Royal Navy: జలాంతర్గాముల్లో లైంగిక వేధింపులు..! విచారణకు ఆదేశించిన బ్రిటన్ రాయల్ నేవీ
బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన జలాంతర్గాముల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోఫీ బ్రూక్ అనే మాజీ నౌకాదళ అధికారి ఇంటర్వ్యూ ఆధారంగా ఓ వార్తాసంస్థ శనివారం ప్రచురించిన కథనం తీవ్ర చర్చనీయాంశమైంది.
లండన్: బ్రిటన్ రాయల్ నేవీ(Royal Navy)కి చెందిన జలాంతర్గామి(Submarines)ల్లో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల(Sexual Harassment) ఆరోపణల విషయంలో స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోఫీ బ్రూక్ అనే మాజీ నౌకాదళ అధికారి ఇంటర్వ్యూ ఆధారంగా ఓ వార్తాసంస్థ శనివారం ప్రచురించిన కథనం తీవ్ర చర్చనీయాంశమైంది. లైంగిక వేధింపులు, మహిళా సిబ్బందిపై ‘అత్యాచార జాబితా’ రూపొందించడం వంటి దుశ్చర్యలను ఆమె వెల్లడించారు. మరికొందరి ఆరోపణలను కథనంలో ఉటంకించారు.
దీంతో.. బ్రిటన్ నేవల్ స్టాఫ్ చీఫ్ బెన్ కీ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ‘లైంగిక ఆరోపణలు దిగ్భ్రాంతికరం. రాయల్ నేవీలో వీటికి చోటే లేదు. ఇటువంటి వాటిని సహించం. దోషులుగా తేలిన వారెవరైనా.. ర్యాంకుతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వెల్లడించారు.
బ్రిటన్ రాయల్ నేవీ.. 2011 నుంచి తన సబ్మెరైన్ సేవల్లో మహిళా సిబ్బందిని నియమిస్తోంది. ఈ క్రమంలోనే సోఫీ బ్రూక్ సైతం విధుల్లో చేరారు. కొన్నేళ్లకు జలాంతర్గామి కమాండర్గా బాధ్యతలు స్వీకరించాలంటూ ఆమెకు ఆదేశాలు అందాయి. కానీ, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు భరించలేక అంతలోనే ఆమె ఆత్మహత్యకు యత్నించారు. దీంతో నేవీ ఆమెను విధుల్లోంచి తొలగించింది. తదనంతరం ఆమె.. తన ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
‘అత్యాచార జాబితానూ రూపొందించారు’
‘విధుల సమయంలో కొంతమంది లైంగికంగా వేధించేవారు. నిద్రపోయే సమయంలో శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవారు. ఏదైనా విపత్తు సంభవించినట్లయితే.. ముందుగా అత్యాచారం చేయాల్సిన మహిళా సిబ్బంది జాబితానూ రూపొందించారు. అందులో నా పేరు కూడా ఆరో స్థానంలో ఉండటం చూసి షాక్కు గురయ్యా. నగ్న చిత్రాల ప్రదర్శన, లైంగిక వేధింపులపై మహిళా సిబ్బంది అధికారికంగా చేసిన ఫిర్యాదునూ తొక్కిపెట్టారు. తనను తాను గాయపర్చుకుని, విధుల నుంచి బయటకు వచ్చినా.. ఆమెపై నిరంతరం నిఘా ఉంచారు’ అని బ్రూక్ తన ఇంటర్వ్యూలో ఆరోపించారు.
బాధితులకు న్యాయ సహాయం అందించే స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ మిలిటరీ జస్టిస్’ డైరెక్టర్ ఎమ్మా నార్టన్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల బారినపడే మహిళల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే అధికారికంగా ఫిర్యాదు చేస్తారని తెలిపారు. న్యాయం దక్కదనే భావనతో చాలామంది ముందుకు రారని చెప్పారు. ఇటువంటి ఫిర్యాదుల విషయంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని రాయల్ నేవీకి పదే పదే సిఫార్సులు చేసినా.. తగు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని నార్టన్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఒక కొలిక్కి రావడం లేదు. దాంతో నెతన్యాహు హెచ్చరించినట్లు రఫా(Rafah)పై దండయాత్ర జరిగితే ఎదురయ్యే విపత్కర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం అవుతోంది. -
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్ ఖండించారు. భిన్న సమాజాలకు చెందిన పౌరుల కోసం భారత్ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయన్నారు. -
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’