Brazil: భగ్గుమన్న బ్రెజిల్.. బోల్సొనారో మద్దతుదారుల అరాచకం
బ్రెజిల్(Brazil)లో అధికారం కోసం బోల్సొనారో మద్దతుదారులు ప్రభుత్వ భవనాల ఆక్రమణ మొదలుపెట్టారు. 2021లో జనవరి 21న అమెరికా(USA)లో జరిగిన అల్లర్లను ఇవి తలపిస్తున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: బ్రెజిల్(Brazil)లో అధికారం కోసం మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు ఏకంగా దేశ రాజధానిలోని కీలక భవనాలను ఆక్రమించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని అంగీకరించాడానికి వారు నిరాకరిస్తూ.. సుప్రీం కోర్టు, కాంగ్రెస్, అధ్యక్ష భవనాల్లోకి చొచ్చుకెళ్లారు. గత వారమే దేశాధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఆదివారం వేలమంది బోల్సొనారో మద్దతుదారులు భద్రతా వలయాలను ఛేదించుకొని కీలక భవనాల్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో భవనాల్లో ఎవరూ లేరు. కొందరు అందోళనకారులు అక్కడ కిటికీలను, విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. బ్రెజిల్(Brazil)లో సుప్రీం కోర్టు, నేషనల్ కాంగ్రెస్, అధ్యక్ష భవనాలను దేశ అధికార కేంద్రాలుగా భావిస్తారు. ఈ చర్యతో సుప్రీం కోర్టు వద్ద భద్రతా దళాలు హెలికాప్టర్ల నుంచి టియర్ గ్యాస్ను ప్రయోగించాయి. అక్కడ అల్లర్లను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై కూడా దుండగులు దాడులకు దిగారు. సైన్యం జోక్యం చేసుకొని బోల్సొనారోకు అధికారం అప్పజెప్పడంగానీ లేదా ప్రస్తుత అధ్యక్షుడు లూలాను అధికార పీఠం నుంచి దింపేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు మూడు వేల మందికిపైగా అల్లరి మూకలు వీటిల్లో పాల్గొన్నట్లు అంచనావేస్తున్నారు. కొందరు ఆందోళనకారులు పోలీసులపై దాడులకు కూడా దిగారు. సమయం గడిచే కొద్దీ అల్లరి మూకల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేషనల్ కాంగ్రెస్ భవనం వద్ద పోలీసులు ఇప్పటికే 300 మందిని అరెస్టు చేశారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లను ఈ ఘటనలు తలపిస్తున్నాయి.
రంగంలోకి భద్రతా దళాలు..
బ్రెజిల్(Brazil)లో అల్లర్లపై దేశాధ్యక్షుడు లూలా స్పందించారు. బోల్సొనారోనే అల్లరి మూకలను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. ఆ మూకలను ఫాసిస్ట్ మతోన్మాదులుగా అభివర్ణించారు. భద్రతా దళాలు ఈ అల్లర్లను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ‘వారు చేసిన పని వర్ణించలేము.. దోషులు శిక్ష అనుభవించాల్సిందే’ అని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో లూలాకు 50.9 శాతం ఓట్లు లభించగా.. బోల్సొనారోకు 49.1శాతం వచ్చాయి. ఎన్నికల ఫలితాలను అంగీకరించాడానికి బోల్సొనారో నిరాకరిస్తున్నారు. దేశంలోని కోర్టులు, ఎన్నికల వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆయన ఆరోపిస్తున్నారు.
అల్లర్లను ఖండించిన ప్రపంచ నేతలు..
బ్రెజిల్(Brazil)లో చోటు చేసుకొన్న అల్లర్లను ప్రపంచ నేతలు ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్లో అల్లర్లపై స్పందించారు. బ్రెజిల్లోని ప్రభుత్వ భవనాల విధ్వంసం వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. బ్రెజిల్ అధికారులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
* అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వీటిపై స్పందిస్తూ.. ‘‘శాంతియుత అధికార మార్పిడి, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని నేను ఖండిస్తున్నాను. బ్రెజిల్(Brazil)లోని ప్రజాస్వామ్య వ్యవస్థలకు మా మద్దతు ఉంటుంది. ఆ దేశ ప్రజల ఆకాంక్షలను అణగదొక్కకూడదు. నేను భవిష్యత్తులో లూలాతో కలిసి పనిచేయడంపై దృష్టిపెట్టాను’ అని ట్విట్ చేశారు.
* ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ దాడులను ఖండించారు. బ్రెజిల్(Brazil) ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో