కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం

వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 20 Apr 2024 04:42 IST

నవాబుపేట, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై భరత్‌భూషణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మైతాబ్‌ఖాన్‌గూడ వైపు నుంచి వస్తున్న టీఎస్‌09ఈక్యూ0004 నంబరు కారును శుక్రవారం సాయంత్రం పోలీసులు మండల కేంద్రంలోని పులుమామిది చౌరస్తా వద్ద తనిఖీ చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదు ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. కారులో డ్రైవర్‌తోపాటు రంగారెడ్డి జిల్లా మోఖిలకు చెందిన స్థిరాస్తి వ్యాపారి రవీందర్‌రావు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని