ పడిపోయి.. మెదడు, గుండె, కాలేయం, మూత్రపిండాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. వెంటనే రోగి షాక్లోకి వెళతారు. ఈ సమయంలో తక్షణం వైద్యం అందించాలి. లేదంటే చనిపోయే ప్రమాదం ఉంటుంది. మామూలుగా 3-4 రోజుల్లో డెంగీ నియంత్రణలోకి వస్తుంది. అప్పటికీ జ్వరం తగ్గకపోయినా.. శరీరంపై రక్తపు దద్దుర్లు ఏర్పడినా.. తీవ్ర తలనొప్పి, పొట్టలో నొప్పి వేధిస్తున్నా.. వెంటనే షాక్ సిండ్రోమ్గా భావించి రోగులను ఆసుపత్రికి తరలించాలి.
ఎక్కువగా ఎవరికి ప్రమాదం?
స్త్రీలు, పిల్లలు, పెద్ద వయసు వారికి ఎక్కువ ప్రమాదం. గర్భిణుల్లో కొన్నిసార్లు గర్భస్రావం కూడా సంభవిస్తుంది. మధుమేహం, గుండె, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి మరింత ఇబ్బంది. గతంలో వచ్చిన వారికి మళ్లీ వచ్చే అవకాశం ఉంది.
కొందరు పెయిన్ కిల్లర్లు వాడేస్తుంటారు ఎలా?
డెంగీకి ప్రధానంగా లక్షణాలు, సమస్యలను బట్టి చికిత్స ఉంటుంది. డెంగీతో ఒళ్లు, కండరాలు, నడుం నొప్పులు ఎక్కువగా ఉంటాయి. దీంతో కొందరు వైద్యుల సూచనలు లేకుండానే పెయిన్ కిల్లర్లు వాడేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. ఫలితంగా ప్లేట్లెట్లు వేగంగా తగ్గిపోతాయి. వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం నడుచుకోవాలి.
గుండె సమస్యలు ఉన్నవారికి డెంగీ సోకితే...?
గుండె సమస్యలు ఉన్నవారు.. రక్తం చిక్కబడకుండా మందులు వాడుతుంటారు. ఇలాంటి వారికి డెంగీ సోకితే ఆ మందులు ఆపేసి వెంటనే వైద్యులను సంప్రదించాలి.
దోమల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు అవసరం...?
ఇంట్లో దోమలను తరిమే మందులు, తెరలు వాడాలి. దోమలు 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించలేవు. అయితే మనపై వాలితే మనతోపాటే పైఅంతస్తుల్లోకి చేరుకుంటాయి. జీవితచక్రాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. అందువల్ల పూల కుండీలు, కూలర్లు, ఖాళీ టైర్లు, సీసాలు, నీటి డ్రమ్ములు, విరిగిన పెంకులు లాంటి వాటిలో ఉన్న నీటిని పూర్తిగా పారబోసి ఆరబెట్టడం ద్వారా లార్వా చనిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం గురువారం సెలవు దినంగా ప్రకటించింది. -
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది. -
TS Elections: పట్నం బద్ధకించింది.. పల్లె ఓటెత్తింది
రాష్ట్రంలో రానున్న అయిదేళ్ల పాలనను వేలికొనలతో నిర్ణయించేందుకు పల్లె ఓటర్లు బారులు తీరగా.. పట్టణాలు, నగరాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. -
Chandrababu: తిరుపతిలో బాబుకు జన నీరాజనం
తెదేపా అధినేత చంద్రబాబుకు తిరుపతిలో ప్రజలు నీరాజనాలు పలికారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. -
స్వల్ప ఘర్షణలు.. లాఠీఛార్జి
రాష్ట్రంలో గురువారం శాసనసభ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు.. స్వల్ప ఘర్షణలు.. అక్కడక్కడా లాఠీఛార్జి మినహా ప్రశాంతంగా ముగిశాయి. -
సాగర్ ప్రాజెక్టు వద్ద ఘర్షణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఏపీ పోలీసులు భారీగా ప్రాజెక్టు వద్దకు చేరుకొని రక్షణ గేట్లు విరగ్గొట్టి తమపై దాడి చేశారని తెలంగాణ పోలీసులు ఆరోపించారు. -
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జరిగిన లాంగ్ మారథాన్లో ఎన్నో మలుపుల మధ్య పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగామని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. -
వరవరరావు రెండో కంటి చికిత్సకు కోర్టు అనుమతి
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసు(2018)లో నిందితుడిగా ఉన్న వామపక్ష భావజాల కార్యకర్త వరవరరావు ఎడమ కంటికి కేటరాక్టు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లేందుకు ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. -
మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానం
దేశంలో మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రాథమిక పశుపోషణ గణాంకాల(బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్) వార్షిక నివేదిక-2023 వెల్లడించింది. -
లాసెట్ తొలి విడతలో 5,912 మందికి సీట్లు
లాసెట్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను గురువారం కేటాయించారు. మూడేళ్లు, అయిదేళ్ల ఎల్ఎల్బీతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు మొత్తం 6,894 అందుబాటులో ఉన్నాయి. -
మేం నిరాధార ఆరోపణలు చేయలేదు!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. -
ఇదీ సంగతి!
-
ఉచిత ఇసుక కేసులో.. చంద్రబాబు బెయిల్పై విచారణ 6కు వాయిదా
గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ డిసెంబరు 6కు వాయిదా పడింది. -
12 వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో దాఖలు పిటిషన్పై విచారణ డిసెంబరు 12కు వాయిదా పడింది. -
వలలో చిక్కిన చిరుత మృతి
కోతుల నుంచి పంట రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుత పులి చిక్కి మృతి చెందింది. -
ఉపకరించిన ఓటరు సమాచార కేంద్రాలు
ఓటరు స్లిప్పులు అందని ఓటర్లకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాలు ఉపకరించాయి. రెండు.. అంతకుమించి కేంద్రాలు ఉన్న చోట వాటిని ఏర్పాటు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?