Afghanistan: అప్పట్లో పేరొందిన జర్నలిస్టు.. ‘తాలిబన్ల ఇలాకాలో సమోసాలు అమ్ముకుంటూ..’
అఫ్గాన్లో గుర్తింపు పొందిన ఓ జర్నలిస్టు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రస్తుతం వీధుల్లో ఆహారం అమ్ముకుంటున్న ఫొటోలు అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
దీనస్థితిలో అఫ్గాన్ పౌరులు
కాబుల్: అఫ్గానిస్థాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత ఇతర దేశాలతో అక్కడి ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల పాలనను ఇప్పటికీ ప్రపంచ దేశాలు గుర్తించకపోవడంతో వారితో దౌత్య, వాణిజ్య సంబంధాలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఇలా అక్కడ నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ఎంతోమంది నైపుణ్యం కలిగిన అఫ్గాన్వాసులు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అఫ్గాన్లో గుర్తింపు పొందిన ఓ జర్నలిస్టు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రస్తుతం వీధుల్లో ఆహారం అమ్ముకుంటున్న ఫొటోలు అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
ముసా మొహమ్మది అనే అఫ్గాన్ టీవీ యాంకర్ అక్కడి వీధుల్లో ఆహారం అమ్ముకుంటూ జీవనం సాగిస్తోన్న ఫొటోను అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో పనిచేసిన కబీర్ హక్మల్ ట్వీట్ చేశారు. ‘ఎన్నో ఏళ్లుగా మీడియా రంగంలో ఉన్న హక్మల్.. అత్యంత దారుణమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆయనకు ఎటువంటి ఆదాయం లేదు. దీంతో ప్రస్తుతం వీధుల్లో ఆహారం అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత అఫ్గాన్ కనీవిని ఎరుగని పేదరికాన్ని ఎదుర్కొంటోంది’ అని పేర్కొన్నాడు. కబీర్ హక్మల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతోపాటు అక్కడి నేషనల్ రేడియో, టెలివిజన్ డైరెక్టర్ అహ్మదుల్లా వాసిక్ దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన ఆయన.. మాజీ టీవీ జర్నలిస్టుకు తన విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నాడు. అంతేకాకుండా అఫ్గాన్ నిపుణులందరూ తమకు ఎంతో అవసరమని చెప్పుకొచ్చాడు.
ఇదిలాఉంటే, తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత అఫ్గాన్లో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే మహిళా ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తోన్న తాలిబన్లు.. బాలికల విద్యకు ఆటంకం కలిగిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. మరోవైపు తాలిబన్ల పాలనలో అఫ్గాన్ తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఐరాస కూడా పేర్కొంది. ఇలా అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న అఫ్గాన్లో పౌరుల తలసరి ఆదాయం దారుణంగా పడిపోయిందని ప్రపంచ బ్యాంకు ఇటీవలే వెల్లడించింది. ప్రపంచంలో పేదదేశాల్లో ఒకటైన అఫ్గాన్.. ప్రస్తుతం మరింత పేదదిగా మారిందని ప్రపంచ బ్యాంకు సీనియర్ ఆర్థికవేత్త టొబియస్ హక్ ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్ ఖండించారు. భిన్న సమాజాలకు చెందిన పౌరుల కోసం భారత్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయన్నారు. -
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!